Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

స్వాతంత్య్ర దీప్తి వజ్రోత్సవ కీర్తి
డెబ్బై అయిదు సంవత్సరాల స్వతంత్ర భారతం మనది. ఈ ఆగస్టు 15కి మనకు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో 2021, మార్చి 12న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022, ఆగస్టు 15కు 75 వారాల ముందు ప్రార్బభమైన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది (2023), ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. నాటి మన స్వాతంత్య్ర పోరాటం గురించి నేటి తరానికి తెలియచెప్పడం, ఈ డెబ్బై అయిదేళ్లలో మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? ఈ డెబ్బై అయిదేళ్లలో మనం సాధించిన విజయాలు, ఈ డెబ్బై అయిదేళ్లలో చేపట్టిన చర్యలు.. వంటివి మననం చేసుకోవడానికి ఈ ఉత్సవాలను ఉద్దేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు వివిధ రంగాలకు చెందిన 250 మంది ప్రముఖులతో ఒక జాతీయ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సాతంత్య్ర పోరాట స్ఫూర్తి, దేశం కోసం ప్రాణార్పణ చేసిన వీరులు, వారు చేసిన ప్రతిజ్ఞలు, సనాతన భారత వైశిష్ట్యం, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో చిరస్థాయిగా చిలిచిపోయేది- దండియాత్ర. దీనిని గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 241 మైళ్ల మహా పాదయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ 2021, మార్చి 12న ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఇరవై అయిదు రోజుల పాటు కొనసాగి 2021, ఏప్రిల్ 5న దండిలో ముగిసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే, వేడుకలను ఏకకాలంలో పదహారు చోట్ల ప్రారంభించారు. ఢిల్లీలోని ఖిలారాయ్ ఫిథోరా, గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్లోని గోల్కొండ కోట, ఐజ్వాల్లోని భువనేశ్వరి ఆలయం, ముంబైలోని ఆగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కోణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్ ప్రదేశ్ రెసిడెన్సీ బిల్డింగ్, కాంగ్రా కోట, ఝూన్సీకోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేందప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ఘాట్, అమరావతి (మహారాష్ట్ర), జైపూర్ ప్యాలెస్ వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించారు. ఇంకా గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిల వరకు అందరూ అన్ని స్థాయిల్లో భారత స్వాతంత్య్ర ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా నిర్వహించాలని, 2047 నాటికి భారతదేశం ఏ స్థాయికి చేరాలో అనేందుకు అందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే..
ఆజాదీ అంటే స్వేచ్ఛ. అమృత్ అంటే అజరామరం. మహోత్సవ్ అంటే అతి పెద్ద సంరంభం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభం అని అర్థం. దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగించిన ఉద్యమమే జాతీయోద్యమం. అదే స్వాతంత్య్రోద్యమం. భారత జాతి దాస్య శృంఖలాల విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణపాయంగా భావించి తాగ్యం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. అలాంటి జాతీయోద్యమం నాటి చరిత్రతో ముడిపడి ఉన్న క్షణాలను గుర్తుచేసుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
స్వాతంత్య్ర పోరాటంలో మనోళ్లు..
ఆంగ్లేయుల పాలనలో దేశ ప్రజానీకమంతా అష్టకష్టాలకు గురయ్యారు. నాటి సమయంలో కవులు, కళాకారులే అప్పటి పరిస్థితులపై ఫిరంగులై స్పందించి జనంలో చైతన్యం తెచ్చారు. 1900 సంవత్సరం మొదలుకుని దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ చైతన్యఝురి జాలువారింది.
ఆంగ్లేయుల సామ్రాజ్యవాదాన్ని నిరసించిన తెలుగు కవులు వారిని, ‘సామ్రాజ్య క్షుధాబాధితుల్’ అని ఈసడించారు.
ఆంగ్లేయుల దాష్టీకానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అప్పటి కృష్ణా పత్రిక, జమీన్ రైతు, ఆంధ్రభాషా సంజీవని, వివేకవర్ధిని, గోల్కొండ, విశాలాంధ్ర మొదలైన పత్రికలు దోహదపడ్డాయి. ప్రజల్లో దేశభక్తిని పెంచేందుకు మరెన్నో సంస్థలు ఏర్పాటయ్యాయి.
భరతఖండంబు చక్కని పాడియావు
జాతీయోద్యమంలో భాగంగా వెలువడిన తొలి పద్యాల్లో ఒకటిగా భావించే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ అనే పద్యం భారతదేశాన్ని చక్కని పాడి ఆవుతో పోల్చింది. అంత చిన్న పద్యంలో బ్రిటిష్ వారి పీడనను వర్ణించాడు కవి (ఈ పద్యాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు రాశారని కొందరు, చెన్నాప్రగడ భానుమూర్తి గారి రాశారని మరికొందరు అంటారు).
ఈ దేశ ప్రజలు లేగదూడలై ఏడుస్తుంటే, తెల్లదొరలు వారి మూతులు బిగించి మరీ పాలు పితుకుతున్నారన్న చమత్కారం ఈ పద్యంలో ఉంది.
1907లో లాలా లజపతిరాయ్ అరెస్టు అయినపుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ‘చెరసాలల్ పృథు చంద్రశాలలెయగున్’ అంటూ పద్యం రాశారు.
లోకమాన్య బాలగంగాధర్ తిలక్; గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ మొదలైన నాయకుల పిలుపు మేరకు ఎందరో దేశభక్తులు స్వాతంత్య్రోద్యమ యవనికపై ఉదయించారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు, పొట్టి శ్రీరాములు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితర నాయకుల నేతృత్వంలో తెలుగు వారు స్వరాజ్య శంఖం పూరించారు.
ఈ పోరాటంలో దువ్వూరి సుబ్బమ్మ, గుమ్మడిదల దుర్గాబాయి తదితర మహిళలూ తమదైన పాత్ర పోషించారు. ఉద్యమంలో పాల్గొనే పురుషులకు స్త్రీలు వీరతిలకం దిద్ది స్వరాజ్య సమరంలో పాల్గొనాలని పంపేవారు.
ఈ నేపథ్యంలోనే త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన, ‘వీరగంధము తెచ్చినారము/వీరుడెవ్వరో తెల్పుడీ/పూసిపోదుము మెడనువైతుము/ పూలదండలు భక్తితో..’ అనే పాట నాటి మహిళల దేశభక్తికి అద్దం పడుతుంది.
