Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

ధూర్జటి గారి గర్వం
శ్రీకృష్ణదేవరాయల సాహితీ మండపం పేరే భువన విజయం అని చెప్పుకున్నాం కదా! అది పాండిత్యంతో పాటు శృంగార సాహితీ పక్రియలకు కూడా ఎక్కువగా వేదికవుతూ ఉండేది. ముఖ్యంగా శృంగారభరితంగా ఉండే ధూర్జటి వారి కవిత్వాన్ని రాయల వారు ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయనను పొగడ్తలతో ముంచెత్తే వారు. ఇదంతా మిగతా కవులకు చిన్నతనంగా ఉండేది. అవమానంగా కూడా భావించే వారు. ఈ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలని మిగతా కవులంతా తెనాలి రామకృష్ణుడిని కోరారు.
ధూర్జటి గారు ‘కాళహస్తీశ్వర శతకం’ రచించిన మహా పండితుడు. ఆయన నొసటన విభూది రేఖలతో, మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తూ శంకరుడి వలే సభకు విచ్చేసే వారు. అంత పెద్దవయసులో, అటువంటి శృంగారాన్ని ఆయన ఎలా రచిస్తున్నారా? అని మిగతా వారంతా అసూయ పడేవారు. అనుభవం లేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం సాధ్యం కాదని కూడా వారంతా అనుకునే వారు. రామకృష్ణుడు కూడా అలాగే ఆలోచించాడు. మెల్లగా ధూర్జటి గారి గురించి ఆరా తీయడం ప్రారంభించారు.
రామకృష్ణుడి ఆరాలో, ధూర్జటి గారు వేశ్యాలోలుడని, కట్టుకున్న భార్య ముఖమయినా చూడడని తెలిసింది. ధర్మపత్నిని అలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు ధూర్జటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని రామకృష్ణుడు నిర్ణయించుకున్నాడు. ఆయన సంసారాన్ని చక్కదిద్దడంతో పాటు రాయల వారి వద్ద ఆయన పాండితీ ప్రకర్షను తక్కువ చేయడం.. ఒక దెబ్బకు రెండు పిట్టల్లా ఈ పని చేయాలనుకున్నాడు.
ఒకనాటి రాత్రి ధూర్జటి భోజనం చేసి, తన ముఖం కనిపించకుండా శాలువాను ముసుగు వేసుకుని వడివడిగా వేశ్యా గృహంలోకి వెళ్లడం రామకృష్ణుడి కంటపడింది. వెంటనే అతను ఒక ప్రణాళిక ఆలోచించి, మరునాడు చీకటి పడుతున్న సమయానికి దూర దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణుడి వేషం వేసుకుని, ఆ వేశ్యా గృహం అరుగు మీద పడుకున్నాడు రామకృష్ణుడు. ఆ వేశ్య అది గమనించి, ఆ బ్రాహ్మణుడిని పలకరించింది. కప్పుకోవడానికి దుప్పడానికి దుప్పటి, పడుకోవడానికి చాప ఇచ్చింది లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి ధూర్జటి రహస్యంగా వచ్చి ఆ వేశ్యా గృహంలోకి దూరాడు. పని ముగించుకుని తెల్లవారుజామున తన ఇంటికి వెళ్తున్న ధూర్జటిని, ఆ ఇంటి అరుగుపై పడుకున్న బ్రాహ్మణుడి వేషంలోని రామకృష్ణుడు ‘తాతయ్య గారూ! వేశ్యా గృహం నుంచి వచ్చుచున్నారే’ అని పలకరించాడు.
ధూర్జటి తెల్లబోయి, ‘ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ రహస్యం ఎక్కడా పొక్కనీయకు నాయనా! నీకు పుణ్యం ఉంటుంది’ అని ఆ బ్రాహ్మణుడి చేతులు పట్టుకుని బతిమలాడాడు.
ఆ బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరునాడు బితుకు బితుకుమంటూ భువన విజయానికి వచ్చాడు ధూర్జటి. ఆయన రావడంతోనే శ్రీకృష్ణదేవరాయలు ఆయనను పొగడటం ప్రారంభించారు.
