మధుమధురే మధుకైటభభంజనీ

రాక్షస సంహారం చేసిన జగన్మాత చివరి రోజున రణన్నినాదం చేసింది. సర్వ దుర్లక్షణాలకు ప్రతీకైన మహిషాసురుడిని మట్టుబెట్టింది. ఆ సమయంలోనే విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని ఆదిశంకరులు దర్శించి అమితానందాన్ని పొందారు. ‘అయిగిరినందిని, నందిత మేదిని’ అంటూ పులకించిపోయారు. ‘అయిజగదంబ కదంబ వనప్రియా’ అంటూ కీర్తించారు. ‘మధుమధురే మధుకైటభభంజనీ’ అంటూ ప్రార్థించారు. అదే 21 శ్లోకాల మహిషాసుర మర్దిని స్తోత్రంగా అవతరించింది. ఇందులోని ప్రతి అక్షరం మంత్రమే.. ప్రతి పదం, ప్రతి పాదం

నిమ్మపండు.. ఆరోగ్యం మెండు

నల్లమద్ది: దీని చూర్ణం లేదా కషాయం వ్రణాలను ఆర్చి వేస్తుంది. కఫాన్ని, మల దోషాన్ని, పైత్యాన్ని హరిస్తుంది. నల్ల వంకాయ: రుచిగా, మనోహరంగా ఉంటుంది. కఫ, పైత్యాలను అణచివేస్తుంది. రుచిని పుట్టిస్తుంది. విరేచనాన్ని జారీ చేస్తుంది. అతిగా తింటే నేత్రరోగాలను కలుగచేస్తుంది. నార చీర: వాతాన్ని తగ్గిస్తుంది. చలి, ఎండల వలన కలిగే బాధలను అణచివేస్తుంది. శుచిగా ఉంటుంది. నారింజ: ‘సి’ విటమిన్‍ అధికంగా లభించే పండు ఇది. చెట్టున పండినదయితే తియ్యగా ఉండి చలువ

మనోబలానికి మారుపేరు త్రిజటుడు

త్రిజటుడిని చూడగానే లోకంలోకి పేదరికమంతా ఒక్కచోటికి చేరి ఆకారం దాల్చిందా అనిపిస్తుంది. చినిగిపోయిన అంగవస్త్రం, అంతకంటే చినిగిపోయిన తుండుగుడ్డ, బక్కచిక్కిన శరీరం, ముడతలు పడిన ముఖం, మానిపోయిన గడ్డం, జడలు కట్టిన జుట్టు, మట్టిపట్టిన యజ్ఞోపవీతం, కప్పు సరిగా లేని కుటీరం, కుక్కి మంచం, కట్టుకున్న చీర, మెడలో పసుపుకొమ్ము తప్ప మరో చీరగాని, ఆభరణం గాని లేని ఇల్లాలు, ఇంటి నిండా గంపెడు పిల్లలు.. ఇదీ త్రిజటుని స్థితి, కుటుంబం

ఆరుద్ర వాన అదరు.. ఆశ్లేష వాన పిసరు

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఆముదపు చెట్టు చిన్నదైతే మొక్క. పెద్దదైతే చెట్టు.

తగిన కానుక

పూర్వం మగధ దేశాన్ని ధర్మగుప్తుడు అనే రాజు పాలిస్తుండే వాడు. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె సాటిలేని రూపసి. దైవభక్తి గలది. అపురూపంగా పుట్టిన ఆ సౌందర్యవతిని చూసుకుని రాజు మురిసిపోయేవాడు. ‘నా ముద్దుబిడ్డ ఇందువదనను ఎప్పటికైనా దైవభక్తి గల ఒక మహారాజుకు ఇచ్చి పెళ్లిచేస్తాను’ అంటూ ప్రతినబూనాడు. ఇందువదన పెరిగి పెద్దదయింది. దేశ దేశాల నుంచి ఎందరెందరో శ్రీమంతులు ఆ పిల్లను చూడవచ్చే వారు. కానైతే, తను అనుకున్న సుగుణాలన్నీ ఒక్కరిలోనూ కనిపించకపోవడం చేత ధర్మగుప్తుడికి వారిలో ఎవరూ

Top