దుబాయ్లో ‘సాహో’
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సాహో’ అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలోని కీలకమైన ఓ యాక్షన్ సీన్ దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట. దీని కోసం చిత్రం యూనిట్ దుబాయ్లోనే మకాం వేసింది. లొకేషన్స్ ఎంపిక కోసం చిత్రం యూనిట్ ఇప్పటికే ఎనిమిది సార్లు దుబాయ్ వెళ్లిందట. నెలన్నర నుంచి ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ సెట్ కోసం స్కెచ్ వేస్తున్నారట.




