పుణ్యకార్యం
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా! నువ్వు ఉదారవంతుడివే కాక పుణ్యకార్యాల పట్ల ఆసక్తి గలవాడిలా కూడా కనిపిస్తున్నావు. పుణ్యకార్యాలనేవి చేసిన వాళ్లకే కాక, సమాజానికి కూడా మేలు చేస్తాయి. కానీ ఏ పుణ్యకార్యాలూ చేయని వాళ్లు కూడా ఒక్కోసారి దేవుడి దయకు పాత్రులు కావడం




