అమెరికాలో ఇండియన్‍ డాక్టర్స్ అసోసియేషన్‍ ‘ఆపీ’

విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‍ , లైసెన్సు విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి వారికోసం ఒక వేదికను ఏర్పరచాలనే ప్రధాన లక్ష్యంతో భారతీయ అమెరికన్‍ డాక్టర్లు అందరూ కలిసి 1982లో ‘ఆపి’( ఏఏపీఐ)ను స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాభాపేక్ష లేని వైద్య సంబంధ సంస్థల్లో ఇది చాలా పెద్దది. జూలై 4 నుంచి 7 వరకు అట్లాంటాలో జరగనున్న ‘ఆపి’

చాతుర్మాస్య వ్రతం….అందరికీ విధాయకృత్యం

‘చాతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకారు తోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ

జన సమ్మోహన నేతకు ‘తెలుగు పత్రిక’ అక్షరాభిషేకం

మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు.. దాదాపు పది సంవత్సరాల పాటు ప్రజల మధ్యనే జీవితం.. ప్రజలతోడిదే లోకం.. ప్రజలతోనే మమేకం.. అందరి గుండె చప్పుడూ విన్నాడు.. ‘నేనున్నా’నంటూ భరోసానిచ్చాడు. జనమంతా ‘రావాలి జగన్‍.. కావాలి జగన్‍’ అంటూ ముక్తకంఠంతో నినదించారు. అది ఆంధ్ర దేశమంతటా ‘జగన్ని’నాదమై మారుమోగింది. నవ్యాంధ్ర నవ యువ నాయకుడికి బ్రహ్మరథం పట్టింది. కష్టాలనూ చిరునవ్వుతో స్వాగతించే నైజం.. తానెంచుకున్న బాటలో ఇబ్బందులెదురైనా మొక్కవోని ధైర్యం, దీక్షతో ముందుకు సాగే తత్వం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే సంకల్పం.. జన బలమే

భారత జాతి శంఖారావం. మోగింది ‘నమో’ మంత్రం.

గుక్క తిప్పుకోని వాగ్ధాటి.. మొక్కవోని దేశభక్తి.. ఇల్లు లేదు.. సంసారం లేదు.. కానీ, గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమను భరతజాతికి పంచాలనే, జాతి సేవలో తరించాలనే సంకల్పం ఉంది. అఖండ భారతావనికి ఆయన చౌకీదార్‍ (కాపలాదారు). కానీ, ఆయన తనను తాను ఫకీరుగా అభివర్ణించుకుంటారు.. అశేష ప్రజానీకం గుండెల్లో ఆయన కొలువుదీరారు. అందుకే దేశం యావత్తూ ‘నమో’ అంటూ స్తుతించింది. భారత దేశానికి దశ, దిశ చూపే భావినేతను నీవేనని మరోసారి పట్టం కట్టింది. నరేంద్ర మోదీ..

గంట కొట్టేదెవరు?

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

Top