స్వరాజ్య పోరాటంలో పూర్వ ఆంధప్రదేశ్లోని ఎందరో కవులు, సాహితీవేత్తలు, పత్రికలు అగ్గిబరాటాలై నిలిచారు. ఎవరి స్థాయిలో వారు తమ స్వరాజ్య వాణి వినిపించారు. నాటి జాతీయోద్యమంలో ఒక వెలుగు వెలిగిన తెలుగు వెలుగులను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.
సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ హాజర్యారు. ఈ సభలోనే పింగళి వెంకయ్య గారు తాను రూపొందించిన జాతీయ పతాకాన్ని మహాత్మాగాంధీకి అందించారు.
మాగంటి అన్నపూర్ణమ్మ తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను తిలక్ స్వరాజ్యనిధి నిమిత్తం గాంధీజీకి అందించారు.
వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు. జైళ్ల పాలయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ రోజుల్లో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో మహాత్మాగాంధీది విశిష్ట స్థానం. ఆ సందర్భంలోనే గాంధీజీని అవతార పురుషుడిగా కీర్తించారు పలువురు తెలుగు కవులు.
మాగంటి అన్నపూర్ణమ్మ తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను తిలక్ స్వరాజ్యనిధి నిమిత్తం గాంధీజీకి అందించారు.
వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు. జైళ్ల పాలయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ రోజుల్లో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో మహాత్మాగాంధీది విశిష్ట స్థానం. ఆ సందర్భంలోనే గాంధీజీని అవతార పురుషుడిగా కీర్తించారు పలువురు తెలుగు కవులు.
‘కత్తి కదల్చలేదు, విశిఖాల విదల్చను లేదు
గాండివం బెత్తనులేదు, ఏ క్రియ జయించితివో
నరమాంస పారణోన్మత్తుల
మీ ప్రభావములమానుషముల్
భవదీయ శాంతి సంపత్తికి దోసిలొగ్గెను ప్రపంచము
భారత భాగ్యదేవతా!’ అని గాంధీ అహింసా మార్గాన్ని తన చక్కని పద్యంలో ఇమిడ్చారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
‘మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ గారు రచించిన పాట తెలుగునాట ప్రజానీకాన్ని ఉర్రూతలూగించింది. తెల్లదొరల నూట అరవై ఏళ్ల పాలనలోని దౌర్జన్యాలను కళ్లకు కడుతూ 160 పాదాలుగా సాగే ఈ పాట ప్రపంచ సాహిత్యంలో అతి పెద్ద పాటగా చరిత్రకెక్కింది. తెలుగు వారి గుండెలను మండించి పౌరుషాగ్ని జ్వాలలు రగిలించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన్నె విప్లవం లేవనెత్తాడు అల్లూరి. ఆయన పోరాటాన్ని- ‘రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయక ప్రజన్/ దోచు పర ప్రభుత్వమ్మును దోచిన రాజుల చిన్నవాడ’ అని ప్రశంసిస్తారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి.
మద్రాసులో సైమన్ కమిషన్ను బహిష్కరిస్తూ సాగించిన నిరసన ఉద్యమంలో పోలీసులు గుళ్ల వర్షం కురిపించారు. కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అతడిని చూసేందుకు వెళ్తున్న టంగుటూరి ప్రకాశం పంతులుపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. అప్పుడు ప్రకాశం గారు ‘దమ్ముంటే కాల్చండి’ అని రొమ్ము చూపించారు. ఈ ధైర్య సాహసాలే ఆయనను ఆంధ్రకేసరిగా నిలిపాయి.
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా యెవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా
నీ జాతి నిండు గౌరవము అంటూ రాయప్రోలు సుబ్బారావు నినదించారు.
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజుల్లో ఎక్కడ మూడు రంగుల జెండా కనిపించినా ఆంగ్లేయులకు శత్రుకేతనంలా కనిపించేది. తలపై ఖద్దరు టోపీ ఎవరు ధరించినా, అది తమ అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం భావించేది. అలాంటి వారిపై ఆంగ్లేయులు కఠిన చర్యలు తీసుకునే వారు.
ఒంగోలులో గుడిమెట్ల తిరువెంగళాచార్యులనే పద్నాలుగేళ్ల బాలుడు నిషేధిత కరపత్రాలు పంచుతున్నాడనే నెపంతో పోలీసులు ఆ బాలుడిని నడిరోడ్డుపై పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
బందరులో తోట నరసయ్య నాయుడు జెండా ఎగురువేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను స్పంహ తప్పేలా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక నరసయ్య నాయుడు మరణించారు.
ప్రాణమంటే, అభిమానముంటె మన
ప్రాణములనన్ - బలియొసంగి
జెండా ఎత్తర, జాతికి ముక్తిర
నిండగు శక్తిర, నిల్పర కీర్తి
అంటూ గురజాడ రాఘవశర్మ రచించిన గేయం జాతీయ పతాకం మీద ఆనాటి ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. దేశభక్తి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేలా చేసింది.
‘కత్తులు లేవు, శూలమును గాండివమున్
మొదలే హుళక్కి నోరెత్తి ప్రచండ వాక్పటిమనేనియు జాటడు
వైరి మీద దం
డెత్తగ సేనలేదు, బలహీనపుకాయము, కోపతాపముల్
బొత్తిగ సున్న అట్టి వరమూర్తి మనోబలశాలి,
గాంధీ జేయెత్తి నమస్కరించి స్మరియించుద మెప్డు
స్వరాజ్య సిద్ధికిన్’ అని దామరాజు పుండరీకాక్షుడు గారు గాంధీని కీర్తించారు.
తెలంగాణ.. కోటి రతనాల వీణ
1947, ఆగస్టు 14, అర్ధరాత్రి దాటి ఆగస్టు 15 ప్రవేశించగానే భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది. కానీ, హైదరాబాద్ ర్యాం మాత్రం నిజాం నవాబు ఇనుప సంకెళ్ల నుంచి విముక్తి పొందలేదు. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలని ప్రజలు కాంక్షించారు. మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, స్వామి రామానందతీర్థ, పండిట్ నరేంద్రజీ, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు మొదలైన నాయకులు నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమించారు. యల్లాప్రగడ సీతాదేవి, సంగెం లక్ష్మీబాయమ్మ వంటి మహిళలు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలోకి దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే, మన కొంపలార్పిన - మన స్త్రీల చెరచిన
మన పిల్లలను చంపి - మనల బంధించిన
మానవాధములను - మండలాధీశులను
కండకండగా కోసి కాకులకు వేయాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె అని ప్రజాకవి కాళోజీ గర్జించారు.
