ఆయుర్వేదం.. నిద్రా విధి

ఆయుర్వేదంలో నిద్ర ప్రాధాన్యం గురించి ఇలా చెప్పారు` నిద్రాయత్తం సుఖం దు:ఖం పుష్టి కార్శం బలాబలమ్‌ వృషతా క్లీ బతా జ్ఞానం అజ్ఞానం జీవితం న చ తస్మాత్‌ హితా హితం స్వప్నం బుద్వా స్వప్నాత్‌ సుఖం బుధ: సుఖం ` దు:ఖం, వృద్ధి `క్షీణత, బలం` దుర్బలం, పుంస్త్వము` నపుంసకత్వం, తెలివి` తెలివిలేమి, చావు` బతుకు.. ఇవన్నీ నిద్రకు ఆధీనములై ఉన్నాయి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు నిద్ర యొక్క హితాహితములనెరిగి నిద్రించాలి. మాసిన బట్టలు ధరించువాడిని, దంతములు సరిగా తోముకొనని

ఆయుర్వేదం.. లేహ్యం

ఆయుర్వేదంలో వివిధ ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో లేహ్యములు ఒకటి. లేహ్యాలను తయారు చేయడానికి అవసరమైన మూలికల సమ్మేళనంతో ఫార్ములాలను బట్టి వాటిని రసంగానూ లేదా కషాయంగానూ మార్చాల్సి ఉంటుంది. అవి మరింత చిక్కగానూ, గాఢంగానూ, రుచిగానూ ఉండేందుకు బెల్లం లేదా ఖండశర్కరతో తగినంత వేడి చేసి పాకం రూపంలో మారుస్తారు. ఇలా తయారైన ఔషధాన్నే లేహ్యం లేదా అపలేహ్యం అని కూడా అంటారు. నేరుగా ఔషధాలను తీసుకోలేని వారు, చూర్ణాలను

శరీరం అంటే ఏమిటి?

ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరం` వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలు, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు, మలం, మూత్రం, స్వేదం అనే మూడు రకాల మలాలు కలిగి ఉంటుంది. వీటి సమ్మేళనమే శరీరం. ఇవన్నీ ప్రత్యేకమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. వీటి దోషాలు ఎక్కువైతే శరీరంలో వివిధ కదలికలు అతిగా జరుగుతుంటాయి. అప్పుడు శరీరంలో అనేక మార్పులు కలిగి రోగాలు పుట్టుకొస్తాయి. ఈ దోషాలు

ఆయుర్వేదం.. ఆరోగ్యం

నవంబర్‌ 2, 2021 ` జాతీయ ఆయుర్వేద దినోత్సవం తైలాభ్యంగనం ఆయుర్వేద శాస్త్రంలో చరకుడు తైల మర్దనం గురించి ఇలా రాశాడు. స్పర్శనే చాధికో వాయు స్పర్శనం చ త్వగాశ్రితమ్‌ త్వచశ్చ పరమోభ్యంగ తస్మాత్తం శీలయేన్నర శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ప్రధాన అవసరమైన ఆక్సిజన్‌ (వాయువు) ముఖ్యమైనది. వాయువు యొక్క గ్రహణ శక్తి కేవలం ముక్కు, నోరుకే కాక చర్మాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగనం పరమోపకారి. ఎందుకంటే, ముక్కు, నోటితో పాటుగా శరీరం

ఆయుర్వేదం.. ఆరోగ్యం

నవంబర్‌ 2, 2021 ` జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఆయుర్వేదం..భోజనవిధి చేతులు, కాళ్లు, ముఖం శుభ్రపరుచుకోకుండా, కనీసం నోరు కడుక్కోకుండా, నోరు పుక్కిలించకుండా అన్నం తినరాదు. పండ్లతో చక్కగా నమలకుండా దేనినీ తినరాదు. భోజనం చేసిన వెంటనే ఇతర పదార్థాలను తినకూడదు. ఆకలి కలిగినపుడు కడుపు నిండుగా తినడం మంచిది కాదు. మితముగానే భుజించాలి. ఉదయం, సాయంకాలం వేళల్లో రెండుసార్లు మాత్రమే భుజించాలి. మధ్యమధ్యలో తినడం మంచిది కాదు. భోజనం చేయడం అనేది ఆయుర్వేదం ప్రకారం అగ్నిహోత్రం వంటిది. అంటే అంత

Top