‘జవచ్యుతుడైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో
యతులిత మాధురీ మహిమ..’
(జవసత్వాలు ఉడిగిన ధూర్జటి పదాలకు అంతటి మాధుర్యం ఎలా కలిగిందో.. అనేది పై పద్యానికి భావం).
రాయల వారు పై పద్యం రెండు చరణాలు చదివి ఎందుకో కొద్దిగా విరామం ఇచ్చారు. అలా విరామం ఇచ్చి ఆయన సభ వైపు చూశారు.
సరిగ్గా, ఆ క్షణంలోనే తెనాలి రామకృష్ణుడు లేచి,
... హా తెలిసెన్ భువనైక మోహనోత
ధృవ సుకుమార వారవనితా జనితా ఘనతా పహార
సుధారస ధార గ్రోలుటన్ జుమీ’ అని అందుకున్నాడు.
‘జగదేక సుందరులు, సుకుమారులు, యవ్వనవతులు అయిన వేశ్యల అధరసుధలను నిత్యం గ్రోలడం వల్లనే ధూర్జటి పదాలకు అంత మాధుర్యం వస్తోంద’ని పై పద్యానికి భావం.
ఈ విధంగా రాయల వారు మధ్యలో ఆపేసిన పద్యాన్ని మిగతా పదాలతో రామకృష్ణుడు పూరించాడు.
రాయల వారికి ఏమీ అర్థం కాలేదు. సభలోని వారికి కూడా అయోమయంగా అనిపించింది.
‘అసలు విషయం ఏమిటి వికటకవీ?’ అని రాయల వారు అడిగారు.
అప్పుడు రామకృష్ణుడు ధూర్జటి గారి వేశ్యాలోలతను, భార్యను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్నీ, క్రితం రాత్రి తాను ధూర్జటి వేశ్యా గృహం నుంచి వస్తుండగా పట్టుకున్న సంగతినీ పూస గుచ్చినట్టు సభలో వివరించాడు.
ధూర్జటి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు.
వెంటనే రాయల వారు తన ఏకాంత మందిరంలోకి ధూర్జటిని పిలిపించుకున్నారు. భార్యను, సంసారాన్ని నిర్లక్ష్యం చేయడంపై గట్టిగా మందలించారు. ఇంత ముదిమి వయసులో అంత వేశ్యాలోలత పనికిరాదని హితవు చెప్పారు.
అప్పటి నుంచి ధూర్జటి శృంగార పద్యాలకు స్పందించడం మానేశారు రాయల వారు. అతనినిం
ప్రశంసించడం మానేశారు.
ధూర్జటికి తిక్క కుదిర్చిన, శృంగార కవిత్వంలో తనంత వారు లేరనే గర్వాన్ని అణచిన రామకృష్ణ కవికి మిగతా కవులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

నవ్విస్తూ.. ఆలోచింపచేస్తూ..
మన తెలుగు వారంతా
గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు- శ్రీకృష్ణదేవరాయలు.
ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడమే కాదు.. మన మాతృభాష తెలుగును దశదిశలా వ్యాపింప చేశారు. భాషా ఉన్నతికి పాటుపడ్డారు.
రాయల వారు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
ఆయనకు సాహితీ అభిలాష మెండు. ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ అనేది ఆయనకు గల అనేక బిరుదుల్లో ఒకటి. అందుకు తగినట్టే ఆయన ‘భువన విజయం’ అనే సభను నిత్యం నిర్వహిస్తుండే వారు. ఇందులో అష్టదిగ్గజాలు అని పిలిచే ఎనిమిది మంది కవి శ్రేష్ఠులు ఉండేవారు. ఈ అష్ట దిగ్గజాలలో ప్రముఖుడు తెనాలి రామకృష్ణుడు. ఈయననే రామలింగడు అనే పేరుతోనూ వ్యవహరించే వారు.
