మేటి తెలుగు పద్యం
పూలు వేరైనా పూజ ఒక్కటే పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ యొకటి దర్శనములు వేరు దైవంబు యొక్కటి విశ్వదాభిరామ వినురవే వేమన రచించిన పద్యాల్లో సాటి లేని మేటి పద్యమిది. నేటి సామాజిక జీవనాన్ని, అందులోని స్థితిగతులను ఏళ్ల క్రితమే తన పద్యాల్లో వ్యక్తీకరించిన అద్భుత కవి వేమన. అందుకే ఆయన్ను ప్రజాకవిగా వర్ణించారు. ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టడానికే కలం పట్టాడు యోగి వేమన. ‘నా కులం గొప్పది..