బుద్ధం శరణం గచ్ఛామి
వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి దినం. బుద్ధుడి జీవిత కాలంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది. బుద్ధుడు ఒకానొక వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు. మరొక వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు అయ్యాడు ఇంకొక వైశాఖ పూర్ణిమ నాడు ఆయన నిర్యాణం చెందాడు. బుద్ధుడు ఈ లోకానికి ఒక జ్యోతి. అందరికీ అనువైన ధర్మమార్గాన్ని సూచించాడు. అంతకుముందు వాటన్నింటినీ ఆయన అనుసరించి చూపాడు. దశావతరాల్లో బుద్ధావతారం కూడా ఒకటనే