ఫోర్బస్లో ఇద్దరు భారతీయ అమెరికను
అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితాను ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బస్ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి 24వ స్థానంలో నిలివగా.. అపూర్వ మెహతా 31 స్థానాన్ని దక్కించుకున్నారు. రామస్వామి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యనభ్యసించారు.