ఇక విడుదలే తరువాయి!

మెగాస్టార్‍ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే హైదరాబాద్‍లో చిరంజీవి, బాలీవుడ్‍ తార మౌనీరాయ్‍పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. నృత్య దర్శకుడు గణేశ్‍ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనీరాయ్‍తో పాటు వంద మంది డ్యాన్సర్లతో ఈ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. దీంతో సినిమా పూర్తయినట్టు చిత్ర యూనిట్‍ తెలిపింది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవి సరసన త్రిష,

మనం చూస్తున్నది కాదు..

ఏం చేస్తున్నామో అదే నిజమైన ప్రపంచం! కాస్త సమయం దొరికితేనే కాదు.. పనులు మానుకుని మరీ నేటి తరం సోషల్‍ మీడియాలో తలమునకలైపోతోంది. మొబైల్‍పై రీల్స్, షార్టస్, వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను అదేపనిగా స్క్రోల్‍ చేయడం ఓ వ్యసనంగా మారిపోయింది. ఇది వారూ వీరూ అని కాదు.. అందరికీ అదేపనిగా మారిపోయింది. ఈ ‘సోషల్‍’ వ్యసనంపై కథానాయిక శ్రుతిహాసన్‍ కొన్ని మంచి విషయాలు చెప్పింది. నేటి తరం అందరూ వినాల్సిన

జీవిత పాఠాల ‘కోట’

తెలుగు సినిమాకు పెట్టని‘కోట’.. కోట శ్రీనివాసరావు. తెలుగుతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ, బాలీవుడ్‍లోనూ తనదైన శైలిలో నటించి, మెప్పించిన లెజండరీ నటుడాయన. ఇటీవలే కన్నుమూసిన ఆయన వెండితెరపై హీరోగా తప్ప మిగతా అన్ని పాత్రల్లోనూ మెప్పించి.. మెరిశారు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకున్నట్టు నటుడిగా ఆయా పాత్రల్లో ఇమిడిపోయి దానికి ప్రాణం పోయడంలో సిద్ధహస్తుడు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా పరిశ్రమలో నలభై

ఆనందమార్గం.. ఇదిగో ఇదే!

గతం.. భవిష్యత్తు.. ఒకటి వెంటాడుతుంది. మరొకటి భయపెడుతుంది. ఈ రెండింటి మధ్యా చిక్కుకుని మనిషి విలవిల్లాడతాడు. ఫలితంగా విలువైన వర్తమానం చేజారిపోతుంటుంది. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే జీవితంలో ఏ చిన్న అనుభూతినీ వదులుకోకూడదు. ‘ ఈ రోజు కలిగిన అనుభూతి రేపు కలగొచ్చు.. కలగకపోవచ్చు. కానీ, కరిగిపోయిన కాలమైతే తిరిగి రాదు కదా!. కాబట్టి ఈ క్షణంలోనే జీవించు.. ఈ క్షణాన్నే ఆనందించు’.. అనేది జపనీయుల ఆనంద జీవన మార్గం. ఇదే వాళ్ల

బహ్మ కడిగిన పాదము

దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం వర్ణనాతీతం. ఏటా బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. తనను ఆశ్రయించిన భక్తకోటికి వరదహస్తుడై అభయమిస్తాడు. రథాన్ని అధిరోహించిన కేశవుడిని దర్శించుకుంటే మళ్లీ జన్మలెత్తాల్సిన అవసరమే లేదంటారు. ప్రతి మనిషీ జన్మజన్మల సాధనలతో అందుకోవాల్సిన పారమార్థికం.. రథంపై ఊరేగే స్వామి వారిని చూస్తేనే కలుగుతుందని నమ్ముతారు. ముక్తి ఫలాన్ని భక్తులకు అందించే ఉత్సవమే బ్రహ్మోత్సవం.

Top