దేవి అలంకరణలు
ఆలయాల్లో నవరాత్రులు చేసే వారు రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ తొమ్మిది అవతారాల్లో సాధకులకు క్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిది దశల్లో ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకులు దశమి నాటికి విజయసిద్ధికి చేరువ అవుతారు. సిద్ధులవుతారు. గనుకనే ఈ పర్వం ‘విజయదశమి’ అయ్యింది. మొదటి రోజు: ఈనాటి అలంకారం బాలా త్రిపురసుందరి. అందమైన, అమాయకమైన బాలికా రూపమిది. సాధన తొలి దశలో దేవిని ఈ