శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాల

రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించి ఉన్నాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనం రావణ ప్రోక్త న్యాస పక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అనీ అంటారు. మార్చి 4, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని శ్లోకార్థ తాత్పర్యం. తత్పురుషణ ముఖ ధ్యానమ్‍ సంపర్తాగ్ని తటిప్రదీప్త కనక ప్రస్పర్థితేజోమయం గంభీర ధ్వని మిశ్రితోగ్ర

రాజా ధర్మానికి ఆద్యుడు భరద్వాజుడు

అంగీరసుడికి శ్రద్ధ అనే భార్య వలన ఇద్దరు కుమారులు కలిగారు. వీరిలో పెద్దవాడు ఉతధ్యుడు. రెండవ వాడు బృహస్పతి. కుమారు లిద్దరికీ తండ్రి వివాహం చేశాడు. ఉతధ్యుడి భార్య మమత. బృహస్పతి భార్య తార. ఇద్దరూ గృహస్థాశ్రమంలో సుఖంగా జీవించసాగారు. కాలం గడు స్తోంది. ఒకనాడు మమత భర్తను సమీపించి పుత్రుని ప్రసాదించాలని కోరగా ఉతధ్యుడు ఆమెను భోగించగా గర్భవతి అయ్యింది. భర్తకు సేవ చేస్తూ గర్భాన్ని రక్షించుకుంటూ కాలక్షేపం

రాముడు చెక్కిన ఆంజనేయుడు

శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే. శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీ తీరాన ఉందీ వాయు క్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‍ । భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్‍ ।। అంటే.. శ్రీరామ సంకీర్తన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో

కొయ్య – చెట్లు

ఒక కొండ మీద ఉన్న అడవిలో మూడు చెట్లు ఉన్నాయి. అవి వాటి ఆశలు, ఆశయాల గురించీ, వాటి కలలను గురించీ ముచ్చటించు కుంటున్నాయి. మొదటి చెట్టు ‘‘ఏదో ఒక రోజున నేను ధనాగారాన్ని అవుతాననే ఆశ ఉంది. నేను బంగారంతోను, వెండితోను నింపబడి ఉంటాను. మణులతోను అలంకరింపబడి ఉంటాను, నా మీద నగిషీ పని చెక్కబడి ఉంటుంది. నా అందాన్ని చూడడానికి ప్రతివారూ వస్తారు’’ అంది. రెండవ చెట్టు, ‘‘ఒక

మంత్ర పుష్పం

మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రా లున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్ర మైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు. మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగు తాయని అధర్వణవేదం చెబుతుంది. ‘మన్‍’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది.

Top