అలాగే, తన సమయస్ఫూర్తి, చాకచక్యం, ఎగతాళి, వికటత్వం అనే లక్షణాలనూ కనబరిచే కారణంగా ఈయనను వికటకవి అని కూడా అంటుండే వారు. రామకృష్ణుడంటే రాయల వారికి ఎనలేని అభిమానం. అటు సాహితీపరంగానే కాదు.. ఇటు పరిపాలనాపరమైన అంశాల్లోనూ ఎన్నో చిక్కుముడులను తనదైన శైలిలో, తన చతురతతో ఈయన పరిష్కారాలను సూచించే వారు. రామకృష్ణుడు కనబరిచే యుక్తాయుక్త విచక్షణ, చాతుర్యం, తెలివితేటలు నాటి విజయనగర సామ్రాజ్యవాసులను విపరీతంగా అలరించేవి. ఆయన కథలు నేటి భావి తరానికి కూడా అవసరం. తెనాలి రామకృష్ణుడి కథలను చదవడం, తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
- రామలింగడి కథల వల్ల విద్యార్థులకు అపారమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి అలవడుతాయి.
- జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకోవచ్చు.
- ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ముఖం మీద చిరునవ్వును చెరిగిపోనివ్వకూడదు.
తెనాలి రామకృష్ణుడు తన కథల ద్వారా పై మూడు విషయాలను తెలియచెప్పారు.
అవి నేటి తరానికీ అవసరం.
ఈ క్రమంలోనే తెలుగు పత్రిక జనవరి 2023 సంచికను ‘తెనాలి రామకృష్ణ కథల’ ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దాం.
ఇందులో అందచేసిన కథలన్నీ వివిధ మాధ్యమాల ద్వారా సేకరించినవి.
ఇవి పిల్లల్లో చదవాలనే ఆసక్తిని పెంచుతాయి. పెద్దలనూ ఆలోచింపచేస్తాయి.
నవ్విస్తూనే, సమస్య పరిష్కార మార్గాలను సూచిస్తాయి.
సమస్యలు ఎదురైన సందర్భాల్లో ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలో కళ్లకు కడతాయి.
ఇంకెందుకు ఆలస్యం? కథల్లోకి పదండి..
- కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
ఆలోచింపచేశాయి..
నేడు ప్రపంచంలో పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలుగు పత్రిక డిసెంబరు- 2022 సంచికలో కళ్లకు కట్టారు. అనగనగా.. అంటూ కథలు వింటూ నిద్రలోకి జారుకునే కాలం నుంచి స్మార్ట్ఫోన్ను పక్కలో పెట్టుకుని పడుకునే కాలంలోకి ప్రవేశించిన మనం మళ్లీ మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని ముఖచిత్ర కథనం ద్వారా బాగా వివరించారు. - కె.ఉమాకాంత్,
ఆర్.వెంకటేశ్వరరావు, సి.అప్పలరాజు, కేఆర్ సురేశ్, మరికొందరు ఆన్లైన్ పాఠకులు (హైదరాబాద్)
అన్వేషణ
భగవంతునిపై నమ్మకం కలగాలంటే స్వీయానుభూతి ఉండాలి తప్ప ఎవరో చెప్పిన అభిప్రాయాల ప్రకారం కాదనే విషయాన్ని డిసెంబరు సంచికలోని ఆధ్యాత్మిక వికాసం శీర్షికలో తెలియచెప్పారు. ఇందులో మనల్ని మనం అన్వేషించుకోవడానికి ఇచ్చిన ప్రశ్నలు బాగున్నాయి.
జి.రమేశ్బాబు- విశాఖపట్నం, కనకప్రసాద్- తిరుపతి, బాలాజీ- హైదరాబాద్
బాగున్నాయ్..
ఆరోగ్యభాగ్యం, ఆధ్యాత్మిక కథలు, పలుకుబడి, సామెత కథలు, అనగనగా.. వంటి శీర్షికలు బాగుంటున్నాయి.
- పి.గోపాలకృష్ణ, ఆర్.కృష్ణవేణి, తిరుపతిరావు మరికొందరు (ఈ-మెయిల్)

ఊరంతా పండుగే..
