జగన్నాథ రథయాత్ర
జూలై 4, గురువారం ఆషాఢ శుద్ధ విదియ తిథి నాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల