
హెటిరో..
ఫార్మాస్యూటికల్ రంగంలో తిరుగులేని బ్రాండ్..
30 సంవత్సరాల చెరగని ముద్ర..
ఈ సంస్థకు ‘బండి’.. ‘సారథి’ తానై విజయవంతంగా నడిపిస్తోన్న శక్తి.. డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి
జ్ఞానం.. నాణ్యత.. ఆవిష్కరణ..
ఈ వైద్య విజ్ఞాన సంస్థ పురోగమనానికి మూడు చక్రాలైతే.. వాటికి మూలాధారమైన ఇరుసు.. పార్థసారథిరెడ్డి..
లైఫ్ సేవింగ్ మెడిసిన్స్తో దేశానికే ‘జీవ’గర్రగా మారిన హెటిరో ఇప్పుడు సింధు హాస్పిటల్స్ పేరుతో వైద్యసేవలు అందించడానికి పునరంకితమవుతోంది. ఆరోగ్య సంరక్షణలో హెటిరో 30 ఏళ్ల వారసత్వానికి, డాక్టర్ పార్థసారథిరెడ్డి దాతృత్వ దృష్టికి, దార్శనికతకు ప్రతిరూపంగా సాయిసింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోందీ హాస్పిటల్.
హైదరాబాద్లోని హైటెక్ సిటీ నడిబొడ్డున ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి.. ‘అందరికీ నాణ్యమైన వైద్యం’ అనే హామీనిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, వైద్యోపకరణాలతో దాదాపు 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సిద్ధమవుతోన్నఈ హాస్సిటల్లో పరిశోధన సంస్థ, హాస్టల్, ధర్మశాల వంటివి ఉన్నాయి.
ఆంకాలజీ ప్రధాన విభాగంగా గల ఈ హాస్పిటల్లో ఇంకా కార్డియాలజీ, డెర్మటాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రినాలజీ, ఆర్థోపెడిస్, ఈఎన్టీ, యూరాలజీ, దంతవైద్యం, నెఫ్రాలజీ, గైనకాలజీ, ఆప్తాల్మజీ, జనరల్ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, హెమటో ఆంకాలజీ, బీఎంటీ, ప్లాస్టిక్ అండ్ రి-కనస్ట్రక్టివ్ సర్జరీ తదితర పదహారు రకాలస్పెషాలిటీ వైద్యంతో పాటు పదహారు మంది ప్రముఖ వైద్య నిపుణులు సేవలందించనున్నారు.
రాజ్యసభ ఎంపీ, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డికి కుమార్తె సింధు అంటే ప్రేమ.. అంతకుమించిన ప్రాణం. సామాజిక సేవ గురించి తపిస్తూ.. అందరికీ వైద్యం కోసం జీవించినంత కాలం కలలుగన్న ఆమె జ్ఞాపకార్థంగా.. అజన్మాంతం ఆమె అందరి గుండెల్లో జీవించేలా ఆమె పేరుతోనే ‘సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్’కు పునాది వేశారు డాక్టర్ పార్థసారథిరెడ్డి.
ఆయన నేతృత్వంలోని హెటిరో గ్రూప్ 30 ఏళ్ల వారసత్వానికి ఈ సింధు హాస్పిటల్స్ ఒక కొనసాగింపు. ఔషధ తయారీ రంగం నుంచి స్ఫూర్తి పొంది.. నేరుగా ప్రజారోగ్యానికి పట్టం కట్టేందుకు సిద్ధమైంది సింధు హాస్పిటల్స్.
వైద్యమంటే డాక్టర్ నాడి పట్టుకుని చూసేది.. చేసేది కాదు. అనారోగ్య సమస్యలతో వచ్చే వారి గుండె చప్పుడు వినగలగాలి. అప్పుడే రోగులకు ‘హృదయపూర్వకమైన వైద్యసేవలు’ అందించడం సాధ్యమవుతుంది. వైద్యానికి దయ, కరుణ, మానవత్వం వంటి మంచి లక్షణాలనే బిందువులను జతచేసి అనుపమానమైన, అనితర సాధ్యమైన వైద్యసేవలు అందించడానికి అంకితమవుతోంది సింధు హాస్పిటల్స్. ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకతలు ఏమిటి? ఎటువంటి అత్యాధునిక ఉపకరణాలు ఇక్కడున్నాయి? ఏయే వైద్య విభాగాల్లోని ప్రత్యేకతలు ఏమిటి? తెలుసుకుందాం..
హెటిరో ‘బండి’కి సారథి
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఫార్మా రంగంలో.. ఆ మాటకొస్తే దేశవిదేశాల్లో ఈ పేరు తెలియని వారు అరుదు.
ప్రత్యేకించి కోవిడ్ సమయంలో ‘కోవిఫిర్’ వ్యాక్సిన్ను, నోటి ద్వారా తీసుకునే మాత్రను ప్రపంచానికి పరిచయం చేసిన ఈయన 1993లో హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీని స్థాపించారు. భారతదేశంలోనే ఇది అతి పెద్ద ఔషధ సంస్థగా, యాంటీ రెట్రోవైరల్ ఔషధాల ఉత్పత్తిలో నాయకత్వ స్థానానికి ఎదిగింది. డాక్టర్ పార్థసారథిరెడ్డి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ పట్టా పొందారు.
సింథటిక్ కెమిస్ట్రీలో తనకున్న పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని రంగరింగి, తన నైపుణ్యాన్ని ఉపయోగించి పరిశోధన, అభివృద్ధిలో సంస్థను కొత్త పుంతలు తొక్కించి హెటిరోను ప్రపంచంలోనే అత్యుత్తమ జెనరిక్ కంపెనీగా తీర్చిదిద్దారు.
ఔషధ పరిశోధన, ఔషధ తయారీతో పాటు వాటిని మార్కెటింగ్ చేయడంలోనూ డాక్టర్ పార్థసారథిరెడ్డి సాటి లేని మేటి ‘ఫార్మా’ రారాజు.
‘అందరికీ ఆరోగ్యం.. అందరికీ వైద్యం’ అనే ఆయన ఆరోగ్య సంరక్షణ దృక్పథం ముప్పై సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతోంది.
హెచ్ఐవీ/ఎయిడ్స్.. ఈ పేరు వింటేనే నాడు జనం ఉలిక్కిపడే పరిస్థితి. ఆ సమయంలో హెటిరో సంస్థ యాంటీ-రెట్రోవైరల్ ఔషధాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లోకి తెచ్చి అందిస్తోందీ సంస్థ. అలా ఒక మహమ్మారి బారి నుంచి ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించింది.
ఇక, కోవిడ్ సమయంలో హెటిరో అందించిన ఆరోగ్య సేవలు, ప్రజారోగ్యం పట్ల తీసుకున్న బాధ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే! వ్యాక్సిన్తో పాటు రెబోప్లావిన్ అనే ఔషధాన్ని తయారు చేసి జనారోగ్యం పట్ల తనకున్న బాధ్యతను చాటుకోగా, ఒక ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో ఎలాంటి దార్శనిక పాత్ర పోషించాలనే విషయంలో మిగతా ఫార్మా కంపెనీలకు మార్గదర్శకత్వం వహించింది.
తనను వ్యాపారవేత్తగా చెప్పుకోవడానికి డాక్టర్ పార్థసారథిరెడ్డి అంగీకరించరు. ప్రజారోగ్యం పట్ల సామాజిక బాధ్యత గల వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకుంటారు. ఆయన దాతృత్వానికి మారుపేరు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ను హెటిరో సంస్థ లక్ష్యంలో ఒక భాగంగా చేశారు. హెటిర్ ప్రధాన వాణిజ్య కార్యకలాపాలతో సమానంగా సామాజిక బాధ్యతనూ నెరవేర్చడంలో ఆయన అందెవేసిన చేయి. ఆయన నాయకత్వంలోని హెటిర్ సీఎస్ఆర్ విభాగం బాలికా విద్యకు పాటుపడుతోంది. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యాదీవెనలందిస్తోంది. ఆరోగ్య, కంటి సంరక్షణ కార్యకలాపాల్లో అసమాన చొరవ చూపుతోంది.
లీడ్ ఇండియా ఫౌండేషన్.. హెటిర్ సంస్థ సామాజిక బాధ్యతల నుంచి ఆవిర్భవించిన ఈ సంస్థకు డాక్టర్ రెడ్డి సహ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు సాఫ్ట్స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా 432 ప్రభుత్వ పాఠశాలలు, 32 ప్రభుత్వ కళాశాలల్లోని దాదాపు లక్ష మంది విద్యార్థులు కొత్త నైపుణ్యాభివృద్ధితో తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నారు.
మంచి చేయాలనే ఆశయాన్ని చాలామంది కేవలం మాటల్లో ‘వ్యక్తం చేస్తుంటారు’. కానీ, ఆ మంచి చేయాలనే సంకల్పాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరణలో పెట్టే వారు మాత్రం చాలా తక్కువ మంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అరుదైన మహా మనీషి డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి.
రాజ్యసభ ఎంపీగా కూడా సేవలందిస్తున్న డాక్టర్ పార్థసారథిరెడ్డి.. తన కుమార్తె సింధు కలలను నెరవేర్చేందుకు, ఆమె జ్ఞాపకార్థం నేరుగా ప్రజారోగ్య సేవల రంగంలోకి అడుగుపెట్టారు. ఆ దిశగా పడిన ముందడుగే ‘సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్’.
అవగాహనతో పనిచేస్తారు. ప్రతి రోగి కోసం వ్యక్తిగతీకరించిన భద్రత ప్రణాళికలను రూపొందిస్తారు. అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. నిపుణులైన ఈ ఆస్పత్రి వైద్యుల శ్రద్ధ.. రోగికి సంరక్షణ కల్పిస్తుంది. సురక్షిత భావనను కలిగిస్తుంది. రోగులకు ప్రతి అడుగులో మార్గనిర్దేశం చేయడానికి ఇక్కడ నిపుణులైన అనస్థీషియాలజిస్టులు ఉన్నారు.
అనస్థీషియాలజీ
అనస్థీషియాలజీ అనేది వైద్యరంగంలో ఒక ప్రత్యేక క్రిటికల్ కేర్ మెడిసిన్. శస్త్రచికిత్సలు ఇతర అత్యవసర వైద్యం సమయంలో పేషంట్లకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మోతాదు మించినా.. తగ్గినా కూడా రోగికి అపాయం కలుగుతుంది. ఈ బాధ్యతను సరిగా నిర్వర్తించాలంటే సదరు వైద్యుడికి శరీర ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అలాంటి నైపుణ్యాలు కలిగిన వైద్య నిపుణులతో సింధు మల్టీస్పెషాలిటీ వైద్య విభాగం సేవలందించనుంది. వైద్యం కోసం వచ్చే ప్రతి పేషంట్కు వైద్యావసరాలతో పాటు కొన్ని ఆందోళనలు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకున్న వైద్యశాల మాత్రమే సదరు రోగికి సరైన వైద్యం అందించగలుగుతుంది. సింధు హాస్పిటల్స్లోని అనస్థీషియాలజిస్టులు శస్త్రచికిత్స ఇతర అత్యవసర వైద్యం చేయాల్సిన సందర్భంలో రోగి గురించి, అతని ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకుని
‘హెటిరో’కు కొత్త దిక్సూచి ..
డాక్టర్ వంశీకృష్ణ
డాక్టర్ బండి వంశీకృష్ణ..
మేనేజింగ్ డైరెక్టర్ హెటిరో గ్రూప్
తండ్రి డాక్టర్ పార్థసారథిరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. హెటిరోకు కొత్త దశ.. దిశ చూపుతున్న యువ దార్శనికుడు..
సంక్షోభ సమయంలోనే సామర్థ్యాలు బయటపడతాయి..
అసాధారణ వ్యూహాలతోనే మనలోని నాయకత్వ లక్షణాలు వెలుగుచూస్తాయి..
అలాంటి సామర్థ్యాలకు, నాయకత్వ వ్యూహాలకు పెట్టింది పేరు డాక్టర్ బండి వంశీకృష్ణ.
హెటిరో సంస్థకు డాక్టర్ పార్థసారథిరెడ్డి ఆయువుపట్టయితే ఆయన కుమారుడు డాక్టర్ వంశీకృష్ణ కళ్లు చెవులు..
సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేలా దార్శనికత్వం వహించడం, వాణిజ్యాన్ని విస్తరించడం, ఔషధాల మార్కెటింగ్ పర్యవేక్షణ వంటి కార్యకలాపాలకు ఈయన నాయకత్వం వహిస్తారు.
హెటిరో గ్రూప్ ‘లోకల్’ స్థాయి నుంచి ‘గ్లోబల్’ రేంజ్కు ఎదగడం, విస్తరించడం వెనుక డాక్టర్ వంశీకృష్ణ వ్యూహాలే కారణం.
ప్రపంచ ఫార్మా రంగంలో తిరుగులేని బ్రాండ్ హెటిరో అయితే.. అందుకు ఎదురులేని వ్యూహాలు రచించి తన నాయకత్వ పటిమతో సంస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న మహాశక్తి డాక్టర్ వంశీకృష్ణ.
గ్లోబల్ ఫార్ములేషన్ బిజినెస్ను అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇతర ఎమర్జింగ్ దేశాల్లోని కీలక మార్కెట్లలో నిర్మించడంలో డాక్టర్ వంశీకృష్ణ అసాధారణ పాత్ర పోషిస్తున్నారు.
ఆంకాలజీ, బయోలాజిక్స్, స్పెషాలిటీ థెరప్యూటిక్స్, వ్యాక్సిన్ ఉత్పత్తిలో సంస్థ సామర్థ్యాలను పెంచడంలో.. వాటికి మంచి మార్కెటింగ్ కల్పించడంలో.. డాక్టర్ వంశీకృష్ణ బలమైన వ్యాపార చాతుర్యం కలిగిన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
హెటిరో తన యాంటీ రెంట్రోవైరల్ (ఏఆర్వీ), హెపటైటిస్ పోర్ట్ఫోలియోను విస్తరించుకునే యత్నంలో బహుళజాతి దిగ్గజ ఫార్మా కంపెనీలతో ప్రపంచ లైసెన్సింగ్ భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంలో డాక్టర్ వంశీకృష్ణ బండి చూపిన సామర్థ్య, నాయకత్వ లక్షణాలు సాటిలేనివి.
కోవిడ్-19 పంజా విసిరిన సమయంలో డాక్టర్ వంశీకృష్ణ దానికి విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే రెమ్డెసివిర్, మోల్పుపిరావిర్, స్పుత్నిక్‘వి’ వ్యాక్సిన్ వంటి కీలకమైన ఔషధాల తయారీ ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చి ప్రజలకు అందే విషయంలో ఆయన చూపిన దార్శనికతకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!.
ముంబైలోని యూడీసీటీగా ప్రసిద్ధి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన డాక్టర్ వంశీకృష్ణ.. హైదరాబాద్లోని జేఎన్టీయూ నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేశారు.
ప్రస్తుతం హెటిరో పురోగతిని కొత్త శిఖరాలకు చేర్చే యత్నంలో ఆయన తన దార్శనికతతో పరిశోధన, నాణ్యత, తయారీ, స్థిరత్వం అనే నాలుగు చక్రాలతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. కంపెనీ సామర్థ్యాలను పెంచే పనిలో నిరంతరం నిమగ్నమై ఉండే డాక్టర్ వంశీ.. హెటిరోను వరల్డ్ లీడింగ్ ఫార్మా బ్రాండ్గా రూపుదిద్దుతున్నారు.
అదే సమయంలో సాయిసింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోన్న సింధు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన ‘జవజీవాలు’ పోస్తూ.. తన సోదరి కలలకు ప్రతిరూపాన్నిచ్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు.
రక్త కేంద్రం (బ్లడ్ సెంటర్)
ప్రతి రక్తపుబొట్టు విలువైనదే.. ప్రతి రక్తబిందువు ప్రాణప్రదమైనదే.. ప్రాణాలను నిలిపే రక్తం విలువ తెలిసిన వైద్యులు సింధు ఆస్పత్రిలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు నిరంతరం సురక్షితమైన, శుద్ధమైన రక్తాన్ని అవసరమైన వారికి అందించే యత్నంలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. రక్తదానం చేయడాన్ని ప్రోత్సహించడంతో పాటు రక్తమార్పిడి చికిత్సలను అత్యంత శ్రద్ధతో ఇక్కడ నిర్వహిస్తారు. అందుకోసం కఠినమైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తారు. ఎందుకంటే, ఈ విషయంలో తీసుకునే చిన్నపాటి శ్రద్ధ కూడా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుతుంది. ప్రణాళికాబద్ధమైన చర్యలతో, పూర్తి సంరక్షణ పద్ధతుల్లో ఇక్కడ రక్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోగులకు, వారి కుటుంబాలకు ఈ విషయంలో భరోసానిస్తోంది సింధు హాస్పిటల్స్.
కార్డియాలజీ
‘మా హృదయం మీ హృదయాల కోసం తపిస్తోంది’ అంటూ తన గుండెచప్పుడు వినిపిస్తోంది సింధు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి. ఇక్కడి కార్డియాలజీ విభాగం ‘గుండె’ ఆరోగ్యానికి గట్టి హామీనిస్తోంది. హృద్రోగ వైద్యంలో చోటుచేసుకుంటున్న తాజా పురోగతులు, కొత్త చికిత్స పద్ధతులు, విధానాలను రంగరించి గుండెజబ్బు బాధితులను ఆరోగ్యంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గుండె ఆరోగ్యం కోసం ఇక్కడకు సాధారణ పరీక్షల కోసం వచ్చినా.. లేదా సంక్లిష్టమైన శస్త్ర చికిత్సల కోసం వచ్చినా ఇక్కడి వైద్య నిపుణుల బృందం రోగి పూర్తి నేపథ్యాన్ని పరిశీలిస్తుంది. రోగి భయాలు.. ఆశలను అర్థం చేసుకుని తదనుగుణంగా చికిత్సను అందిస్తుంది. గుండె ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ ఓ భావోద్వేగ విషయం. అది అర్థం చేసుకుని వైద్యం అందించే కార్డియాలజిస్టులు ఇక్కడ ఉన్నారు. హృద్రోగ సమస్యతో ఇక్కడకు వచ్చే వారికి తిరిగి ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి పూర్తి విశ్వాసంతో కూడిన హామీనిస్తోంది సింధు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి.
కార్డియో థొరాసిక్ –
వాస్క్యులర్ సర్జరీ (సీటీవీఎస్)
కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ సర్జరీ అంటే గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, అన్నవాహిక వంటి ఛాతీలోని అవయవాలకు సంబంధించిన శస్త్రచికిత్స విభాగం. గుండె వాల్వ్ భర్తీ, గుండె మార్పిడి వంటివి కూడా ఇందులో భాగమే. ఈ శస్త్రచికిత్సలను ప్రపంచ స్థాయి నైపుణ్యతతో హృదయపూర్వక సంరక్షణతో అందించడానికి హామీనిస్తోంది సింధు హాస్పిటల్స్. శస్త్రచికిత్స అనగానే ఒక భయం ఆవహిస్తుంది. ఒక అనిశ్చితి వెంటాడుతుంది. అది అర్థం చేసుకున్న ఇక్కడి వైద్య నిపుణులు పేషంట్ల ప్రతి అడుగులో అడుగు వేయడానికి, వారి ప్రతి మాటను వినడానికి సదా సిద్ధంగా ఉంటారు. ‘కేవలం రోగాన్ని నయం చేయడం మాత్రమే మా పని కాదు. మీ చింతను దూరం చేయడానికి, మీ చేయి పట్టుకోవడానికి, మీరు కోలుకునే క్రమంలో మీతో కలిసి అడుగులో అడుగు వేయడానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. ఎందుకంటే, మీ హృదయం మీకు ఎంత ముఖ్యమో మాకూ అంతే ముఖ్యం’ అనే భరోసాను ఇస్తోంది సింధు మల్టీ స్పెషాలిటీ హాస్సిటల్స్.
క్రిటికల్ కేర్
జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుదేలైపోతాడు. ఊహించని ఉత్పాతంతో జీవితంపై ఆశలు కోల్పోతాడు. తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులు ఎప్పుడు, ఎలా దాడి చేస్తాయో తెలియదు. అటువంటి కీలక, క్లిష్ట పరిస్థితుల్లో రోగులకు అందించే వైద్య చికిత్స పక్రియనే క్రిటికల్ కేర్ అంటారు. నిరంతర పర్యవేక్షణ, వైద్య మద్దతు ఉంటే తప్ప రోగులు క్రిటికల్ కేర్ నుంచి బయటపడరు. అటువంటి సందర్భాల్లో ‘మేం పూర్తి అప్రమత్తతతో చికిత్స అందిస్తాం.. హృదయపూర్వకమైన వైద్యసేవలతో, దయతో రోగికి చేయి అందిస్తాం’ అంటోంది సింధు హాస్పిటల్స్. తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి అధునాతనమైన, ఇరవై నాలుగు గంటల సేవలను అందించడానికి ఈ ఆస్పత్రి సిద్ధంగా ఉంది. కేవలం వైద్యం మాత్రమే రోగిని కోలుకునేలా చేయదు. చికిత్సలో మానవీయ కోణాన్ని కూడా మిళితం చేయాలి. అప్పుడే పేషంట్ల జీవితానికి భద్రత.. భరోసా. అధునాతన సాంకేతికతతో క్రిటికల్ కేర్ వైద్యం అందించడానికి, క్లిష్ట సమయాల్లో ప్రాణాలు కాపాడటానికి.. అదే సమయంలో రోగులు, వారి కుటుంబాల్లో చిరునవ్వులు పూయించడానికి పూర్తి అంకితభావం కలిగిన వైద్య బృందం సింధు హాస్పిటల్స్ సొంతం. ఇక్కడకు వైద్యం కోసం వచ్చే వారిని రోగిలా కాదు.. ప్రియమైన వ్యక్తిగా ‘ట్రీట్’ చేస్తారు.
దంతవైద్యం
దంతవైద్యం కేవలం దంతాల కోసమే అయితే అది దంత వైద్యమే కాదు. చక్కని పలువరుసతో జీవితంలో చిరునవ్వులను పూయించినపుడే, జీవితాలను ప్రకాశవంతం చేసినపుడే అది సరైన దంతవైద్యం అనిపించుకుంటుంది. ఆరోగ్యకరమైన, అందమైన చిరునవ్వులను సృష్టించడం సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే సాధ్యమవుతుంది. ఒక దంత వైద్యుడిని సంప్రదించడం అనేది ఎంత వేదనాకరమైన విషయమో తెలియంది కాదు. దంత సమస్యలకు సంబంధించి మీరు సింధు హాస్పిటల్స్కు వెళ్తే.. అక్కడ శ్రద్ధ కలిగిన, సమర్థులైన వైద్యుల చేతిలో మీ సమస్యను ఉంచి, ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నమ్మకంగా నవ్వడానికి మీరు పూర్తిగా అర్హులు.
ఈఎన్టీ
చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు చికిత్స అందించే విభాగమిది. మానవ శరీరంలోని సర్వేంద్రియాలను కరుణ, దయతో, నైపుణ్యం గల స్పర్శతో స్ప•శిస్తుంది సింధు హాస్పిటల్స్. సైనసైటిస్లాంటి సాధారణ వ్యాధులకు చికిత్స మొదలు సంక్లిష్టమైన మైక్రో సర్జరీల వరకు ఇక్కడి ఈఎన్టీ నిపుణులు జీవన నాణ్యతను పెంచే వైద్యాన్ని అందిస్తారు. రోగి కేంద్రీకృత సంరక్షణపై వ్యక్తిగత శ్రద్ధ చూపే వైద్యులు సహానుభూతితో వ్యవహరిస్తారు. పేషంట్లు తమ జీవితంలోని చిన్ని చిన్ని ఆనందాలను తిరిగి కనుగొనడంలో, వారికి చికిత్స అందించి చేయిపట్టి నడిపించడంలో దిక్సూచిలా వ్యవహరిస్తుంది.
మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ
సింధు హాస్పిటల్స్లోని మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడానికి, కాలేయం, ప్యాంక్రియాట్రిక్ వ్యాధులు, రోగ నిర్ధారణ, చికిత్సలు అందించడానికి పూర్తిగా అంకితమై ఉంది. అధునాతన ఎండోస్కోపీ, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులతో రోగి కేంద్రీకృత సంరక్షణను అందిస్తుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటే జీవితం మొత్తం జీవశక్తిని పుంజుకుని ఉంటుంది. రోజువారీ ఆరోగ్యాన్ని జీర్ణవ్యవస్థ ప్రభావితం చేస్తుంది. పేషంట్లు ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి అవసరమైన పరిజ్ఞానం, వైద్య మద్దతుతో వారిని శక్తివంతం చేసేందుకు సింధు హాస్పిటల్స్ వైద్య బృందం కట్టుబడి ఉంది.
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ
సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పి•ల్స్లోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ప్రతి కేసును సున్నితంగా, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. సాధారణ చికిత్స అయినా, సంక్లిష్టమైన శస్త్రచికిత్స అయినా ఇక్కడి వైద్య బృందం వైద్యపరమైన నైపుణ్యంతో పాటు భావోద్వేగ మద్దతును అందించడానికి అంకితమై ఉంది. జీర్ణ సమస్యలు దైనందిన జీవితాన్ని గందరగోళంలోకి నెడతాయి. సమస్యను చక్కదిద్ది తిరిగి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి ఈ వైద్యులు సదా సిద్ధంగా ఉంటారు. మొదటి కన్సల్టేషన్ నుంచి శస్త్రచికిత్స వరకూ వారు పేషంట్ల పక్కనే ఉంటారు. సాధారణంగా చికిత్సకు వచ్చే వారి శ•రీరంతోనే పని అన్నట్టుగా వైద్యులు, ఆస్పత్రులు వ్యవహరిస్తాయి. కానీ, సింధు హాస్పిటల్స్లో రోగి శరీరమే కాదు.. వ్యక్తిని కూడా నయం చేయడానికి.. అందుకు తగిన భరోసా ఇవ్వడానికి వైద్య బృందం పునరంకితమై ఉంది.
ఎమర్జెన్సీ మెడిసిన్ (అత్యవసర వైద్యం)
జీవితంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితులు’ ఏక్షణంలోనైనా ఎదురవుతాయి. అవి గందరగోళానికి గురిచేస్తాయి. ఒక్కోసారి జీవితాలను తలకిందులు చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యాన్ని పూర్తి సంరక్షణ బాధ్యతతో అందించి.. రోగుల జీవితాల్లో స్వాంతన కలిగిస్తుంది సింధు హాస్పిటల్స్ వైద్య బృందం. ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్యానికి మానవీయతను జోడించి, సాంకేతికతను మేళవించి ఓదార్పునిస్తుంది ఇక్కడి వైద్యం. ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు మీరు ఒంటరి కాదని, మిమ్మల్ని ఎల్లవేళలా చేయిపట్టి నడిపించేందుకు తమ వైద్యబృందం సదా సిద్ధంగా ఉంటుందని సింధు హాస్పిటల్స్ ప్రమాణం చేస్తోంది.
జనరల్ మెడిసిన్
సాధారణ ఆరోగ్య సమస్యలకు అసాధారణ వైద్యం అందించడం సింధు హాస్పిటల్స్ ప్రత్యేకత. పేషంట్ వెల్నెస్ కోసం విశ్వసనీయ భాగస్వామిగా ‘సింధు’ వైద్యులు వ్యవహరిస్తారు. అంకితభావం కలిగిన ఇక్కడి వైద్యులు సాధారణ పరీక్షల నుంచి సంక్లిష్టమైన చికిత్సల వరకు విస్త•త శ్రేణి ఆరోగ్య సమస్యలకు కేవలం వైద్యపరంగానే గాక, సహానుభూతితో కూడిన మానవీయతతో మెలుగుతారు. ప్రతి పేషంట్ ఆరోగ్య ప్రయాణం ముఖ్యమైనదే.. ప్రత్యేకమైనదే. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విని, ఆలోచనాత్మక మార్గదర్శకత్వంతో చికిత్స అందించడం ఈ హాస్పిటల్ ప్రత్యేకత. మీ ప్రతి అడుగులోనూ మేమున్నామంటూ సింధు హాస్పిటల్స్ ఇచ్చే భరోసాతో కూడిన జీవితపు హామీ పేషంట్లకు ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి ఇస్తుంది.
గైనకాలజీ
కౌమారదశ నుంచి మోనోపాజ్ వరకు మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సింధు హాస్పిటల్స్లోని గైనకాలజీ విభాగం స్త్రీల ఆరోగ్యానికి పూచీనిస్తోంది. స్త్రీలకు సంబంధించిన జననేంద్రియాలు, గర్భాశయం, అండకోశాల వైద్యాన్ని అత్యంత గౌరవంతో నిర్వహించడానికి, అందించడానికి ఇక్కడి వైద్యులు అంకితమై ఉన్నారు. మహిళల ఆరోగ్య సమస్యలు చాలా సున్నితమైనవి. వాటిని శ్రద్ధగా వినగలిగితేనే, వారి హృదయ స్పందనలకు తగినట్టుగా ప్రతిస్పందించగలిగితేనే వారికి స్వాంతన కలుగుతుంది. అటువంటి వాతావరణంలో గైనిక్ సమస్యలకు వైద్యం అందించడానికి ‘సింధు’ వైద్య బృందం కట్టుబడి ఉంది. మహిళలు తమ గైనిక్ సమస్యలతో కనుక ఇక్కడకు వస్తే.. తమ పట్ల శ్రద్ధ వహించే వైద్యులు ఇక్కడ ఉన్నారని కనుగొనగలుగుతారు.
