చెడు చేస్తే కీడు తప్పదు

అనగనగా ఒక రాజు. పరమ క్రూరుడు. అసలు అతనికి దయ అనేదే లేదు. జనులను ఎంతో బాధపెట్టేవాడు. అటువంటి రాజు ఒకనాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులే కాకుండా రాజ్యంలోని ప్రజలందరినీ సమావేశపరిచాడు. ఈ సందర్భంగా ఒక ప్రమాణం చేశాడు. ‘నేను ఈ రోజు నుంచీ ఎవరినీ బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను. దయతో ప్రవర్తిస్తాను’. ఈ విధంగా

నిరాడంబర భక్తి

రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక అరణ్యం ఉండేది. ఒక సాధువు ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. రామాపురం ప్రజలు ఆయన బోధనలు వినడానికి వెళ్లేవారు. కష్టాలలో, బాధలలో ఉన్న వారికి ఆయన వాక్కులు ఎంతో స్వాంతన కలిగించేవి. చల్లని ఆయన చేతి స్పర్శ ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేసేది.

మాటలు-ఈటెలు

మాటలు-ఈటెలు మహా విష్ణువు ధరించే పాదుకలను చూసి శంఖం, చక్రం, కిరీటం ఒకసారి అపహాస్యం చేశాయట. ‘మేం చూడు.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామో! నీవో? పాదాల కింద పడి ఉన్నావు’ అని పాదుకలను అవి ఎగతాళి చేశాయి. ‘నేను స్వామి పాదాల కింద ఉన్నందుకు సంతోషిస్తున్నాను. మహర్షులు అందరూ మన స్వామి పాదాలకే కదా మొదట నమస్కరించేది. భక్తులు పూజించేదీ ఆ పాదాలనే కదా! మహా విష్ణువు పాదసేవా భాగ్యం లభించాలని

తెలుగుపత్రిక.. ఇకపై సరికొత్తగా..

విలక్షణ శీర్షికలతో తెలుగు వారి లోగిళ్లలో వెలుగులు నింపుతున్న తెలుగుపత్రిక ఆరంభమైన అచిరకాలంలోనే అందరి ఆదరాభిమానాలను చూరగొంది. పది నెలల పాటు విదేశీ గడ్డపై తెలుగు సౌరభాలను విరజిమ్మింది. అయితే, పత్రికను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలుగుపత్రిక బృందం ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. ‘పత్రిక ఎలా ఉంది?’, ‘ఇంకా ఎటువంటి శీర్షికలు కావాలని కోరుకుంటున్నారు?’, ‘పాఠకుల ఆసక్తులు, అభిరుచులు ఏమిటి?’ తదితర అంశాలపై పాఠకుల నాడిని కనుగొనే

వెలుగుల వేడుక

అలంకారాలన్నింటిలో వెలుగే పెద్ద అలంకారం. అసలు ఏ అలంకారమైనా వెలుగు లేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనో, వెలుగు చిమ్మే బాణసంచాతోనే వేడుకలు సాగించడం అలవాటు. దీన్నిబట్టి మానవ స్వభావంలోనే వెలుగురవ్వలు ఉత్సాహానందాలకు ఉనికిపట్టు అనే భావం దాగి ఉందని స్పష్టమవుతోంది. అందుకే మన భారతావని నేలపై దీపావళి పర్వం వెలుగుపూల వేడుకగా ఆవిర్భవించింది. యుగాల క్రితం భారతీయ సంస్క•తి

Top