త్వం త్రాతా తరణ: (నీవే రక్షకుడవు. దాటించు వాడవు)
త్వం త్రాతా తరణో చేత్యో భూ: పితా మాతా సదమిన్మానుషాణామ్।। రుగ్వేదంలోని ఈ శ్లోకానికి- ‘ఓ పరమేశ్వరా! నీవు రక్షకుడవు. దాటించువాడవు. జ్ఞేయమవు, ఉనికివి. ఎల్లవేళలా ఈ మనుష్యులకు తండ్రివి. తల్లివి’ అని అర్థం. పరమేశ్వరుడికి మనకీ మధ్య ఉన్న బంధాన్ని ఈ మంత్రం ద్వారా వేదమాత తెలియచేస్తోంది. ఈ పరమేశ్వర తత్త్వాన్ని ఎవరు ఏ సంప్రదాయంలో కొలిచినా ఈ భావనను మనసులో ప్రతిష్ఠించుకుంటే చాలు. ఈ మంత్రంలోని పదాలకు భావాలను తెలుసుకుందాం. త్రాతా: రక్షకుడు. ఆర్తత్రాణ




