ఆధ్యాత్మిక వికాసం

అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే, మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న. తల్లి తన మాటలతో బిడ్డలకు ధైర్యం చెబితే నాన్న తన చేతలతో మనలో ధైర్యం నింపుతాడు. మన తొలి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే. మనల్ని తీర్చిదిద్ది, మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు మనల్ని వేలుపట్టి నడిపించి, విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయడానికి అమ్మతో కలిసి నిరంతరం

కరివెన నిత్యాన్నదాన సత్రం షిర్డీ

సాయిబాబా షిర్డీలో జీవించినంత కాలం అన్నదానం చేస్తూనే ఉన్నారు. తానే స్వయంగా పెద్ద గుండిగల్లో అన్నం వండి అందరికీ వడ్డించే వారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని నువ్వు తిని, మరో నలుగురికి పెట్టడం కంటే పుణ్యం లేదని బాబా భక్తులకు బోధించే వారు. స్వయంగా వండి, దానిని గొప్ప ప్రేమతో, ఆదరంతో పెట్టాలని చెప్పే వారు. ఒంటరిగా కూర్చుని అన్నం తినరాదని, పక్కన మరో వ్యక్తిని, కనీసం పశుపక్ష్యాదులనైనా

కరివెన నిత్యాన్నదాన సత్రం

చిన్నికృష్ణుని వెన్నదొంగ వేషాలు, ఇంటింటికీ వెళ్లి పెరుగన్నం దొంగిలించి తిన్న బాలకృష్ణుడి లీలలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తే సాక్షాత్తూ బాలకృష్ణుడి కడుపు నింపినట్టే. అంతటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే గోపికలు ఈ నందకిశోరుడికి కొసరి కొసరి తినిపించిన క్షేత్రమిది. ఇక్కడకు వచ్చే భక్తులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అన్నదానం చేస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. అటువంటి పుణ్యాన్ని మీరూ పొందాలంటే

ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని

ఎందరో మునులు, రుషులు తపమాచరించిన పుణ్యభూమి నైమిశారణ్యం. అక్షయ పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం అపారమైన యశస్సును, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒక్కరికి ఒక్కరోజు ఆకలి తీర్చినా సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆహారం పెట్టినంత ఫలం, ఫలితం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని, ఇక్కడ అన్నదానం చేస్తే వారందరి ఆశీస్సులు

కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రంలో అన్నదానం

కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రంలో అన్నదానం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. నిత్యం వచ్చే వేలాది భక్తుల ఆకలి తీరుస్తూ, స్వామి వారి ప్రసాదాన్నే అన్నప్రసాదంగా అందిస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల కానీ, అన్నం స్వీకరించడం వల్ల కానీ లేదా అన్నదాన కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పాడు అందించడం వల్ల కానీ సకల దోషాలు తొలగిపోయి, కాణిపాక వరసిద్ధి వినాయకుడి

Top