వస్తుగుణ దీపిక
మామిడిపువ్వు: ఈ పువ్వు వగరు, తీపి రుచులు కలిగి, సువాసన వెదజల్లుతుంది. పైత్యశాంతి, మేహశాంతిని కలిగిస్తుంది. వీటిని పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా ఇవే గుణాలను అందజేస్తాయి. వీటి కషాయాన్ని పుక్కిలిస్తే పంటినొప్పులు, చిగుళ్ల వాపులు పోతాయి. దీన్ని తాగితే నీళ్ల విరేచనాలు కలుగుతాయి. మారేడుచెట్టు: దీని వేరు లేదంటే ఆకు రసం, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతిని కలుగజేస్తుంది. జఠరదీప్తినిస్తుంది. విచారాన్ని, అజీర్ణాన్ని పోగొడుతుంది. తాపం, జ్వరాలు కూడా పోతాయి. వేరు కషాయం




