పుణ్యం.. ధన్యం
ఇళ్లు దీపకాంతులతో వెలుగొందుతూ పండుగ వాతావరణం సంతరించుకునేదీ, హరివిల్లు సాక్షాత్కరించేలా లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో కళకళలాడేదీ ధనుర్మాసంలోనే. ఈ మాసంలో గోదాదేవి చేపట్టిన వ్రతానికి సాక్షాత్తూ రంగనాథుడే దిగి వచ్చాడని చెబుతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ ప్రస్తుతించే శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి బదులు తిరుప్పావై సంకీర్తనలు వినిపిస్తాయి. తులసికి బదులు బిల్వ పత్రాలతో శ్రీవేంకటేశ్వరుడిని అర్చిస్తారు. ధనుర్మాసంలో చేసే పూజలు కోరికలను నెరవేరుస్తాయని విశ్వసిస్తారు. ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు మధుసూదనుడిగా పూజలందుకుంటాడు. గోధుమపిండి, బియ్యప్పిండి, మట్టితో