వరంగల్లో మొగిలయ్య, రామస్వామి సోదరులు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా, వరంగల్ కోటపై జాతీయ జెండాను ఎగురవేస్తుండగా వెనుక నుంచి రజాకార్లు వెళ్లి మొగిలయ్యను బల్లెంతో పొడిచి దారుణంగా హతమార్చారు. ‘భారత మాతకు జై’ అంటూ మొగిలయ్య ప్రాణాలు విడిచాడు. తెలంగాణలో జాతీయజెండా వీరుడుగా మొగిలయ్య ప్రసిద్ధి చెందాడు. దీనికి స్పందిస్తూ చందాల రామకవి-
నవాబులకు స్థానం లేదు - యిమ్మంచు అడిగెదికలేదు
గానమ్ము గాదిది బ్రాణమ్ము - సంగ్రామమునకు పయనమ్ము
రానిమ్ము దేవుడె కానిమ్ము - బారు ఫిరంగులు మ్రోగినా
బాంబుల వర్షం కురిసినా - ఎత్తిన జెండా దించబోం అని రాశారు. అలాగే, తెలంగాణలో జాతీయాభిమాని షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ పత్రికలో రజాకార్ల ఆగడాలను తెగడుతూ వ్యాసాలు రాసేవాడు. ఇది రజ్వీకి కోప కారణమైంది. తన అనుచరులతో కలిసి 1948,ఆగస్టు 21న షోయబుల్లా చేతులు నరికి, కాల్చి చంపేశారు.
జనగాం తాలూకాలోని కడివెండి గ్రామ నివాసి కొమురయ్య ప్రజా హక్కులు కాపాడటానికి కంకణం కట్టుకున్నాడు. స్థానిక దేశ్ముఖ్పై తిరగబడ్డాడు. దాంతో దేశ్ముఖ్ గూండాలు జరిపిన హత్యాకాండలో కొమరయ్య ప్రాణాలు వదిలాడు. నిజాం సంస్థానంలో శాంతి భద్రతల సంరక్షణకు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనికచర్యకు ఆదేశించారు. 1948, సెప్టెంబరు 17న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సుద్దాల హనుమంతు, యాదగిరి, సుంకర మొదలైన కవులు ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించే రచనలు చేశారు ఆ కాలంలో. ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలం. అందుకే-
మాతృదేవి బలిమంటపమందు
యజ్ఞ పశువుగ నిల్చునంతటి భాగ్య
మెవనికి సిద్ధించు నిందరిలోన
నా మహా పురుషుని అరి కాలు దుమ్ము
ప్రజల శిరంబెక్కి భవ్యంబు సేయు
అంటూ దేశమాత బానిస గొలుసులు తెంచడానికి ముందుకొచ్చిన ప్రతి వీరుడిని స్మరిస్తాడు కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి.
జాతీయోద్యమ కాలంలో తెలుగునేలపై భారతమాత, జాతీయ నాయకులు, మువ్వన్నెల జెండా, ఖద్దరు - రాట్నం, సంఘ సంస్కరణలపై కవిత్వం కోకొల్లలుగా వచ్చింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తోంది. అప్పటి తరంలో ప్రతి ఒక్కరినీ కదిలించి, ఉద్యమంలోకి ఉరకలెత్తించింది జాతీయోద్యమ కవిత్వం. అప్పటి సమస్యలు వేరు. ఇప్పుడున్నవి వేరు. అయినా దేశభక్తి మాత్రం ఎప్పటికీ ఉండాల్సిందే. భారతదేశం ఉన్నన్నాళ్లు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది జాతీయోద్యమ కవిత్వం.
ప్రజల వ్యతిరేకతను అణచివేయడానికి నిజాం ప్రోద్బలంతో ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు బయల్దేరారు. వీరు తెలంగాణలో ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. పీడనకు వ్యతిరేకంగా ఎందరో కవులు తమ కలాలతో గళాలు వినిపించారు.
75 ఏళ్ల భారతంలో కొన్ని ముఖ్య ఘట్టాలు
మన దేశ తొలి గణతంత్ర దినోత్సవం (జనవరి 26, 1950) ఇర్విన్ ఆంఫి థియేటర్లో జరిగింది. ఇది ప్రస్తుత మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంగా మారింది. మొదటి రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, మార్చ్ఫాస్ట్ వంటివన్నీ ఇక్కడే జరిగాయి. 1955 నాటి గణతంత్ర దిన వేడుకలకు శాశ్వత వేదికగా రాజ్పథ్ మారింది.
ఏటా జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి విదేశీ అధినేతలు హాజరు కావడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అలా తొలి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి ఇండోనేషియా
అధ్యక్షుడు సుకర్ణో.
భారతదేశ చరిత్రలో 1944, జూలై 6కి ఒక ప్రత్యేకత ఉంది. సింగపూర్ నుంచి రేడియో ద్వారా ప్రసంగించిన నేతాజీ సుభాష్చంద్రబోస్ ‘ఫాదర్ ఆఫ్ ద నేషన్’ (జాతిపిత)గా మహాత్మాగాంధీని తొలిసారిగా సంబోధించిన రోజది.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ తొలి మహిళా పైలట్ హరితాకౌర్. 1994లో ఆమె తొలి మహిళా పైలట్గా భూమికి పదివేల అడుగుల ఎత్తున హెచ్ఎస్-748 ఎయిర్ప్రాఫ్ట్ను నడిపారు.
‘క్విట్ ఇండియా’.. ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో అందరికీ తెలుసు. బ్రిటిష్ పాలన పతనానికి నాంది పలికిన రణన్నినాదమది. ఈ నినాదాన్ని నిజానికి మహాత్మాగాంధీ ఇచ్చారని అందరూ అనుకుంటారు. అప్పటి బొంబాయి మేయర్, సోషలిస్టు నాయకుడు అయిన యూసుఫ్ మెహరాలీ ఈ నినాదకర్త.
భారతీయ విద్యా విధానంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యాసంస్థలు ఒక మైలురాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ అత్యున్నత విద్యాసంస్థల ఏర్పాటుకు బీజం పడింది.
