మంత్రపుష్పం

ఓంకార రూపం త్య్రహమితి చపరం యత్స్వరూపంతురీయం ।। త్రైగుణ్యాతీత నీలం కలయతిమనస స్తేజసిస్థూర మూర్తిమ్‍ ।। యోగీన్ద్రా బ్రహ్మరన్ద్రే సకల గుణమయం శ్రీహరేన్ద్రేణ సంగం ।। గం గంగంగం గణేశంజముఖమభితో వ్యాపకం చిన్తీయన్తి ।। ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు, త్రిగుణాత్మకమైన ఈ అఖిలాండకోటి బ్రహ్మాండమైన ప్రకృతికి పరమైన వాడు, జాగ్రత్‍, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను దాటిన తురీయరూపుడు, మనసును దేదీప్యమానంగా ప్రకాశింపచేసేవాడు, తేజ స్వరూపుడు, సింధూర వర్ణకాంతి గలవాడు, సకల గుణ గణాలు

రుషి పీఠం

భృగువంశానికి చెందిన వారు హరీత మహర్షి. గొప్ప వేదవేదాంగవేత్త. బ్రహ్మజ్ఞాని గోతప్రవరుడు. ఈయననే ఆచార్య హరిత అని కూడా పిలుస్తారు. ఈయన సూర్యవంశపు రాజుగా జన్మించి.. అనంతరం తన తపశ్శక్తితో బ్రాహ్మణత్వం పొందిన వాడు. ఈ సూర్యవంశం ఇక్ష్వాకు వంశానికి చెందినది. సూర్యవంశం రాజైన యౌవనాశ్వుడి కుమారుడే హరితుడు. యౌవనాశ్వుడు మాంధాత మనవడు. అంబరీషుడి కుమారుడు. హరీతుడు క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ అంగీరస మహర్షి మార్గదర్శకత్వంలో బ్రాహ్మణత్వం పొందాడు హరీత మహర్షి సంతానమే ‘హరితస’/హరిత

పురాణ పాత్రలు

హిందూ సాహిత్యంలో సాటిలేనిది రామాయణం. మన ప్రాచీన ఇతిహాసాలలో ఇదొకటి. దీనిని వాల్మీకి మహర్షి రచించారు. ఇందులో పలు పాత్రలున్నాయి. ముఖ్యమైన పాత్రల సంక్షిప్త పరిచయం.. కైకసి: రాక్షస రాజు సుమాలి, కేతుమతి దంపతుల కుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. కైకసి విశ్రవసుడి భార్య. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖలకు తల్లి. కైకేయి: దశరథ మహారాజు మూడవ భార్య. భరతుని తల్లి. తన దాసి అయిన మంథర మాటలు విని శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి

ఆధ్యాత్మి‘కథ’

పూర్వం అనగనగా ఒక ఊరిలో ఒక నిరుపేద ఉండేవాడు. అతడు ఎంత నిరుపేద అంటే.. యాయవారాలు ఎత్తుకుని ఇల్లు గడుపుకునే వాడు. దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అన్నట్టుగా అతనికి ముగ్గురూ కూతుళ్లే పుట్టారు. రోజూ యాయవారాలెత్తుతూ ముగ్గురు కూతుళ్లు, భార్యను ఎలాగో పోషించుకునే వాడు. ముగ్గురు కూతుళ్లలో పెద్దదాని పేరు పేరమ్మ. రెండో దాని పేరు అంకమ్మ. మూడో దాని

అనగనగా.. కథ

పూర్వకాలంలో అమరావతిలో ఒక గొప్ప కళాకేంద్రం ఉండేది. దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించే వారు. అక్కడి విద్యార్థులు అందరిలోనూ రత్నఘోషుడనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగే వాడు. అవి చూసిన వాళ్లందరూ, ‘ఇతడు ముందుముందు గొప్ప చిత్రకారుడు అవుతాడు. దేశానికి ఖ్యాతి తీసుకువస్తాడు’ అని అనుకునే వారు. ఆ కళాకేంద్రంలోనే జయప్రభ, చందప్రభ అని మరిద్దరు పిల్లవాళ్లు కూడా చిత్రకళ నేర్చుకునే వారు. అందరూ రత్నఘోషుడిని ప్రశంసించడం చూసి ఈ

Top