అక్కడ మట్టి కూడా మహిమ చూపుతుంది.
మంత్రాలయం.. అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన ఉంది. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే.. పాదోదకం.. పావనం రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా