దుర్వ్యసనాల ఫలితం
ఇది శ్రీమద్భాగవతంలోని కథ. అల్లరి నల్లనయ్య చిన్ని కృష్ణుడు అమ్మ మీద కినుకబూని దధిభాండము (పెరుగు కుండ)ను పగులగొట్టాడు. పొరుగింట్లో దూరి రోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టి మీదునున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న బాలకృష్ణుడిని చూసి యశోద, ‘కన్నయ్యా! నువ్వింత వరకూ ఎవరికీ చిక్కలేదని, ఎవరూ నీ ముద్దుమోము చూసి నిన్ను శిక్షించలేదని బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు.