అదిగో.. అల్లదిగో యాదాద్రి క్షేత్రం
‘గుట్టకు వెళ్తే పుణ్యం వస్తుంది.. యాదాద్రి నృసింహుడిని దర్శించుకుంటే మనసు కుదుటపడుతుంది’.. ఇది తెలుగునాట నానుడి. అవును. ఇప్పుడు గుట్టకు వెళ్తే ఆధ్యాత్మికానుభూతితో పాటు ఆహ్లాద భావనా కలుగుతుంది. అటు ఆధునిక సాంకేతికత.. ఇటు పురాతన సంప్రదాయం కలగలిసి దేశ చరిత్రలోనే సాటిలేని మేటి ఆలయంగా యాదాద్రి రూపుదిద్దుకుంది. మార్చి 28వ తేదీ 11.55 గంటలకు యాదగిరిగుట్ట దివ్యధామం మహాకుంభ సంప్రోక్షణతో భక్తుల దర్శనానికి సిద్ధమైంది. కళ్లుతిప్పుకోనివ్వని శిల్పకళా సౌందర్యం.. ఎటుచూసినా ప్రకృతి