మనసునుంచి పుట్టిన సరోవరం
మహిషాసుర మర్దిని మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం వల్ల పార్వతి (దుర్గాదేవి)కి ఈ పేరు వచ్చింది. మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికి ఉన్న వర మహిమ అతనిని మరింత బలవంతుడిని చేసింది. ఆ బల గర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించసాగాడు. దేవతలను, రుషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వారి వేడుకోలుకు