భారత్ - పాకిస్తాన్ మధ్య విభజన రేఖ గీసిన సిరిల్ రాడిక్లిఫ్కు.. అసలు తను విభజించిన భూముల సాంస్క•తిక సూక్ష్మభేదాలు కూడా ఆయనకు తెలియవు. ఈ రెండు దేశాల మధ్య విభజన రేఖను నిర్ధారించడానికి కేవలం ఐదు వారాల సమయం మాత్రమే ఆయనకు ఇచ్చారు. ఈ విభజన రేఖే ఆయన పేరుపై రెడ్క్లిఫ్ లైన్గా పేరొందింది.
కోల్కతాలోని సెయింట్పాల్స్ కేథడ్రల్ చర్చి రెండు భూకంపాలను తట్టుకుంది. మొదట 1897లో అస్సాంలో భూకంపం సంభవించినపుడు ఈ చర్చి పై భాగం కూలిపోయింది. అనంతరం 1934లో బీహార్, నేపాల్ ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చినపుడు చర్చి మొత్తం దెబ్బతిన్నది. ఇప్పుడు మనం చూసే నిర్మాణం ఆ తరువాత కాలంలో రీడిజైన్ చేసినదే..
మహిళా విద్య, అంటరానితనాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళ సరళాదేవి.
ఒడిసాలో జాతీయోద్యమం
వేళ్లూనుకోవడం వెనుక ఆమె క్రియాశీలక పాత్ర ఎంతో ఉంది. భారతదేశంలో తొలి మహిళా ఖైదీగా కూడా ఆమెకు పేరు.
‘భారత స్వాతంత్య్ర పోరాటం’ సిరీస్లో భాగంగా భారత తపాలా శాఖ 1986లో అల్లూరి సీతారామరాజు స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
1948, జనవరి 30 భారతదేశ చరిత్రను రక్తాక్షరాలతో లిఖించిన రోజు. ఆ రోజు మితవాద హిందూ మహాసభ సభ్యుడు నాథూరామ్ గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చి చంపాడు.
దేశం కోసం ఆజాద్ హిందుఫౌజ్ తరపున తన విలువైన జీవితాన్ని తాగ్యం చేసిన మొదటి వ్యక్తి మేజర్ దుర్గా మల్లా.
భారతదేశ చరిత్రలో శివాజీ మహారాజ్ మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందీ, శివాజీకి రాఖీ కట్టినది మహారాణి బేలవాడి మల్లమ్మ. 17వ శతాబ్దంలో శివాజీ మహారాజ్తో కలిసి ఆమె యుద్ధంలో పాల్గొంది.
సిక్కిం బారత్లో విలీనమైన రోజు- 1975, ఏప్రిల్ 22. ఈరోజున భారత్ లోక్సభ 36వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో సిక్కిం భారత్లో 22వ రాష్ట్రంగా మారింది. అంతకుముందు సిక్కింలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 97.5 శాతం మంది సిక్కిం భారత్లో కలవడానికి మద్దతిచ్చారు.
1975, జూన్ 25.. భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఆ రోజు రాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. తనను వ్యతిరేకించే, ప్రతిపక్ష పార్టీ నేతలను మూకుమ్మడిగా అరెస్టు చేయించారు.
రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ గెలిచారు. అయితే ఎన్నికల సమయంలో ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ రాజ్ నారాయణ్ వేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు విచారించింది. ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975, జూన్ 12న తీర్పునిచ్చింది.
మౌంట్ ఎవరెస్ట్పై మన భారత జాతీయ పతాకం తొలిసారిగా మే 29, 1953లో రెపరెపలాడింది. దీన్ని ఎగురవేసిన తొలి పర్వతారోహకుడిగా నేపాలీ ఇండియన్ టెంజింగ్ నార్గే చరిత్రలో నిలిచిపోయారు. ఆయనతో పాటు న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ కూడా అదే సమయంలో ఎవరెస్ట్ను అధిరోహించారు.
భారత్ తన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975, ఏప్రిల్ 19న అంతరిక్షంలోకి పంపింది. 360 కిలోల ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లో అభివృద్ధి చేశారు.
భారత్ తొలి అణు పరీక్షను 1974, మే 19న నిర్వహించింది. రాజస్తాన్లోని పోఖ్రాన్లో తొలి భూగర్భ అణు పరీక్ష నిర్వహించడం ద్వారా అణ్వాయుధాలు కలిగిన ఆరు దేశాల సరసన చేరింది.
1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమయ్యాక భారత సైన్యం ఢాకాను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. పాకిస్తాన్కు చెందిన 90 వేలకుపైగా సైనికులు లొంగిపోయారు. అనంతరం •ంగ్లాదేశ్ ఏర్పడింది.
దేశంలో 1971లో రాజభరణాల చట్టం రద్దయింది. 1947లో 500కిపైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఆయా సంస్థానాధిపతులకు ఏటా రాజభరణం
ఇస్తామని భారత ప్రభుత్వం హామీనిచ్చింది. 1971లో కాంగ్రెస్ ప్రభుత్వం 26వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేసింది.
భారతదేశంలో 1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. అప్పటి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వర్గీస్ కురియన్ ఆలోచనల నుంచి ఇది పురుడు పోసుకుంది. దేశంలో శ్వేత విప్లవం ప్రారంభమయ్యాక పరిమితంగా పాలు ఉత్పత్తి చేసే దేశాలు అదనంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.
1969లో దేశంలో 14 పెద్ద బ్యాంకులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారు. ఈ చర్యను కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేశారు.
దేశంలో 1967లో నక్సల్ విప్లవం ప్రారంభమైంది. సిలిగురి డివిజన్ 3నక్సల్బరి గ్రామం నుంచి మొదలైన ఈ ఉద్యమం క్రమంగా పశ్చిమబెంగాల్ ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ సాయుధ పోరాటానికి చారు మజుందార్, కాను సన్యాల్ నేతృత్వం వహించారు.
నార్మన్ బోర్లాగ్, ఎమ్మెస్ స్వామినాథన్ల నాయకత్వంలో భారతదేశం 1966లో తొలి హరిత విప్తవానికి నాంది పలికింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన సాగు విధానాలతో దేశం ధాన్యం ఉత్పత్తిలో స్వావలంబన సాధించింది.
1966లో తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత భారతదేశపు తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టారు. అప్పుడామె దేశానికి మూడో ప్రధాని.
