కచుడి విద్యాదీక్ష
ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీదకు మనసు పోనివ్వకుండా చదివితే మంచి ఫలితాలు సాధించగలమని ఈ కథ ద్వారా మహాభారతం చేస్తోన్న హితబోధ ఇది. ఇక, కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం నాటి మాట! కశ్యపుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు. ఈ అన్నదమ్ములు (రాక్షసులు, దేవతలు) నిరంతరం