నమస్తే టీచర్!
తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెక్కే శిల్పం- విద్యార్థి. విద్యార్థుల భవిష్యత్తును.. తద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. మన భారతీయ విద్యావిధానం ప్రపంచంలోనే విశిష్టమైనది. క్రీస్తుపూర్వమే మన దేశంలో గొప్ప గొప్ప గురుకులాలు ఉండేవి. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. శాస్త్రపారంగతలున్న గురువులు వివిధ శాస్త్రాలలో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేవారు. కొందరు గురువులు దేశ చరిత్ర గమనాన్నే మార్చారు. శాస్త్రాల పురోగతిలో మైలురాళ్లుగా నిలిచారు. మన పురాణాల్లో గురుశిష్యుల సంబంధాలపై బోలెడన్ని కథలు ఉన్నాయి. గొప్ప గొప్ప గురువుల గురించి, వారి