విజయవాకిట..ఆదిశంకరుల ఆధ్యాత్మిక బావుటా
మనం విజయవాడగా పిలిచే ఇంద్రకీలాద్రి పర్వతంపైకి ఎన్నోసార్లు వెళ్లి ఉంటాం. అక్కడ కొలువైన కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుని ఉంటాం. కానీ, ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా?.. వీటి గురించి మీకు తెలుసా? దసరా (అక్టోబరు 24/25) సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి మనకు తెలియని కొన్ని సంగతులు తెలుసుకుందాం. ఇంద్రకీల పర్వతంపై కనకదుర్గ అమ్మవారు బంగారు పసిడి వర్ణంతో మేలి మెరుపుతో ప్రకాశిస్తుంటారు. ఈ కారణంగానే ఇంద్రకీలాద్రికి కనకాచలమనే మరో పేరు