ప్రేమ జీవన వేదం..

ప్రపంచం చిన్నదైపోయే కొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెద్దవైపోతున్నాయి. ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. కానీ, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం ఇరుకై•పోతున్నాయి. వస్తువుల్ని ప్రేమించి.. మనుషులను ద్వేషించుకునే ధోరణి ప్రబలిపోతోంది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని అప్పుడప్పుడు ‘వాడుకుని’ వదిలేస్తున్నాం. ఈ రోజుల్లో మనం వాడే నిత్యావసరాలు, పరికరాలు, ఉపకరణాలు ఎంతో ‘స్మార్ట్’.. కానీ, వాటిని వాడే, వినియోగించే మనం మాత్రం చాలా ‘హార్డ్’గా మారిపోతున్నాం. అందరిదీ అదే తీరు. ఇదే లోకం రీతిగా మారిపోయింది. అసూయ, ద్వేషం అనేవి అనివార్య

మాటామంతీ..

మాట పొందికగా ఉండాలి. మనం వాడే భాష అందంగా ఉండాలి. అప్పుడే మనకు, మనం మాట్లాడే మాటలకు మర్యాద, మన్నన. మాట మన్నన తేవాలి. మన్నన లేని మాట మాటే కాదు. మన సంభాషణలో మర్యాద - మన్నన అనేవి ఉండటం చాలా అవసరం. సంభాషణలో అప్రియత్వానికి, నిష్కప•త్వానికి భేదం తెలియని వారున్నారు. అప్రియం మర్యాదకు భిన్నమైనది. అది మనకు మన్నన తీసుకురాదు. కొందరు తామనుకున్నదే చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అప్రియమైన పదాలు వాడతారు. నిజానికి ఎవరైనా తామెలా భావిస్తున్నారో అలా

నవ్విస్తూ.. ఆలోచింపచేస్తూ..

మన తెలుగు వారంతా గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు- శ్రీకృష్ణదేవరాయలు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడమే కాదు.. మన మాతృభాష తెలుగును దశదిశలా వ్యాపింప చేశారు. భాషా ఉన్నతికి పాటుపడ్డారు. రాయల వారు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయనకు సాహితీ అభిలాష మెండు. ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ అనేది ఆయనకు గల అనేక బిరుదుల్లో ఒకటి. అందుకు తగినట్టే ఆయన ‘భువన విజయం’ అనే సభను నిత్యం నిర్వహిస్తుండే వారు. ఇందులో అష్టదిగ్గజాలు

సహనమే పూర్తి బలం

క్షమా శస్త్రం కరే యస్య, దుర్జనం కిం కరిష్యతే (సహనమే ఆయుధమైన వారిని దుర్గార్గులు ఏం చేయగలరు?) సాధారణంగా ఇతరుల వ్యాఖ్యలకు మనం తీవ్రంగా స్పందిస్తాం. కానీ, మన వ్యాఖ్యలు ఇతరులను ఏ విధంగా బాధిస్తున్నాయనేది అసలు పట్టించుకోం. ఇతరులు మనకు అలజడి కలిగించినంతగా, మనమూ వారికి అలజడి కలిగిస్తూ ఉండవచ్చు. ఇతరులు మన ప్రవర్తనతో బాధపడి, మన నుంచి తప్పించుకుని పారిపోకూడదు. అలా చేస్తున్నారంటే మనం మనుషులను కోల్పోతున్నామని అర్థం. ఈ అవగాహన, ఎరుక, పరిజ్ఞానం కలిగి ఉండటమే

శివతత్త్వం

సంపాదకీయం ఆనందంగా జీవించడం.. అందరినీ ప్రేమించడం ఆదరంగా కనికరించడం.. సమత.. మమతలతో పరవశింపచేయడం.. ఇదే శివతత్త్వం. ఇదే సదాశివుని వ్యక్తిత్వం. సనాతనమైన శివతత్త్వం ఇప్పుడు ఆధునిక వ్యక్తిత్వ వికాస సూత్రమై విరాజిల్లుతోంది. ఆనందకరమైన జీవనానికి అందమైన బాటలు వేస్తోంది. పరమశివుని తత్త్త్వం సామాన్య మానవుని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. శివుని దృష్టిలో అందరూ సమానమే. రాజైనా, పేదైనా, మిత్రుడైనా, శత్రువైనా, చక్రవర్తి అయినా, భిక్షగాడైనా శివుని దృష్టిలో అంతా ఒక్కటే. దైవాల్లో పరమశివుని అంతటి భక్త వశంకరుడు మరొకరు లేరు. ‘నమస్తే సదాశివా!’ అంటే

Top