1965, ఆగస్టులో భారత్పై పాకిస్థాన్ దాడి చేసింది. కశ్మీర్లో భారత వ్యతిరేక వాతావరణం సృష్టించడానికి పాకిస్తాన్ మొదట చొరబాటుదారులను పంపింది. తరువాత సెప్టెంబర్ 1న భారత్పై దాడికి దిగింది. మూడు వారాల తరువాత యూఎన్ జోక్యంతో యుద్ధం ఆగింది. ఈ యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట భాక్రానంగల్. సట్లెజ్ నదిపై ఈ డ్యామ్ నిర్మాణ పనులు 1954లో మొదలయ్యాయి. 1963 నాటికి పూర్తయ్యాయి. 680 అడగుల ఎత్తయిన ఈ ఆనకట్టను ‘ఆధునిక భారత దేవాలయం’గా మన దేశ తొలి ప్రధాని నెహ్రూ అభివర్ణించారు
1962, అక్టోబర్ 19న చైనా సైన్యం తూర్పు, పశ్చిమ సెక్టార్ల మీదుగా భారత్పై దాడి చేసింది. చైనా దగ్గరున్న మెరుగైన ఆయుధాలు, సైనిక బలగం ఎక్కువగా ఉన్న కారణంగా భారత్ ఈ యుద్ధంలో ఓడిపోయింది.
పోర్చుగీసు వారి ఆధీనంలోనే గోవా దాదాపు 451 ఏళ్లపాటు ఉండిపోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఇది మన దేశంలో అంతర్భాగం కాలేదు. చివరకు, 1961 డిసెంబర్ 19న భారత సైన్యం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా, డయూ, డామన్లను ఆక్రమించుకుంది. ఆ విధంగా పోర్చుగల్ పాలన నుంచి గోవా విముక్తి పొందింది.
భారతదేశంలో 1959, సెప్టెంబర్ 15న తొలిసారిగా టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో తొలి దూరదర్శన్ కేంద్రం ఏర్పాటైంది.
1957, ఏప్రిల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో గెలిచి కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే ఎన్నికల పక్రియ ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయ్యారు.
ఆసియాలోనే తొలి అణు రియాక్టర్ ‘అప్సర’ ముంబయి శివారులోని ట్రాంబేలో 1956, ఆగస్టు 4న ఏర్పాటైంది. భారత అణు పరిశోధనలకు ఇది పునాదిగా నిలిచింది. దీని ఏర్పాటుకు హోమీ జే బాబా కీలకంగా వ్యవహరించారు.
1954, ఏప్రిల్ 29న భారత్ - చైనా పంచశీల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఐదేళ్ల పాటు ఇరు దేశాలూ ఈ ఒప్పందాన్ని పాటించాయి. ఈ ఒప్పందం నేపథ్యంలోనే ‘హిందీ చీనీ భాయి భాయి’ అనే నినాదం పుట్టింది.
చిప్కో ఉద్యమానికి ఆద్యుడు సుందర్లాల్ బహుగుణ. ఈయన ప్రముఖ పర్యావరణవేత్త. 1973లో ఉత్తరప్రదేశ్లోని పర్వత ప్రాంతాల్లో చెట్లు కొట్టేందుకు ఒక స్పోర్టస్ కంపెనీ వచ్చినపుడు స్థానికులు దాన్ని వ్యతిరేకించి, ఉద్యమించారు. ఇదే సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో చెట్లు కొట్టడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.

లక్ష్మీ గణపతిం భజే!
లక్ష్మీ గణపతి..
తెలుగునాట ఈ దైవాల చిత్రపటం లేని ఇల్లు దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు.
చేసే పనుల్లో విఘ్నాలు తొలగించే దైవం ఒకవైపు..
లక్ష్యసిద్ధిని సిద్ధింపచేసే ‘లక్ష్య’దేవి మరోవైపు..
ఇద్దరూ కలిసి మన ఇంట్లోనే ఉంటే.. ఇక మనం చేసే పనులన్నింటా జయమే..
అందుకే కాబోలు ‘లక్ష్మీ గణపతి’ అనే ద్వయం ఇంటింటా కొలువుదీరింది.
ఇదే విశేషమైతే.. ఈ ఆగస్టులో మరో పరమ విశేషం పలకరిస్తోంది.
శ్రావణ, భాద్రపద మాసాల కలయిగా ఉన్న ఆగస్టులో ఈ జంట దేవుళ్ల జంట పండుగలు ఒకే నెలలో వచ్చాయి.
ఆగస్టు 12, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. అదీగాక, శ్రావణ మాసం పొడవునా లక్ష్మీ ఆరాధనకు ‘నెల’వైన మాసం.
అలాగే, ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి. ఈనాటి నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి.
ఇలా జంట పర్వాలు ఒకే నెలలో రావడం విశేషమే.
ఇక, ‘లక్ష్మీ గణపతి’ చిత్ర విశేషంపై చాలా సందేహాలున్నాయి.
లక్ష్మీదేవి విష్ణుదేవుడి భార్య. మరి, గణపతితో ఉన్న లక్ష్మి ఎవరు?
మంత్ర శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి నిజానికి ఆ లక్ష్మి వేరు. ఈ లక్ష్మి వేరు.
లక్ష్మి అంటే ‘లక్షణ శక్తి’.
ప్రతి దేవతకీ దేవతా శక్తి ఈ లక్ష్మి.
ఐశ్వర్యమే లక్ష్మి. ఆ దైవం యొక్క శక్తే ఆ దైవానికి ఐశ్వర్యం.
కాబట్టి ఆ దైవశక్తిని ‘లక్ష్మి’అన్నారు.
విష్ణుపత్ని లక్ష్మికి, గణపతి శక్తి లక్ష్మికీ భేదం ఉందని అంటారు.
పరాశక్తి లక్ష్మియే గణపతితో కూడి ఉంటుందని గౌరిగా
శివాంకంలో ఉందని తంత్ర శాస్త్రం చెబుతోంది.
పరమాత్మను గణపతిగా ఉపాసించి, ఆయన శక్తిని లక్ష్మిగా ఉపాసించడమే ‘లక్ష్మీగణపతి’ భావన.
మొత్తానికి లక్ష్యాన్ని సిద్ధింప చేసే లక్షణ శక్తి లక్ష్మి అయినా, విష్ణుపత్ని లక్ష్మి అయినా ఒకరే.
