సుందోపసుందులు

ఇద్దరు తమలో తాము పోట్లాడుకుని ఇద్దరూ నాశనం కావడాన్ని ‘సుందోప సుందుల న్యాయం’ అంటారు. ఈనాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహా నగరాలలో కూడా భారతదేశ సంస్కారం కలిగిన వారు ఈ సామెతను వాడుతుంటారు. ఎవరైనా ఇద్దరు వివేకం మరిచి పోట్లాడుకుంటుంటే, వారిని సుందోపసుందుల్లా కొట్టుకుంటున్నారని అనడం కద్దు. ఈ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు చెప్పింది. ఒకనాడు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. తన వద్దకు అతిథులుగా వచ్చిన వారి నుంచి

ఇచ్ఛాపథ్యం.. నిశిక్రందం

ఆయుర్వేద గ్రంథాలలో వైద్యం, రోగం, చికిత్స, రోగ లక్షణాలకు సంబంధించి అనేక పారిభాషిక పదాలు ఉన్నాయి. ఆయా పదాలకు అర్థాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వేలి మీద ఏదైనా ఉబ్బెత్తు వాపు కనిపిస్తే కణుపు వచ్చింది అంటాం. కానీ ఆయుర్వేద పరిభాషలో దీన్ని ‘అంగుళిపర్వ’ అంటారు. ఒళ్లంతా ఒకటే ‘నొప్పులు’ అంటాం. ఆయుర్వేదంలో దీన్ని ‘అంగమర్దం’గా చెప్పారు. శరీరం స్పర్శ జ్ఞానం కోల్పేతే దాన్ని ఆయుర్వేదం ‘అంగసుప్తి’ అని పేర్కొంది. ఇంకా

ప్రళయ కాలం

అది వైకుంఠం. శ్రీమన్నారాయణుడు, శ్రీలక్ష్మీదేవి ఏవో ముచ్చట్లలో మునిగిపోయి ఉన్నారు. అంతలో విష్ణువు, ‘లక్ష్మీ! మా బావ శివుడిని, నా చెల్లి పార్వతిని పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు, ఒక ముఖ్య విషయం వారితో చర్చించాలని అనుకుంటున్నాను. గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించాడు. ‘నాథా! గరుత్మంతుడు అనంతనాగునితో ముచ్చట్లాడుతున్నాడు. ఇప్పుడే పిలుస్తానుండండి’ అని బదులిచ్చింది లక్ష్మి. ‘సమయం మీరిపోతోంది. గరుత్మంతుడిని తొందరగా రమ్మను’ అన్నాడు విష్ణువు. స్మరణ మాత్రం చేతనే గరుత్మంతుడు తన దేవర చెంత

నేనే శివుడు.. శివుడే నేను!

భగవంతుడిని, భక్తుడిని అనుసంధానించేది ‘మంత్రం’. మంత్రంలో భగవంతుడి సర్వశక్తులు నిబిడీకృతమై ఉంటాయి. మంత్రంలో ‘మన’ అంటే మనసు. త్ర అంటే బట్వాడా చేయడం. అంటే శక్తిని ప్రసరింప చేయడం. ఒక మంత్రాన్ని సరిగా నేర్చుకుని, అర్థం చేసుకుని, శ్రద్ధగా జపిస్తే అది అనవసర కోరికల వల్ల కలిగే అలజడి, అశాంతి నుంచి మనిషిని విముక్తం చేస్తుంది. సర్వ మంత్రాలలోనూ శివ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని చదివి అర్థం చేసుకుని జపించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. ఓం

దీపారాధన..అంతరార్థం

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపారాధనతోనే ఆరంభం అవుతుంది. అలాగే పూజా కార్యక్రమం కూడా ముందుగా దీపారాధనతోనే ప్రారంభమవుతుంది. దీపారాధన అంటే ప్రమిదలో నూనె, వత్తి వేసి వెలిగించేదని అర్థం. దీపం వెలిగించాలంటే అగ్ని కావాలి. అగ్ని ఘర్షణ ద్వారానే పుడుతుంది. పూర్వకాలంలో యాగాది క్రతువులలో హోమాగ్నిని జ్వలింప చేయడానికి ‘ఆరణి’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించే వారు. ఈ ఆరణిలో రెండు చెక్క గిన్నెలాంటివి పొడవాటి కొయ్యకు అనుసంధానించి ఉంటాయి. మధ్య

Top