బాలాత్రిపుర సుందరిదేవి

ఆంధప్రదేశ్‍లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం.. శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా భాసిల్లుతోన్న దివ్యక్షేత్రం. ఇక్కడ బాలాత్రిపుర సుందరిదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా ఇక్కడ పెట్టే అన్నదానాన్ని స్వీకరించడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని అంటారు. ఇక్కడ అమ్మవారు బాలిక రూపంలో స్వయంభువుగా వెలిశారు. ఇది శక్తిపీఠంతో సమానమైన మహిమ గల క్షేత్రం. త్రిపురాంతక క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు

కరివెన నిత్యాన్నదాన సత్రం

పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యం తనకున్న దాంట్లో అన్నదానం చేసేవాడు. ఆయన తాను రోజూ అన్నదానం చేస్తున్నాను కదా.. దాని మహిమ ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడట. కాశీకి వెళ్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని పండితులు చెప్పారు. దాంతో ఆ బ్రాహ్మణుడు కాశీకి పయనమయ్యాడు. రవాణా సౌకర్యం లేని రోజులు కదా.. కాలినడకన ఆయన వెళ్తుండగా అడవి మధ్యలోకి వచ్చే సరికి చీకటి పడింది. ఆయనకు ఒక

రామేశ్వరం..

లోకంలో మనుషులు ‘దాత - అదాత’ అని రెండు రకాలుగా ఉంటారట. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా.. ఇతరులను కూడా దానం చేయనివ్వకుండా తాను మాత్రమే తినేవాడు అదాత. దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అతడిని అగ్ని నశిపంచేస్తాడు. ఈ విషయాన్ని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది. ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానమట. దాత, అదాత ఇద్దరూ.. అన్న సంపాదనకు

జోగులాంబ నిజరూప దర్శనం

ఆకలితో గుక్కపట్టిన శిశువు తల్లి స్తన్యం నుంచి పాలచుక్కలు గొంతులో పడగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. వానజల్లు లక్షలాది చినుకులుగా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి సారవంతం చేసినట్టు.. ఒక్క మెతుకు శరీరాన్ని తేజోవంతం చేసి బతుకు నిలుపుతుంది. ఒకసారి భృగు మహర్షికి పరమాత్మ ఎవరో తెలుసుకోవాలనే కోరిక పుట్టిందట. ఘోర తపస్సు చేశాడు. బుద్ధి, ప్రాణం, అన్నం వంటివి కూడా పరబ్రహ్మమేనని గుర్తించాడు. జీవులన్నిటికీ ప్రాణాధారమైనది ఆహారం. అందుకే ఆహారాన్ని

అన్నమో రామచంద్రా! అని నానుడి. ఆకలితో ఉన్న వారు

ఆహారం కోసం.. ఆదుకునే వారి కోసం శ్రీరాముడిని వేడుకునే పిలుపది. ఇది ప్రసిద్ధ తెలుగు వాక్యం. ఇది ఆకలి బాధను, రాముడిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. ‘ఓ రామచంద్రా! ఆకలితో ఉన్నాను.. ఆదుకో!’ అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. రాముడు నడయాడిన నేలంతా రామరాజ్యమే. అలాంటి రామరాజ్యంలో ఆకలితో ఎవరూ అలమటించరని, ఒకవేళ ఆకలితో ఉన్న వారు ఆ శ్రీరామచంద్రుడిని తలుచుకుంటే అన్నం దొరుకుతుందని హైందవ ధర్మంలో

Top