ప్రళయ కాలం

అది వైకుంఠం. శ్రీమన్నారాయణుడు, శ్రీలక్ష్మీదేవి ఏవో ముచ్చట్లలో మునిగిపోయి ఉన్నారు. అంతలో విష్ణువు, ‘లక్ష్మీ! మా బావ శివుడిని, నా చెల్లి పార్వతిని పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు, ఒక ముఖ్య విషయం వారితో చర్చించాలని అనుకుంటున్నాను. గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించాడు. ‘నాథా! గరుత్మంతుడు అనంతనాగునితో ముచ్చట్లాడుతున్నాడు. ఇప్పుడే పిలుస్తానుండండి’ అని బదులిచ్చింది లక్ష్మి. ‘సమయం మీరిపోతోంది. గరుత్మంతుడిని తొందరగా రమ్మను’ అన్నాడు విష్ణువు. స్మరణ మాత్రం చేతనే గరుత్మంతుడు తన దేవర చెంత

Top