ఆ విజయలక్ష్మిని, విఘ్నాలను తొలగించే విఘ్నరాజాధిపతిని ఒకేసారి ఉపాసించే సందర్భం కలిసి వచ్చింది.
ఇద్దరినీ రెండు కళ్లుగా చేసుకుని ఆరాధించి నేత్రపర్వం గావించుకునే మహా విశేష సందర్భమిది.
అందరికీ వరలక్ష్మీ వ్రతం,
వినాయక చవితి శుభాకాంక్షలు
- కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
గురువులకే గురువు
తెలుగు పత్రిక జూలై సంచికలో గురుపూర్ణిమ సందర్భంగా దక్షిణామూర్తి గురించి ఇచ్చిన వివరాలు బాగున్నాయి. ఆయన గురువులకే గురువు. ఆయన రూప విశేషాలు, మూర్తిమత్వం గురించి మంచి వివరాలు అందించారు.
- సి.రాధాకృష్ణమూర్తి, ఆర్.రవిచందర్, పి.సుభాష్, రమేశ్చంద్ర, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
ప్రకృతి పాఠం
జూలై సంచికలో ఆధ్యాత్మిక వికాసం శీర్షిక కింద ప్రకృతి నుంచి మనిషి నేర్వాల్సిన విషయాలను దత్తాత్రేయుడు వివరించిన వైనం బాగుంది. ప్రకృతిని మించిన పరమ గురువు లేరు.
- ఎం.రామచంద్రరావు- హైదరాబాద్, ఆర్.రాజేశ్వరి-తిరుపతి, ఎ.రామకృష్ణ- కనిగిరి, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
మైండ్ఫుల్నెస్పై..
తెలుగు పత్రిక జూలై సంచికలో హెపటైటిస్ లక్షణాలు, అది మనపై చూపించే ప్రభావం, చికిత్స విధానాల గురించి చాలా వివరంగా ఇచ్చారు. అలాగే, ఆరోగ్యభాగ్యం శీర్షిక కింద మానసిక సమస్యలపై కూడా నిపుణుల సలహా సూచనలతో వివరాలు అందించండి. ఎందుకంటే ఇప్పుడు జనం శరీరానికి వచ్చే ఆరోగ్య సమస్యల కంటే మానసికంగానే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- కె.రామారావు, హైదరాబాద్

ప్రతి రోజూ పండుగే..
శ్రావణ-భాద్రపదాల కలయికతో వచ్చిన ఆగస్టు మాసం పొడవునా పండుగలు, పర్వాలే. ఆంగ్ల మానం ప్రకారం ఎనిమిదివ నెల అయిన ఆగస్టు మనకు శ్రావణ, భాద్రపద మాసాలతో కూడి వచ్చింది. ఇది పూర్తిగా వర్ష రుతు కాలం. ఈ మాసంలో ప్రతి రోజూ పండుగే.. నాగచతుర్థి మొదలుకుని వినాయక చవితి వరకు.. మధ్యలో నాగుల పంచమి, అజ ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, బలరామ జయంతి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు, వ్రతాలకు ఆగస్టు ‘నెల’వు.
2022- ఆగస్టు 1, సోమవారం, శ్రావణ శుద్ధ చతుర్థి నుంచి 2022- ఆగస్టు 31, బుధవారం, భాద్రపద శుద్ధ చతుర్థి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-శ్రావణం-భాద్రపదం-వర్షరుతువు- దక్షిణాయణం
నిండైన వర్షాలతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. సస్యశ్యామలమైన వాతావరణం.. ప్రకృతి పులకరింతలతో శోభిల్లే ఈ వర్షరుతు కాలంలో ప్రతి రోజూ పండుగే. సాధారణంగా అష్టమి, నవమి, అమావాస్య తిథులు శుభకార్యాలకు అంతగా పనికిరావని అంటారు కదా! కానీ, ఈ మాసంలో ఈ తిథులు కూడా పూజలకు, ప్రత్యేక ఆరాధనలకు ప్రశస్తమైనవి. శ్రావణ మాసం ఎన్నో విధాలుగా విశేషమైనది. అందుకే ఈ మాసాన్ని ‘శుభ మాసం’ అని అంటారు. అలాగే, దీనికి ‘ఆకాశ (నభో) మాస’మనే పేరూ ఉంది. పైగా శ్రావణం విష్ణుమూర్తి జన్మ నక్షత్ర మాసం కూడా. లక్ష్మితో కూడిన విష్ణువును ఆరాధించడానికి శ్రావణం ఉద్ధిష్టమైన మాసం. అలాగే, శివపార్వతులకు ప్రీతికరమైనదీ నెల. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను విశేషంగా పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠలుడి, గణేశుడి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి, తులసి పూజలు, శనివారం వేంకటేశ్వరస్వామి, హనుమంతుడి, శనీశ్వరుడి పూజలు, ఆదివారం సూర్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఆచరించే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధనకు శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. ఆమె- ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. ఇంకా, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు.. ఆయా తిథుల్లో ఆచరించాల్సిన ముఖ్య విధులు ఇవీ..
శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి జన్మతిథి కూడా ఈ మాసంలోనిదే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. అరవింద యోగి శ్రావణ మాసంలోనే జన్మించారు. ఇంకా ఆధ్యాత్మిక పరమ పురుషులైన ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్, చూడికుడుత్త నాంచార్ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోని శుద్ధ పంచమి నాడేనని ప్రతీతి. దక్షిణాయనంలో వర్ష రుతువు మొదటగా వచ్చేది శ్రావణ మాసంలోనే. దక్షిణాయనం వర్షాకాలం. అంటే, వివిధ జబ్బులు, వ్యాధులు ముసురుకునే సమయమిది. అందుకే ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసం పొడవునా మన పెద్దలు వివిధ వ్రతాలను ఆచరించాలని నియమం విధించారు.
• శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో శివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయాలి.
• శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి పదిహేను రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించాలి.
• శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది. కొత్తగా వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన ఇవ్వాలి.
• శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి.
ఆగస్టు 2, మంగళవారం శ్రావణ శుద్ధ పంచమి/నాగపంచమి
శ్రావణ శుద్ధ నాగ పంచమికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కథల్లో రెండు ముఖ్యమైనవివీ..
పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా, నాగటి కర్రు బొరియలో దిగబడిపోయింది. దాంతో బొరియలో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. తల్లి నాగు వచ్చి చూసే సరికి పిల్లలన్నీ చనిపోయి ఉన్నాయి. పక్కనే ఉన్న నాగలి కర్రుకు నెత్తుటి మరకలు అంటుకుని ఉండటాన్ని అది చూసింది. రోషావేశంతో బుసలుకొడుతూ తల్లి నాగుపాము రైతు ఇంటికి వెళ్లింది. రైతు కుటుంబంలోని అందరినీ కాటువేసి చంపేసింది. అత్తింట కాపురం చేస్తున్న రైతు కుమార్తెను కూడా కాటేయాలనే ఆవేశంతో అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫణిరాజైన ఆదిశేషుడిని పూజిస్తోంది. దీంతో ఆ తల్లి పాము ఆమె శేషుపూజను ముగించుకుని వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అంతలోపున పూజ నిమిత్తం తొమ్మిది నాగవంశాలను రాసిన పీఠంపై ఉన్న చందనపు గిన్నెలో పగడ ముంచి పక్కనున్న పాలను తాగి, పేలాలను మింగింది. దాంతో తల్లి పాము ఆవేశం చల్లారిపోయింది. అనంతరం ఆమె ఎదుట పడగ విప్పి నిల్చుని ‘నువ్వు ఎవరి కుమార్తెవు?’ అని నాగు ప్రశ్నించింది. ఆమె బదులివ్వగానే, ‘నేను నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను చంపివేశాన’ని నాగు చెప్పింది. ఆమె ఎంతో చింతించడంతో నాగు ఆమెకు కొంచెం అమృతం ఇచ్చింది. దీంతో ఆమె తన వారి నోట అమృతం పోసి మళ్లీ బతికించుకుంది.అప్పటి నుంచి శ్రావణ శుద్ధ పంచమి నాడు రైతులు అరక ముట్టుకోరు. పొలాలు దున్నరు. కూరగాయలు తరగడం, వంటవార్పులు కూడా నిషిద్ధాలయ్యాయి. నాగరాజుకు పాలు నివేదించాలనే నియమం ఇప్పటికీ తెలుగునాట అన్నిచోట్లా ఆచారంలో ఉంది.
ఇది మరో కథ..
ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కోడళ్లు. కడపటి కోడలు తప్ప మిగతా వారంతా ఒకసారి తమ పుట్టినిళ్లకు వెళ్లారు. కడపటి కోడలికి తల్లిదండ్రులు లేరు. కనీసం కొద్ది రోజులు ఉంచుకునే బంధువులూ లేరు. ఆమె పరమ భక్తురాలు. ఆదిశేషుడిని విశేషంగా పూజించేది. ఆమె భక్తికి ఆదిశేషుడు కరుణించి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె మామ గారి వద్దకు వచ్చాడు. తాను ఆమె మేనమామనని, ఆమెను తనింటికి పంపాలని కోరాడు. ఆమెను మామగారి అనుమతితో తనతో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఒక ఎలుక కలుగు వద్ద వృద్ధుడు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ఆమెను తన పగడపై ఎక్కించుకుని నాగలోకానికి తీసుకెళ్లాడు. ఆమెను ఎవరూ కరవరాదని ఆదిశేషుడు కఠినంగా ఆదేశించాడు. కొంతకాలానికి ఆదిశేషుని భార్య ప్రసవించింది. పాము పిల్లలన్నీ ఇంటి నిండా తిరగసాగాయి. ఒకనాడు ఆ కోడలు ఒక బరువైన ఇత్తడి దీపాన్ని పట్టుకుని వెళ్తుండగా, దారికి అడ్డంగా పారాడుతున్న పాము పిల్లలను చూసి భయంతో దీపాన్ని జారవిడిచింది. దీంతో పాము పిల్లలకు గాయాలయ్యాయి. కొన్నిటికి తోకలు తెగిపోయాయి. కొంతకాలానికి ఆదిశేషుడు ఆమెను అత్తారింటికి పంపేశాడు. అంతలో శ్రావణమాసం వచ్చింది. కోడలు శుక్ల పంచమి నాడు ఒక పీటపై నాగరూపాలను తీర్చిదిద్ది పూజ చేసింది. ఆనాడే, కాకతాళీయంగా తోకలు తెగిన పాము పిల్లలు తమ విరూపానికి కారణం ఏమిటని తల్లిని అడిగాయి. ఒకామె ఇత్తడి దీపాన్ని జారవిడవటం వల్ల మీద పడి మీకు గాయాలయ్యాయని తల్లి పాము చెప్పింది. దీంతో పాము పిల్లలన్నీ పగ తీర్చుకోవడానికి కోడలి ఇంటికి వచ్చాయి. కానీ, ఆమె తమను రక్షించాలని భగవంతుడిని వేడుకోవడం చూసి తమ దుష్టచింతనను మానుకున్నాయి. అక్కడ నైవేద్యంగా ఉంచిన పాలను, పేలాలను ఆరగించి, పాలగిన్నెలో ఓ రత్నహారాన్ని వదిలి వెళ్లిపోయాయి.
శ్రావణ శుద్ధ చతుర్థి/నాగ చతుర్థి
ఆగస్టు 1, సోమవారం
చతుర్థి నాడు సాధారణంగా గణేశ పూజలు విశేషంగా జరుగుతాయి. ఈనాటి పూజనే చతుర్థి వ్రతం అని అంటారు. అయితే శ్రావణ మాసపు శుద్ధ చతుర్థిని నాగ చతుర్థిగా భావించి పూజలు చేసే ఆచారమూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో నాగుల పూజ ఈ నాగ చతుర్థి నాడే జరుగుతుంది. ఆంధప్రదేశ్లో మాత్రం ఈ తిథి మర్నాడు వచ్చే నాగ పంచమి నాడు నాగుల పండుగ జరుపుకుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి/నాగ పంచమి
ఆగస్టు 2, మంగళవార
శ్రావణ శుద్ధ పంచమి తిథి నాగపంచమి పర్వం. అలాగే, ఇది శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం. ఈనాటి నుంచే మంగళగౌరీ వ్రతాలు ఆరంభమవుతాయి. అలాగే ఈనాడే గరుడ పంచమి కూడా. ఇక, జాతీయ పతాక రూపశిల్ప పింగళి వెంకయ్య గారి జయంతి తిథి కూడా ఈనాడే.
