ప్రకృతిపై పగబట్టిన మనిషి
ఒకరోజు నీరు, గాలి, చెట్లు, జంతువులు, పక్షులు, భూమి అన్నీ కలిసి సమావేశం అయ్యాయి. నీరు: అయ్యో దేవుడా! కడుపు నిండా స్వచ్ఛమైన నీళ్లు తాగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. మానవుడు చెత్త, రసాయనాలు, ఎన్నో మృతదేహాలను నాలో పారబోస్తున్నాడు. కంపు భరించలేక క్షణ క్షణం చచ్చిపోతున్నాను. గాలి: ఇంకా నువ్వు నయం అక్కా! నేనైతే హాయిగా ఊపిరి పీల్చుకుని చాలా కాలం అయ్యింది. రకరకాల విష వాయువులతో