సిరిదేవతల నేల
తెలుగు నాట చాలా ప్రాచీనమైన లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నాయి. అయితే, వీటి గురించి చాలా మందికి తెలియదు. అటువంటి ఆలయాల పరిచయం.. • వేములవాడలో మహాలక్ష్మీ దేవాలయం ఉంది. మధ్యయుగం ఆరంభంలో గుజరాత్, రాజస్తాన్ (అప్పట్లో ఈ రెండు ప్రాంతాలను కలిపి ఘూర్జర దేశంగా వ్యవహరించేవారు) నుంచి వచ్చిన జైన సాధువు ఈ ఆలయాన్ని నెలకొల్పాడు. ఇప్పటికీ బౌద్ధులు, జైనులు ఈ ఆలయాన్ని పెద్దసంఖ్యలో సందర్శిస్తుంటారు. • నేటి మంథని నాడు మంత్రపురి.