నాగ పంచమి గురించి హేమాద్రి స్కాంద పురాణంలో ఉంది. అందులో శివుడు పార్వతితో ఇలా చెప్పాడు.
‘ఓ పార్వతీ! శ్రావణ మాసాన శుక్ల (శుద్ధ) పంచమి నాడు ద్వారములకు రెండు పక్కలా పేడతో సర్ప చిత్రములను గీసి పూజించాలి. చతుర్థి నాడు ఒక్క పొద్దు ఉండి, పంచమి నాడు బంగారుతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ ఐదు పడగల పామును చేయించాలి. లేక పసుపుతో కానీ, చందనంతో కానీ ఐదు లేక ఏడు పాముల చిత్రములు గీయాలి. విధిప్రోక్తంగా పంచామృతంతోనూ, గన్నేరు, సంపెంగ, జాజి తదితర పువ్వులతో ఈ నాగపంచకాన్ని పూజించాలి. పిదప ఘృతపాయసమోదకాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. అనంతాది నాగరాజులను ధ్యానించాలి. నాగులను ఎప్పుడూ భక్తితో పూజించాలి. పంచమి నాడు పాలు, పాయసాలను నైవేద్యంగా పెట్టాలి. ఆనాడు పగలు కానీ, రాత్రి కానీ భూమిని తవ్వరాదు’’.
శ్రావణ శుద్ధ పంచమి నాడు స్త్రీలు పాముల పుట్టల వద్ద పూజ చేస్తారు. ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఈనాటి ఆచారం. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రావణ శుద్ధ షష్ఠి/కల్కి జయంతి
ఆగస్టు 3, బుధవారం
శ్రావణ శుద్ధ షష్ఠి నాటి నుంచి ఆశ్రేష కార్తె ప్రారంభమవుతుంది. ఈ తిథి కల్కి జయంతి దినంగానూ ప్రతీతి. శ్రావణ శుద్ధ షష్ఠి తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).
శ్రావణ శుద్ధ సప్తమి/ద్వాదశ సప్తమి వ్రతం
ఆగస్టు 4, గురువారం
శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించిన పర్వం. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. ‘రామచరిత మానస్’ రచించిన తులసీదాస్ జయంతి తిథి కూడా ఈనాడే. హస్తా నక్షత్రం దీని ముందురోజు వచ్చింది కాబట్టి ఆగస్టు 3నే సప్తమీ వ్రతం ఆచరించాలి.
శ్రావణ శుద్ధ అష్టమి/పుష్పాష్టమి
ఆగస్టు 5, శుక్రవారం
ఇది శ్రావణ మాసపు తొలి శుక్రవారం. దీని తరువాత వచ్చే మలి శుక్రవారమే (ఆగస్టు 12) వరలక్ష్మీ వ్రతదినం. ఆనాడే శ్రావణ పూర్ణిమ కూడా. సాధారణంగా దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు మరీ ఉద్ధిష్టమైనది. ఎందుకంటే అది శ్రావణ శుక్రవారం కావడంతో పాటు దుర్గాదేవి ఆరాధనకు ఉద్దేశించిన శుక్రవారం నాడే అష్టమి తిథి రావడం విశేషం. ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అని కూడా అంటారు.
శావణ శుద్ధ నవమి
ఆగస్టు 6, శనివారం
కౌమార దశలో ఉన్న బాలికలు ప్రత్యేక పూజలు చేయడానికి ఒక తిథిని ఉద్దేశించారు. అదే శ్రావణ శుద్ధ నవమి తితి. ఈ తిథికి ‘కౌమారీ నామక పూజనమ్’ అని పేరు. ఈ పేరును బట్టి ఇది కౌమార దశలో ఉన్న యువతులు ఆచరించే వ్రతంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.

పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రం తిన్న గుగ్గిళ్లు జీర్ణం
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం
అబ్బాయి (అమ్మాయి) తాగిన ఉగ్గుపాలు జీర్ణం
నందిలాగ కూర్చుని
తాబేలులాగ పాకి
లేడిలాగా లేచి
కుందేలులా
బాబు (పాప) పరుగెత్తాలి
ఇల్లెక్కడ?
రామచిలుక ఇల్లెక్కడ?
చెట్టు తొర్రలో నా ఇల్లు
పిచుక పిల్ల ఇల్లెక్కడ?
వేలాడే గూడే నా ఇల్లు
కాకమ్మ కాకమ్మ ఇల్లెక్కడ?
ఎత్తయిన చెట్టుపై నా ఇల్లు
నాగరాజు ఇల్లెక్కడ?
చీమలపుట్టే నా ఇల్లు
సింహం మామ ఇల్లెక్కడ?
కొండ గుహలే నా ఇల్లు
నత్త గుల్లమ్మ ఇల్లెక్కడ?
నాతోనే ఉందిలే నా ఇల్లు
చక్కిలి గిలిగిలి
పప్పు పెట్టి పాయసం పెట్టి
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి
కూర పెట్టి ఊరగాయ పెట్టి
నెయ్యి వేసి ముద్ద చేసి
తినిపించి తినిపించి
చేయి కడిగి మూతి కడిగి
తాతగారింటికి దారేదంటే
ఇట్లా పోయి ఇట్లా పోయి
మోచేతిపాలెం ముందర్నుంచి
ఇట్లా పోయి ఇట్లా పోయి
ఇదిగో ఇదిగో వచ్చాం
చక్కా వచ్చాం చక్కా వచ్చాం
చక్కిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి
నీకొకటి.. నాకొకటి..
చెన్నపట్నం చెరుకు ముక్క
నీకో ముక్క నాకో ముక్క
భీమునిపట్నం బిందెల జోడు
నీకో బిందె నాకో బిందె
కాశీపట్నం కాసులపేరు
నీకో పేరు నాకో పేరు
కొండపల్లి కొయ్య బొమ్మ
నీకో బొమ్మ నాకో బొమ్మ
నిర్మలపట్నం బొమ్మల పలక
నీకో పలక నాకో పలక
నూజివీడు మామిడిపండు
నీకో పండు నాకో పండు
కాకినాడ కాజా
నీకో కాజా నాకో కాజా
ఇస్తా ఉండు తెచ్చినాక
చూస్తూ ఉండు తెచ్చేదాక
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! [email protected]
US Universities
Temple in US
Telugu Velugulu
August 09, 2022
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia