నవ్విస్తూ.. ఆలోచింపచేస్తూ..
మన తెలుగు వారంతా గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు- శ్రీకృష్ణదేవరాయలు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడమే కాదు.. మన మాతృభాష తెలుగును దశదిశలా వ్యాపింప చేశారు. భాషా ఉన్నతికి పాటుపడ్డారు. రాయల వారు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయనకు సాహితీ అభిలాష మెండు. ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ అనేది ఆయనకు గల అనేక బిరుదుల్లో ఒకటి. అందుకు తగినట్టే ఆయన ‘భువన విజయం’ అనే సభను నిత్యం నిర్వహిస్తుండే వారు. ఇందులో అష్టదిగ్గజాలు