ఇంటర్వెన్షనల్ రేడియాలజీ
శరీరమంతా రక్తనాళాలు, శోష రస నాళాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు ఆయా సమస్యలను గుర్తించి, చికిత్స అందించడానికి వీలుగా వైద్యులకు మార్గనిర్దేశం చేసేందుకు మెడికల్ ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించడానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటారు. అత్యాధునిక వైద్య సాంకేతికత కలిగిన సింధు హాస్పిటల్స్ బృందం యాంజియోగ్రఫీ, స్టెంట్ ప్లేస్మెంట్, ఎంబోలైజేషన్ వంటి అధునాతన వైద్య విధానాలను అత్యంత కచ్చితత్త్వంతో, జాగ్రత్తతో నిర్వహిస్తుంది. అందరికీ ఒకటే తరహా వైద్యం కాకుండా, వ్యక్తికి వ్యక్తికీ అనుగుణంగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ‘చికిత్సలో వేగం.. తక్కువ ప్రమాద తీవ్రత’ అనే నినాదంతో ఇక్కడ వైద్యం అందిస్తారు.
మెడికల్ డయాగ్నోస్టిక్స్
చికిత్సలో కీలకం- రోగ నిర్ధారణ. దానికి అనుగుణంగా చికిత్స అందించడం తరువాతి పక్రియ. సింధు హాస్పి•ల్స్లోని డయాగ్నోస్టిక్స్ విభాగం.. కేవలం డయాగ్నస్టిక్ కేంద్రం కాదు. కచ్చితమైన సమాచారం, కచ్చితమైన సంరక్షణ అందించే కేంద్రమిది. పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీతో కూడా ఇక్కడి ల్యాబ్ అధునాతన సాధనాలు, కచ్చితత్వం, విశ్వసనీయతకు అంకితమైన అత్యంత నైపుణ్యం కలిగిన బృందంతో కూడి ఉంది. రోగి ఆరోగ్య సమస్యలకు తగిన పరిష్కారాన్ని కనుగొనడంలో ఇక్కడి వైద్య బృందం అంకితమై ఉంది. సాధారణ స్క్రీనింగ్ నుంచి సంక్లిష్ట విశ్లేషణల వరకు ‘సింధు’ ప్రయోగశాలలు పేషంట్లకు పూర్తి స్పష్టతను, విశ్వాసాన్ని అందిస్తాయి. అత్యున్నత వైద్య ప్రమాణాలే ఆరోగ్య సంరక్షణలో తొలిమెట్టు అయితే.. ఆ తొలిమెట్టు సింధు హాస్పిటల్స్.
మెడికల్ ఇమేజింగ్
మెడికల్ ఇమేజింగ్ అనేది రోగి శరీరం యొక్క అంతర్గత భాగాన్ని చిత్రించే సాంకేతిక పక్రియ. శరీరంలోని అవయవాలు, కణజాలాల పనితీరును విశ్లేషించే దృశ్యమాన విధానం. ఒకవిధంగా చెప్పాలంటే రోగికి రోగ నిర్ధారణ చేసే విషయంలో మెడికల్ ఇమేజింగ్ అనేది ఒక ప్రవేశ ద్వారం. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ నుంచి అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే వరకు ఇమేజింగ్లో తాజా పురోగతులను ఉపయోగించి ఇక్కడి రేడియాలజిస్టులు ప్రభావవంతమైన చికిత్సకు బలమైన పునాది వేస్తారు. మెడికల్ ఇమేజింగ్కు వచ్చే ప్రతి రోగి ఆందోళనతో ఉంటాడు. ఆ ఒత్తిడిని దూరం చేసి ఇక్కడి వైద్య బృందం ప్రశాంతమైన, భరోసానిచ్చే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ‘మేము చికిత్సను మాత్రమే అందించము. దాంతోపాటు మనశ్శాంతిని అందిస్తాము’ అని సింధు హాస్పిటల్స్ ప్రమాణం చేస్తుంది.
నెఫ్రాలజీ
మూత్రపిండాలు, వాటి పనితీరు, మూత్రపిండ వ్యాధుల చికిత్స గురించి అధ్యయనం చేసే విభాగం- నెఫ్రాలజీ. సింధు హాస్పిటల్స్లోని నెఫ్రాలజీ విభాగం అధిక రక్తపోటు నుంచి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల వరకు సమస్యను గుర్తించి దానికి సమర్థమైన చికిత్స అందించడానికి అంకితమై ఉంది. ప్రతి రోగికి ప్రత్యేకమైన డయాలసిస్ చికిత్స.. రోగి శారీరక, మానసిక స్థితికి తగినట్టుగా రూపొందించిన వ్యక్తిగతీకరించిన వైద్య పక్రియలతో చికిత్సా విధానాలను అమలు చేయనుంది. కిడ్నీ ఆరోగ్యం అనేది అత్యంత సంక్లిష్టమైనది. ఆ సమస్య నుంచి రోగులు కోలుకోవాలంటే వైద్యం ఒక్కటే సరిపోదు. తగిన స్వాంతన కలిగించే మానవీయత కలిగిన వైద్యులు అవసరం. అలాంటి వైద్యులు కలిగిన నమ్మకమైన వైద్యసంస్థ- సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్.
న్యూరాలజీ
నాడీ వ్యవస్థ యొక్క రుగ్మతలను అధ్యయనం చేసే, చికిత్స అందించే వైద్య విభాగం- న్యూరాలజీ. కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము వ్యవస్థ ప్రతి మనిషి ఆరోగ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. కాబట్టి వాటికి అత్యంత గౌరవనీయ పద్ధతుల్లో చికిత్స అందించడానికి సింధు హాస్పిటల్స్ సంసిద్ధమై ఉంది. నాడీ సమస్యలు చాలా తీవ్రమైనవి. మానసికంగా చాలా ప్రభావం చూపుతాయి. అందుకే ఇక్కడ ‘చికిత్సకు మించిన వైద్యం’ అందించడానికి వైద్య బృందం కట్టుబడి ఉంది. రోగి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని సావధానంగా వినడం, రోగి అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలను ఇవ్వడం తద్వారా రోగికి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించే విషయంలో సింధు హాస్పిటల్స్ది అగ్రస్థానం. కేవలం చికిత్స చేయడమే కాక.. రోగిని కంటిపాపలా చూసుకోవడం, వారి అడుగులో అడుగు వేసి వారిని చేయిపట్టి ముందుకు నడిపేలా చేయడం ఇక్కడి మానవీయ వైద్యుల ప్రత్యేకత.
