జగమంతా అమ్మ

జగమంతా అమ్మ ఈ సృష్టిలో ఏ విశ్వ చైతన్యం నిండి ఉంది? గ్రహాలు, లోకాలు, సకల జగత్తు ఏ శక్తి నుంచి ఆవిర్భ విస్తున్నాయి? సర్వ ప్రాణుల్లో ఉన్న జీవానికి మూల రూపం ఎవరు?, పుట్టుకకు, చావుకు మధ్యలో ఈ చైతన్యం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? ఆ శక్తి పేరే ఆదిశక్తి. ఆమే పరాశక్తి. సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరు ఇస్తున్నారో ఆ శక్తినే

ఉత్తములు

1892. స్టాన్‍ఫోర్డ్ యూనివర్సిటీ.. అందులో చేరాలనే తపన గల ఓ యువకుడు అంత ఫీజు కట్టలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. అతనూ, అతని స్నేహితుడు కలిసి ఒక ఆలోచన చేశారు. వాళ్ల యూనివర్సిటీలో ఒక సంగీత కచేరి ఏర్పాటు చేద్దామనీ, అందులో ఖర్చులు పోను మిగిలిన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి అప్పట్లో గొప్ప పియానో వాద్యకారుడైన

ఆనందో బ్రహ్మ

చిత్రకారుడు రోదిస్తూ బొమ్మలు గీయడు. శిల్పి దుఃఖిస్తూ శిల్పాన్ని చెక్కడు. నృత్యకారుడు విలపిస్తూ నాట్యం చేయడు. గాయకుడు బాధపడుతూ గీతాన్ని ఆలపించడు. సంగీతకారుడు కుమిలిపోతూ సంగీతాన్ని వినిపించడు. కవి బరువెక్కిన గుండెలతో కాదు.. తేలికైన హృదయంతోనే తన రచనలకు రూపునిస్తాడు. ఇంకా ఎందరో.. తమ కళలు, వృత్తి పనుల్లో నిమగ్నమైన వారు ఆనందంతోనే ఆయా పనులను ఆవిష్కరిస్తారు. ఎందుకంటే ఏదైనా పనిలో ఉన్నవారు ఆ పనిలో నిమగ్నమవుతారు. అది బ్రహ్మానంద క్షేత్రం. అందులో ఉండేది కేవలం ఆనందమే. ఆ ఆనందంలో

మంచి మాటలు

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి

ఆధ్యాత్మిక రహస్యం

‘‘జీవిత లక్ష్యం ఏమిటి?’’ ఆశ్రమానికి కొత్తగా వచ్చిన శిష్యుడు అడిగాడు గురువు గారిని. ‘‘జీవితంలో ఎంతో బ్రహ్మానందం ఉంది. కానీ, మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏదో సాధించాలని పరుగులు పెడుతున్నాం. జీవించడమే ప్రాతిపదికగా ఉన్న జీవితాన్ని ఓ సాధనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల పేరుతో తీస్తున్న ఈ పరుగులు మనలో ఉద్విగ్నతలను, ఆందోళనలను పెంచుతున్నాయి’’ అని బదులిచ్చారు గురువు గారు. దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా మన పని మనం చేసుకుపోవడమే

Top