మూర్తీభవించిన స్త్రీమూర్తి..రేవతి
మంచి భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణునికి వదినగా, కృష్ణుని అష్టభార్యలకూ తోడికోడలిగానే కాదు మంచి బాధ్యత గల రాణిగా తన స్థానాన్ని సుస్థిరపర్చుకున్న రేవతి పాత్ర చాలా చిన్నదిగా కనిపించినా, ఆమెలోని పరిపక్వత అద్భుతం. రేవతి కుమార్తె శశిరేఖను కృష్ణుడు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్న ప్పుడు, రేవతి భర్త బలరాముడు శశిరేఖను దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇస్తానన్నప్పుడు మదనపడింది సముద్రంలో నిర్మించిన కుశస్థలి అనే అద్భుత నగరాన్ని పాలించే