
ఈ క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ప్రభాస్ అంటే ‘బాహుబలి’ హీరో ప్రభాస్ కాదు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్యప్రభాస్. ఈయన తమిళంలో ‘యాగవరాయినుమ్ నా కాక్క’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. తెలుగులో ‘మలుపు’ అనే టైటిల్తో ఈ సినిమా విడుదలైంది. ఇందులో హీరో సత్యప్రభాస్ సోదరుడు ఆది పినిశెట్టి. ‘మలుపు’ తరువాత సత్యప్రభాస్ తన నెక్టస్ ప్రాజెక్టును అఖిల్తో చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు రామానాయుడు మనవడు రానా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా గురించి అక్కినేని కుటుంబం త్వరలోనే అనౌన్స్ చేయనుందని ఫిల్మ్నగర్ టాక్.
Review ప్రభాస్ డైరెక్షన్.. రాణా నిర్మాత.. అఖిల్ హీరో.