2023- జనవరి 1, ఆదివారం,
పుష్య శుద్ధ దశమి నుంచి
2023- జనవరి 31, మంగళవారం,
మాఘ శుద్ధ దశమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-పుష్యమి -మాఘం-హేమంత రుతువు- ఉత్తరాయణం
జనవరి.. ఆంగ్లమానం ప్రకారం ఇది ఏడాదిలో మొదటి నెల. ఈ నెలతో 2023 కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఇక, మన తెలుగు పంచాంగాల ప్రకారం జనవరి.. పుష్య-మాఘ మాసాల కలయిక. చైత్రాది మాస పరిగణనలో పుష్య మాసం పదవది. ఈ మాసంలోని జనవరి 21వ తేదీ శనివారం వరకు పుష్య మాస తిథులు, ఆ తదుపరి జనవరి 31వ తేదీ మంగళవారం వరకు మాఘ మాస తిథులు కొనసాగుతాయి. సంక్రాంతి పుష్య మాసపు అతిపెద్ద పండుగ. పుత్రద ఏకాదశి, కూర్మ ద్వాదశి వంటివి ఇతర ప్రధాన పర్వాలు.
చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య ం. ఈ మాసంలో వేకువ వేళ ఆకుపచ్చని వర్ణం(పంటలు/ప్రకృతి) శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ‘పుష్య’ అనే పదానికి ‘పోషణ శక్తి కలిగినది’ అని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసమిది. పుష్య మాసం పూర్తి శీతాకాలం. చలి గజగజ వణికిస్తుంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన
పారాయణాదులకు మేలైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల
కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని చెబుతారు. ఇక, పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం కూడా పుష్యమే. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు (బృహస్పతి). వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య
పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యం. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి.
సంక్రాంతి వేళ ఏ ఇల్లు చూసినా అందమైన రంగవల్లులు హరివిల్లుల్లా పరుచుకుని ఉంటాయి. పాడిపంటలు ఇళ్లకు చేరుతుంటాయి. పిల్లల భోగిమంటల సన్నాహాలు, పెద్దల పండుగ పిండివంటల హడావుడి.. ఇవన్నీ కొత్త క్రాంతిని చేకూరుస్తూ సంక్రాంతిని ముంగిటకు తెస్తాయి. పుష్య మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే చోర భయమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చేయాలనే సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఆచరణలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పుష్య మాసంలో గేదె ఈనితే శాంతి చేసే ఆచారం కూడా ఉంది. ఇక, జనవరి 22 నుంచి ప్రవేశించే మాఘ మాసం శిశిర రుతువు కాలం. శీతాకాలం (చలి) చేత ఈ కాలంలో దేహం ఇక్క లాక్కుపోతుంది. యజ్ఞ యాగాదులకు శ్రేష్ఠమైన మాసమిది. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మగవుడు’ అని కూడా అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసం ‘మాఘం’ అయ్యింది. అలాగే, చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం కనుక ఇది ‘మాఘం’ అయ్యింది. మాఘ మాసపు శిశిర రుతువులో చెట్లు ఆకులు రాలుస్తాయి. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. మాఘ మాసం కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకు, భగవచ్ఛింతనకు నెలవైనది. వైశాఖ - కార్తీక మాసాలకు మాదిరిగా మాఘ స్నానాలు పవిత్రమైనవి. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ చెబుతారు. మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని అంటారు. మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం తెలియచెబుతోంది. మాఘ మాసంలో సూర్యోదయానికి ముందు గృహ స్నానంతో ఆరు సంవత్సరాల యజ్ఞ స్నాన ఫలం లభిస్తుందని ప్రతీతి. బావినీటి స్నానం పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం శత గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలం ఇస్తాయని పురాణ వచనం.
మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే ఈ మాసం ఎన్నో పవిత్ర పర్వాలకు నెలవు. మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనద్యాగమం అని మత్స్య పురాణంలో ఉంది. పుష్య-మాఘ మాసంలో వచ్చే పండుగలు, పర్వముల వివరాలివీ..
పుష్య శుద్ధ దశమి
జనవరి 1, ఆదివారం
పుష్య శుద్ధ దశమి తిథిని వివిధ వ్రత గ్రంథాలు దీనిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ అని అర్థం. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు.
ఇక, జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సర దినం. ఆంగ్లమానం ప్రకారం 2023 సంవత్సరారంభానికి ఇది తొలిరోజు, తొలి మాసం.
పుష్య శుద్ధ ఏకాదశి
జనవరి 2, సోమవారం
పుష్య శుద్ధ ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. అలాగే ఈ తిథి పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమనే పేరు రావడానికి కారణమైన రైవతుడి కథ మిక్కిలి ఆసక్తికరమైనది.
రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది. ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు.
రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు. అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది.
అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. నీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది. దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమాన సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు. రైవతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.
పుష్య శుద్ధ ద్వాదశి
జనవరి 3, మంగళవారం
పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి పర్వాన్ని జరుపుకుంటారు. ఇంకా ఈ తిథి నాడు సుజన్మ ద్వాదశీ వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.
పుష్య శుద్ధ చతుర్దశి
జనవరి 5, గురువారం
పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేయాలి. గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు. అలాగే ఈ తిథి విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి.
పుష్య శుద్ధ పౌర్ణమి
జనవరి 6, శుకవ్రారం
పుష్య నక్షత్రంతో కూడిన పున్నమిని ‘పౌషీ’ అంటారు. ఇక, పుష్య శుద్ధ పూర్ణిమనే మహా పౌషీ అని కూడా అంటారు. దీనికే హిమశోధన పూర్ణిమ అనే మరో పేరు కూడా ఉంది. పుష్య పూర్ణిమను తమిళులు ‘పూసమ్’గా వ్యవహరిస్తారు. తై పూసమ్ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్వేణిలో తామ్రపర్ణి నదిలో స్నానం పాపక్షయకరమై ఉంటుంది. తమిళనాడులోని అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది.
• శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి. పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి. మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి.
• పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది.
• పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
• మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది.
పుష్య బహుళ పాడ్యమి
జనవరి 7, శనివారం
పుష్య కృష్ణ (బహుళ) పాడ్యమి నాడు విద్యావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు.

నల్ల కుక్క.. తెల్ల ఆవు
శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాకుండా, తన పనిలో చాలా నైపుణ్యం కలవాడు కూడా. పైగా అతడు సదాచార పరాయణుడు. క్షురకుడైనా కూడా నిరంతర నిష్టా గరిష్టుడూ, దెవభక్తి పరాయణుడూ కూడానూ. అతని విశ్వాసానికి, శీలానికి చాలా సంతోషించిన రాయలు వారు అతడిని ‘మంత్రీ!’ అని పిలిచేవారు. మంగలిని గౌరవంగా మంత్రి అని కూడా అంటారు.
ఒకనాడు రాయలు అతడిని పిలిచి, ‘నీకేం కావాలో కోరుకో!’ అన్నారు.
అప్పుడతను చేతులు జోడించి, ‘ప్రభూ! తమరికి తెలియనిది ఏమున్నది? నేను చిన్నప్పటి నుంచి నిష్టా నియమాలు పాటిస్తూ వచ్చిన వాడిని. ఎలాగైనా నన్ను బ్రాహ్మణుడిని చేయించండి. చాలు. నాకు బంగారం మీదా, డబ్బు మీదా ఆశ, కోరిక లేవు.. బ్రాహ్మణ్యంపై తప్ప’ అని విన్నవించుకున్నాడు.
తన తీవ్రమైన కోరిక ప్రభావంలో అతను యుక్తాయుక్తాలు మరచి అటువంటి గడ్డు కోరిక కోరగా..
కవీ, పండితుడు కూడా అయిన రాయల వారు కూడా క్షవర కల్యాణం చేయించుకున్న ఆనంద సుఖాలలో మైమరచి కాబోలు, అతడి కోరికలోని సాధ్యాసాధ్యాలను మరచి, ‘సరే.. అలాగే’ అనేశారు.
రాజ పురోహితులకు కబురు వెళ్లింది. వారు వచ్చారు.
‘ఈ క్షురకుడిని బ్రాహ్మణుడిగా చేయండి’ అని ఆజ్ఞాపించారు రాయల వారు.
అది అసాధ్యమని వారికి తెలుసు. కానీ, రాజాజ్ఞను కాదంటే దండన తప్పదు కదా అనే ప్రాణ భయంతో, అయిష్టంగానే, విధిలేక తలూపారు.
క్షురకుడిని రాజ పురోహితులు నదీ తీరానికి తీసుకెళ్లి ప్రతిరోజూ హోమాలు, జపాలు, మంత్రోచ్ఛారణలు చేయసాగారు. ఈ సంగతి ఎవరి చెవిన పడకూడదో వారి చెవినే పడింది. పైగా అతడు రామలింగడు. మామూలోడు కాదు కదా!. అంతే, రోజూ ఓ నల్లకుక్కను నది ఒడ్డుకు తీసుకెళ్లి దానిని మాటిమాటికీ నీళ్లలో ముంచుతూ, ‘ఓం.. హ్రీం.. హ్రీం’ అంటూ రాజ పురోహితులకు పోటీగా అన్నట్టు బిగ్గరగా బీజాక్షరాలు చదవడం ప్రారంభించాడు.
ఒకవైపు క్షురకుడిని సంస్కరించే ప్రయత్నంలో రాజ పురోహితులు.. మరోవైపు వారికి కొద్ది దూరంలోనే కుక్కను సంస్కరించే ప్రయత్నంలో తెనాలి రామలింగడు..
ఇలా కొద్దిరోజులు గడిచిపోయాయి.
ఒకరోజు క్షురకుడు ఎంతవరకూ విప్రుడయ్యాడో చూద్దామని రాయల వారు నదీ తీరానికి వచ్చారు.
ఆ సమయంలో అటు రాజ పురోహితులు, ఇటు రామలింగడూ బిగ్గరగా మహా హడావుడి చేస్తూ మంత్రోచ్ఛారణలు చేస్తున్నారు.
వీళ్లు క్షురకుడినీ, రామలింగడు నల్లకుక్కనీ మాటిమాటికీ నదిలో ముంచి తీస్తున్నారు.
ఇదంతా చూసి రాయల వారికి ఆశ్చర్యం వేసింది.
రామలింగడి వద్దకు వచ్చి, ‘ఏం చేస్తున్నావ్ రామకృష్ణా?’ అని అడిగారు నవ్వాపుకుంటూ.‘ఈ నల్లకుక్కను తెల్ల ఆవుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను ప్రభూ’ అన్నాడు రామలింగడు అతి వినయంగా.
‘కుక్క కుక్కే కానీ గోవు ఎలా అవుతుంది? నీకు పిచ్చిగానీ ఎక్కలేదు కదా?’ అంటూ నవ్వారు రాయల వారు.
నిర్భీతికి, నిర్మొహమాటానికి మారుపేరైన రామకృష్ణుడు- ‘ప్రభువులైన మీకే పిచ్చెక్కినప్పుడు నాకూ పిచ్చెక్కినట్టే మరి’ అన్నాడు నిస్సంకోచంగా.
‘రామలింగా!’ అని గద్దించారు రాయల వారు.
‘ఔను ప్రభూ! మంగలిని బ్రాహ్మణుడిగా చేయడం సాధ్యమైనపుడు, కుక్కను ఆవుగా చేయడం ఎందుకు సాధ్యం కాదు?. యథా రాజా.. తథా ప్రజా (రాజుని బట్టే ప్రజలు) అని లోకోక్తి కదా!’ అన్నాడు రామకృష్ణుడు.
ఆ ఎత్తిపొడుపుతో రాయల వారికి జ్ఞానోదయమైంది.
తన తొందరపాటూ, తెలివితక్కువతనమూ తెలిసి వచ్చాయి.
రామలింగడు తనకు సున్నితంగానూ, పరోక్ష మార్గంలోనూ బుద్ధి చెప్పడానికే ఇలా చేశాడని గ్రహించారు.
వెంటనే క్షురకుడిని బ్రాహ్మణుడిగా మార్చే కార్యక్రమాన్ని ఆపుచేయించారు.
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
January 31, 2023
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia