క్లైమాక్స్ అదిరేలా..

క్యాలెండర్‍లో చివరి నెల దగ్గర పడుతోంది. తెలుగు సినీ పరిశ్రమకూ సంవత్సరాంతం కీలకమే. ముగింపు ఘనంగా ఉండాలని కోరుకునే నిర్మాతలు డిసెంబర్‍లో తమ సినిమాల విడుదలకు ప్లాన్‍ చేస్తున్నారు. స్ట్రెయిట్‍, డబ్బింగ్‍ కలిపి దాదాపు 15 వరకు సినిమాలు డిసెంబర్‍లో విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఆయా సినిమాల వివరాలు.. ఈ డిసెంబర్‍లో విడుదలయ్యే సినిమాల్లో అందరి దృష్టి బాలకృష్ణ ‘అఖండ2: తాండవం’పైనే ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై

విరులు సమర్పించి.. కోరి వరించి..

ధనుర్మాసం ప్రారంభం కాగానే వినిపించే పేర్లు- గోదాదేవి, తిరుప్పావై పాశురాలు..శ్రీరంగనాథుడు. ఆ విశేషాల నేపథ్యమేమిటంటే.. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతంలోని తులసి వనంలో గోదాదేవి అయోనిజగా దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే భక్తుడు ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుడిని పవిత్రంగా కొలుస్తుండేది. క్రమేణా ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించుకుంటూ ఆ పరమాత్ముడిని పొందడం కోసం నిత్యం ఇంటిని శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులూ, పూలతో వాకిలిని అందంగా

వహ్వా.. హాండ్వో

శీతాకాలం సాయంత్రం వేడి వేడి పకోడీలో.. మిర్చి బజ్జీలో తినాలనిపించడం సహజం. అయితే, ఈసారి వాటికి బదులు కాస్త వెరైటీగా కూరగాయలతో స్నాక్స్ చేసేయండి. నాలుకకు రుచీ.. ఆరోగ్యానికి పోషకాలు.. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేయండిలా.. కావాల్సినవి: ఇడ్లీపిండి: 2 కప్పులు, సొరకాయ తురుము: పావు కప్పు, పాలకూర తురుము: పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు: 2 టేబుల్‍స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‍స్పూన్లు, క్యారెట్‍ తురుము: 2 టేబుల్‍స్పూన్లు, పచ్చిమిర్చి

విశేషాల బైబిల్‍

బైబిల్‍.. క్రీస్తు నడిచిన దారిని కళ్లకు కడుతుంది. జీవిత పాఠాలను బోధిస్తుంది. అందుకే క్రైస్తవులకు క్రీస్తు అంటే బైబిల్‍.. బైబిల్‍ అంటే క్రీస్తు. ‘డిసెంబరు 25: క్రిస్ట్మస్‍’ సందర్భంగా జీసస్‍ బోధనలను ప్రపంచం నలుమూలలకూ వ్యాపింపచేసిన ఆ పరిశుద్ధ గ్రంథం వెనుక ఆసక్తికరమైన అంశాలేమిటో తెలుసుకుందాం.. చరిత్రలో అత్యధికంలో 500 కోట్ల ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకం బైబిల్‍ ఒక్కటే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పది కోట్ల బైబిల్‍ ప్రతులను క్రైస్తవులు కొంటున్నారట. ప్రపంచంలో

నందలూరు సౌమ్యనాథుడు

ఆంధప్రదేశ్‍లోని అన్నమయ్య జిల్లా నందలూరులో బహుదా నదీ తీరాన కొలువుదీరాడు సౌమ్యనాథస్వామి. ఇది అతి పురాతన ఆలయం. గర్భాలయంలో స్వామి వారి విగ్రహం ఏడడుగుల ఎత్తున ఉంటుంది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య ఇక్కడే కొంతకాలం ఉండి పలు సంకీర్తనలు రచించినట్టు చరిత్ర చెబుతోంది. చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గాలి గోపురం నిర్మించాడు. అనంతరం పాండ్య రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారని వివిధ శాసనాల ద్వారా

Top