భారతీయత

సమాజ శ్రేయస్సు భారత ధర్మం (వేద ధర్మం)తోనే ముడిపడి ఉంది. వేద పురాణ, ఇతిహాసాల కాలాల నుంచి లక్షల సంవత్సరాలుగా మన రుషులు మనకు ఇచ్చిన ఆర్ష ధర్మం భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. భారతీయ ధర్మాన్ని సూర్యపుత్రుడైన మనువు రచించాడు. భారతీయ ధర్మాలలో పది ప్రధాన ధర్మాలు, మరో పది ఉప ధర్మాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రధాన ధర్మం- శౌచం. సకాలంలో విధి నిర్వహణ (తపస్సు) రెండవది. ఇంకా,

సమస్యలు – ధైర్యం – పరిష్కారం

ఒక రాజ్యంలో ప్లేగు వ్యాధి విజృంభించి అపార జన నష్టం సంభవిస్తుంది. దాంతో రాజ్యాధినేత తీవ్ర ఆందోళనకు గురవుతాడు. రాజ గురువు సలహా మేరకు శివ యజ్ఞాన్ని ఆచరిస్తాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ రాజు చేస్తున్న క్రతువుకు శివుడు సంతుష్టుడై ప్రత్యక్షం అవుతాడు. ఆ రాజును నీ అభీష్టం ఏమిటని అడుగుతాడు. మహారాజు ఎంతో ఆర్తితో ‘భగవాన్‍! మా రాజ్యంలో ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి

చెడు చేస్తే కీడు తప్పదు

అనగనగా ఒక రాజు. పరమ క్రూరుడు. అసలు అతనికి దయ అనేదే లేదు. జనులను ఎంతో బాధపెట్టేవాడు. అటువంటి రాజు ఒకనాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులే కాకుండా రాజ్యంలోని ప్రజలందరినీ సమావేశపరిచాడు. ఈ సందర్భంగా ఒక ప్రమాణం చేశాడు. ‘నేను ఈ రోజు నుంచీ ఎవరినీ బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను. దయతో ప్రవర్తిస్తాను’. ఈ విధంగా

నిరాడంబర భక్తి

రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక అరణ్యం ఉండేది. ఒక సాధువు ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. రామాపురం ప్రజలు ఆయన బోధనలు వినడానికి వెళ్లేవారు. కష్టాలలో, బాధలలో ఉన్న వారికి ఆయన వాక్కులు ఎంతో స్వాంతన కలిగించేవి. చల్లని ఆయన చేతి స్పర్శ ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేసేది.

మాటలు-ఈటెలు

మాటలు-ఈటెలు మహా విష్ణువు ధరించే పాదుకలను చూసి శంఖం, చక్రం, కిరీటం ఒకసారి అపహాస్యం చేశాయట. ‘మేం చూడు.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామో! నీవో? పాదాల కింద పడి ఉన్నావు’ అని పాదుకలను అవి ఎగతాళి చేశాయి. ‘నేను స్వామి పాదాల కింద ఉన్నందుకు సంతోషిస్తున్నాను. మహర్షులు అందరూ మన స్వామి పాదాలకే కదా మొదట నమస్కరించేది. భక్తులు పూజించేదీ ఆ పాదాలనే కదా! మహా విష్ణువు పాదసేవా భాగ్యం లభించాలని

Top