సుందోపసుందులు
ఇద్దరు తమలో తాము పోట్లాడుకుని ఇద్దరూ నాశనం కావడాన్ని ‘సుందోప సుందుల న్యాయం’ అంటారు. ఈనాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహా నగరాలలో కూడా భారతదేశ సంస్కారం కలిగిన వారు ఈ సామెతను వాడుతుంటారు. ఎవరైనా ఇద్దరు వివేకం మరిచి పోట్లాడుకుంటుంటే, వారిని సుందోపసుందుల్లా కొట్టుకుంటున్నారని అనడం కద్దు. ఈ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు చెప్పింది. ఒకనాడు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. తన వద్దకు అతిథులుగా వచ్చిన వారి నుంచి