బహ్మ కడిగిన పాదము

దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం వర్ణనాతీతం. ఏటా బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. తనను ఆశ్రయించిన భక్తకోటికి వరదహస్తుడై అభయమిస్తాడు. రథాన్ని అధిరోహించిన కేశవుడిని దర్శించుకుంటే మళ్లీ జన్మలెత్తాల్సిన అవసరమే లేదంటారు. ప్రతి మనిషీ జన్మజన్మల సాధనలతో అందుకోవాల్సిన పారమార్థికం.. రథంపై ఊరేగే స్వామి వారిని చూస్తేనే కలుగుతుందని నమ్ముతారు. ముక్తి ఫలాన్ని భక్తులకు అందించే ఉత్సవమే బ్రహ్మోత్సవం.

మధుమధురే మధుకైటభభంజనీ

రాక్షస సంహారం చేసిన జగన్మాత చివరి రోజున రణన్నినాదం చేసింది. సర్వ దుర్లక్షణాలకు ప్రతీకైన మహిషాసురుడిని మట్టుబెట్టింది. ఆ సమయంలోనే విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని ఆదిశంకరులు దర్శించి అమితానందాన్ని పొందారు. ‘అయిగిరినందిని, నందిత మేదిని’ అంటూ పులకించిపోయారు. ‘అయిజగదంబ కదంబ వనప్రియా’ అంటూ కీర్తించారు. ‘మధుమధురే మధుకైటభభంజనీ’ అంటూ ప్రార్థించారు. అదే 21 శ్లోకాల మహిషాసుర మర్దిని స్తోత్రంగా అవతరించింది. ఇందులోని ప్రతి అక్షరం మంత్రమే.. ప్రతి పదం, ప్రతి పాదం

శ్రీవారి దర్శనానికి దారిదే!

క్షణకాల దర్శనం.. జీవితకాల ఆధ్యాత్మిక అనుభవం.. తలచుకున్నంతనే ఏ దేవదేవుడినీ దర్శింపచేయలేం కదా!. ఇక, తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే ఎంతో ప్రణాళిక కావాలి. ముందస్తు ఏర్పాట్లూ అవసరం. అప్పుడే శ్రీనివాసుని దర్శనభాగ్యం సులభతరం అవుతుంది. కలియుగ దైవాన్ని కనులారా దర్శించి తరించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో దర్శన మార్గాలను అందుబాటులో ఉంచుతోంది. వాటిని అనుసరిస్తే కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శనం, తిరుమల క్షేత్ర యాత్ర

తిరుమల కంటే మిన్న.. నారాపుర వెంకన్న

విజయనగర రాజుల కాలానికంటే ముందు నుంచే వైభవ కాంతులీనుతోంది నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం. నారాయణపురం నుంచి తెచ్చిన వేంకటేశ్వరుడు కావడం.. నారాపురయ్య ప్రతిష్ఠించిన దేవుడు కావడం వల్ల స్వామి వారికి నారాపుర వేంకటేశ్వరస్వామి అనే పేరు స్థిరపడింది. ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగులో కొలువుదీరిన నారాపుర వేంకటేశ్వరుడి గురించి తెలుసుకుందాం.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి పేరుతో జమ్మలమడుగులో కొలువుదీరి భక్తజనుల విశేష ఆరాధనలు అందుకుంటున్నాడు. ఉమ్మడి

ఇంట్లో ఉంటూనే… ఇలవేల్పుల సేవా భాగ్యం

వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్‍లో ఉంటారు. ఆయనకు ఆంధప్రదేశ్‍లోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతంలో కుటుంబంతో కలిసి పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ తీరిక లేని ఉద్యోగ జీవితంలో తలమునకలై ఉండే ఆయన ఎప్పటికప్పుడు వెళ్లాలనుకున్నా వివిధ కారణాలతో వెళ్లలేకపోయారు. చివరకు మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆయన.. హైదరాబాద్‍లో ఉండే కుటుంబంతో సహా సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్నారు. • • • • • అమెరికాలోని టెక్సాస్‍లో ఉండే

Top