ఆహారం.. ఆయుర్వేద నియమాలు

తింటున్నాం.. ఉంటున్నాం.. పెరుగుతున్నాం.. కానీ, ఎలా తింటున్నాం? ఏం తింటున్నామనే స్పృహే మనిషికి లేకుండాపోయింది. మన ప్రాచీన ఆయుర్వేదంలో వివిధ ఆహార నియమాలను ఏర్పరిచారు. అవేంటో చదవండి.. అజీర్ణం అనేది పెద్ద సమస్య. నేటి శరీర స్వభావాలకు సరిపడని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అజీర్తి కలుగుతుంది. ఇది నాలుగు రకాలు.. ఆమము, విదగ్ధము, విష్టంభము, రసశేషము. ఈ నాలుగు కారణాల వల్ల అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడైనా తిన్నది అరగలేదనిపిస్తే

అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు

అవధానం` ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, మధ్యలో పృచ్ఛకులు అడిగితే అప్రస్తుత ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ, ఆశువుగా పద్యాలు చెబుతూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ అవధాని ఆధ్యంతం నవ్వులు పూయిస్తారు. ఇన్ని ప్రశ్నలను, చమత్కార పూరణలను, అప్రస్తుత ప్రశ్నలను ఏకకాలంలో ఎదుర్కొంటూ అవధాని చేసే సాహితీ విన్యాసం ఎంతైనా గొప్పది. ఒక అవధానంలో కొందరు పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగే

అమ్మవారిల్లు..మణిద్వీపం

శ్రీచక్ర బిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలిత అయిన జగన్మాత నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో అమ్మ కొలువై ఉంది. యావత్తు జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ మణిద్వీపం ఉద్భవించింది. నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న మణిద్వీపం గురించి వర్ణించాలంటే మన శక్తి

ఉపమన్యు మహర్షి

ఉపమన్యు మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడనే మహర్షి పెద్ద కొడుకు. ఉపమన్యుడి తమ్ముడు ధౌమ్యుడు. ఇద్దరూ ఒకనాడు బంధువుల ఇంటికి వెళ్లి పరమాన్నం తిన్నారు. ఇంటికొచ్చి అలాంటి పరమాన్నం చేసిపెట్టు అని తల్లిని కోరారు. అవసరమైన దినుసులు లేవని, కాబట్టి ఆ కోరిక తీరడానికి ఈశ్వరుడి గురించి తపస్సు చేయాలని, ఆయన ఏం అడిగినా ఇస్తాడని తల్లి చెబుతుంది. శివుడు ఎలా ఉంటాడని ఉపమన్యుడు తల్లిని అడిగాడు. తనకు తెలిసినంత ఆమె చెప్పింది.

మహా పతివ్రత మండోదరి

మండోదరి మహా పతివ్రత. మండోదరి అంటే ‘మండనం యస్యస ఉదరం’.. అంటే` సన్నని నడుము గలది అని అర్థం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలదని అర్థం. భూమి వంటి ఉదరం అంటే, సంతాన సాఫల్యత గల ఉదరము అని భావం. ఈమె రావణుడి భార్య. విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ కుమార్తె ఈమె. మహా శిల్పి అయిన మయబ్రహ్మ.. హేమ అనే ఒక దేవకన్యతో కలవగా మండోదరి

Top