న్యూక్లియర్ మెడిసిన్
మొత్తం శరీరంలోని ఎముకలను స్కాన్ చేసే వైద్య పక్రియ- న్యూక్లియర్ మెడిసిన్. సింధు హాస్పిటల్స్ న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో సంక్లిష్టమైన మెడికల్ ఇమేజింగ్, చికిత్సలను అందించడానికి శక్తివంతమైన సాధనాలను కలిగి ఉంది. ఇక్కడి వైద్య నిపుణులు అధునాతన రేడియో ధార్మిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. దానిని రోగ నిర్ధారణ చేయడానికి, వేగంగా చికిత్స అందించడానికి సమర్థంగా వినియోగించగల నిపుణులు ఈ హాస్పిటల్స్ సొంతం. రోగి ఎముక ఆరోగ్యం గురించి ప్రతి దశను వివరించడానికి, వారి ప్రశ్నలకు, సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే ఇక్కడి వైద్యులు.. తమ కరుణ, దయతో పేషంట్కు సురక్షితమైన హామీనిస్తారు.
హెమటో -ఆంకాలజీ, బీఎంటీ
హెమటో ఆంకాలజీ అనేది రక్త క్యాన్సర్లకు చికిత్స అందించే విభాగం. రక్త రుగ్మతలు లేదా క్యాన్సర్ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. కానీ, సింధు హాస్పిటల్స్లోని వైద్యులు తమ హెమటో ఆంకాలజీ, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ (బీఎంటీ) విభాగంలో సుశిక్షితులైన సైనికుల మాదిరి పనిచేసి మీకు పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వైద్యంతో పాటు భవిష్యత్తుపై ఆశను వీరు వాగ్దానం చేస్తున్నారు. సింధు హాస్పిటల్స్ పేషంట్ను ఒక రోగిలా కాదు.. తమకు స్ఫూర్తినిచ్చే మిత్రుడిలా భావించి ‘ట్రీట్’ చేస్తుంది.
మెడికల్ ఆంకాలజీ
మెడికల్ ఆంకాలజీ అనేది క్యాన్సర్ వ్యాధుల గురించి అధ్యయం చేసే వైద్యవిజ్ఞాన శాస్త్రం. ప్రస్తుతం ప్రపంచానికి ఆరోగ్య సవాల్ విసురుతున్న మహమ్మారి క్యాన్సర్. అది శరీరంలోని ప్రతి కణాన్ని మాత్రమే కాకుండా జీవితంలోని ప్రతి దశను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న సింధు హాస్పిటల్స్ వైద్య బృందం హృదయపూర్వకంగా చికిత్స అందించేందుకు సిద్ధమై ఉంది. క్యాన్సర్కు ఇక్కడ అందించే వైద్య విధానం సమగ్రమైనది. సమర్థమైనది. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి అధునాతన చికిత్సలను వైద్యంలో మానవీయతను మిళితం చేసి అందిస్తుంది. ఇక్కడి వైద్యబృందం రోగుల మాటలను శ్రద్ధగా ఆలకిస్తుంది. వారి ఆశలను గుర్తిస్తుంది. తదనుగుణమైన చికిత్స విధానాలను అమలు చేసే విషయంలో అవిశ్రాంతంగా శ్రమిస్తుంది. వైద్యం రూపేణా ధైర్యాన్ని, మానవీయ రూపేణా భరోసాను అందించి రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.
రేడియేషన్ ఆంకాలజీ
క్యాన్సర్ చికిత్స సంక్లిష్టమైనది. కేవలం అత్యాధునిక వైద్యంతో మాత్రమే రోగి ఈ వ్యాధి నుంచి కోలుకోవడం సాధ్యం కాదు. ఆధునిక వైద్యానికి కొంత మానవీయ స్పర్శ అవసరం. సింధు హాస్పిటల్స్లోని రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో రోగి సౌకర్యానికి, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తారు. క్యాన్సర్తో కచ్చితత్త్వంతో పోరాడేలా మనోబలాన్ని, ధైర్యాన్ని రోగికి అందిస్తారు. వ్యాధికారక దుష్ప్రభావాలను తగ్గించడానికి, ఫలితాలను పెంచడానికి ఇక్కడి వైద్యబృందం అంకితభావంతో పనిచేస్తుంది. రోగి ప్రయాణం పొడవునా వైద్యులు వెన్నంటి ఉండి ధైర్యం చెబుతారు. బాధితుడిని ఒక రోగిలా కాదు.. వ్యక్తిగా గుర్తించి అందుకు తగిన శ్రద్ధ తీసుకుని వారి ప్రతి అడుగులో వెన్నంటి నిలుస్తారు.
సర్జికల్ ఆంకాలజీ
క్యాన్సర్ శస్త్రచికిత్స.. దాని అనంతరం స్వాంతన కలిగించేలా, శక్తిని పెంచేలా పనిచేసే విభాగమిది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కణితుల తొలగింపు అనేది కీలకం. దీని తరువాత జీవితాన్ని మార్చగల పునర్నిర్మాణ విధానాలు అవసరం. అందుకు అనుగుణంగా నైపుణ్యంతో చికిత్సను అందిస్తుంది సింధు హాస్పిటల్. క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగి భావోద్వేగాలను తెలుసుకుంటూ, వారి ఆందోళనను తగ్గిస్తూ ఈ విభాగం వైద్యులు అవగాహన కలిగిస్తారు. ఎంతో ఆశతో క్యాన్సర్ చికిత్స పొందే పేషంట్ల గుండెచప్పుడు వినేందుకు ఈ విభాగం వైద్యులు సదా సిద్ధంగా ఉంటారు.
ఆప్తల్మాలజీ
సింధు ఆస్పత్రి దూర‘దృష్టి’కి నిదర్శనం ఈ విభాగం. కంటి సంరక్షణ సేవలకు అంకితమైన ఈ విభాగం సాధారణ కంటి పరీక్షలు మొదలుకుని కంటిశుక్ల, గ్లాకోమా వంటి సంక్లిష్ట శస్త్ర చికిత్సల వరకు అన్నిటికీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. దృష్టి అనేది జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తుంది. దానిని మెరుగుపరిచే వైద్యాన్ని అందించాలంటే లోతైన లోచూపు అవసరం. అటువంటి కంటి ఆరోగ్యం కోసం ప్రకాశవంతమైన చికిత్స విధానాలను అందిస్తోంది సింధు ఆస్పత్రి వైద్యుల బృందం.
ప్లాస్టిక్, పునర్నిర్మాణ శస్త్రచికిత్స
అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాంటి విశ్వాసాన్ని పెంచేలా తగిన కార్యాచరణతో సిద్ధంగా ఉంది సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. గాయాలు ఇతరత్రా పరిస్థితుల్లో శరీరం, ముఖ భాగాలు దెబ్బతిన్నపుడు తిరిగి మునుపటి సౌందర్యాన్ని పునరుద్ధరించేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన సర్జన్లు అవసరం. ఇక్కడ పోయిన రూపాన్ని మాత్రమే కాదు.. స్ఫూర్తిని నింపడంలోనూ వైద్యులు విశేష పాత్ర పోషిస్తారు.
పల్మనరీ మెడిసిన్
ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలను నయం చేసే విభాగమిది. ఇది క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ వంటి ఉప విభాగాలనూ కలిగి ఉంటుంది. శ్వాసకోశ రుగ్మతలతో బాధపడేవారికి సింధు హాస్పిటల్స్ అభయహస్తం అందిస్తోంది. ఆస్తమా, సీఓపీడీ, స్లీప్ ఆప్నియా వంటి అనారోగ్య సమస్యలకు అధునాతన సంరక్షణను అందిస్తోందీ ఆస్పత్రి. వ్యాధి నిర్ధారణకు ఇక్కడి నిపుణులైన వైద్యులు అత్యాధునిక రోగ నిర్ధారణ సాధనాలను ఉపయోగిస్తారు. ఊపిరితిత్తుల పనితీరును, జీనవ నాణ్యతను మెరుగుపరచడానికి సమర్థవంతమైన చికిత్సను అందిస్తారు. శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బందులు శారీరకంగానూ, మానసికంగానూ సవాల్ విసురుతుంటాయి. శ్వాసలో స్వేచ్ఛను కోరుకునే వారికి వైద్య స్వర్గం- సింధు హాస్పిటల్స్.
యూరాలజీ
మూత్ర సంబంధ, పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అందించడానికి హామీనిస్తోంది సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ సమస్యల పరిష్కారానికి ఇక్కడి వైద్య బృందం అధునాతన శస్త్ర చికిత్స పద్ధతులను సమర్పిస్తోంది. మూత్రపిండాల్లో రాళ్లు, ప్రొస్టేట్ ఆరోగ్యం, మూత్రం ఆపుకోలేని వంటి పరిస్థితులకు నైపుణ్యం, సున్నితత్త్వంతో కూడిన ఆరోగ్య సేవలను అందిస్తోందీ హాస్పిటల్.
మీరు సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్తే..
అక్కడ హృదయమున్న వైద్యులుంటారు..
వారు మీ గుండెచప్పుడు వింటారు..
దయ, కరుణ, మానవీయతను మిళితం చేసి చికిత్సను అందిస్తారు..
కేవలం ‘నాడి’ పట్టుకుంటే రోగం గురించి తెలియదు.
రోగి మనసును కూడా చదవాలి..
అప్పుడే అటు శరీరానికి, ఇటు మనసుకు స్వాంతన కలుగుతుంది.
వైద్య రాజధానిగా పేరొందిన హైదరాబాద్లో హాస్పిటల్స్ చాలా ఉన్నాయి.
కానీ, హృదయపూర్వకంగా వైద్యం, చికిత్స అందించే విషయంలో సింధూ హాస్పిటల్ ముందు వరుసలో ఉంటుంది. అనారోగ్యంతో ఆస్పత్రి మెట్లెక్కే పేషంట్ల మనసులో గూడుకట్టుకున్న శూన్యాన్ని భర్తీ చేయడానికి మనసా, వాచా, కర్మణా వైద్య సేవలందించేందుకు సిద్ధమవుతోంది సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్.
హెటిరో సంస్థకు
నాలుగు స్తంభాలు
తండ్రి..
‘హెటిరో’ అనే మొక్కకు బీజం వేశారు.పెంచిపోషిస్తున్నారు.
కుమార్తె..
మానవీయ కోణంలో అందరికీ వైద్యం, వైద్యశాస్త్ర అందాలని అనుక్షణం కలగన్నారు..
కుమారుడు..
తండ్రి నాటిన హెటిరో అనే మొక్కను తన విశిష్ట నాయకత్వ లక్షణాలు, వ్యాపార విస్తరణ వ్యూహాలతో మహావృక్షంగా శాఖోపశాఖలుగా విస్తరింపచేశారు.చేస్తున్నారు.
కోడలు..
మావగారు, ఆడపడుచు, భర్త ఆశయాలు సాకారమయ్యేందుకు తెరవెనుక కనిపించని పాత్ర పోషిస్తున్నారు.
ఫార్మా రంగంలో తిరుగులేని సంస్థ ‘హెటిరో’ అనే మహాసౌధానికి వీరు నలుగురూ నాలుగు మూలస్తంభాలు.
సాయిసింధు ఆశలు, ఆశయాలు, కలలకు ప్రతిరూపంగా రూపుదాలుస్తోన్న సింధు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్.. కేవలం ఒక భవనం కాదు.. హృదయమున్న వైద్యశాల.
తన కుమార్తె జ్ఞాపకార్థంగా, ఆమె స్వప్నాన్ని సాకారం చేసే యత్నంలో అడుగడుగునా తన కుమారుడు, కోడలు స్ఫూర్తినింపుతున్నారని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి చెప్పారు.
ఆస్పత్రిలోని ప్రతి వైద్య విభాగం.. ప్రతి చికిత్స కేంద్రం.. వారి ప్రేరణతోనే పేషంట్ల గుండెచప్పుడు వినే.. వారి మనసును చదివే మానవీయ వైద్యకేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ఆయన అంటున్నారు.
ప్రజల గుండెల్లో ఎల్లకాలం నిలిచిపోయేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సాహసోపేత నిర్ణయాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ దంపతులు.
Review నాణ్యమైన వైద్యానికి పూచీ.. మానవీయ చికిత్సకు హామీ...