బాబా సీమోల్లంఘనం
షిర్డీ సాయిబాబా విజయదశమి (దసరా) నాడే దేహత్యాగం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. 1918వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, అక్టోబరు 15వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సాయిబాబా భౌతిక శరీరాన్ని విడిచారు. పుణ్యతిథి వేళ బాబా భౌతికంగా సమాధి చెందిన లీల, తాను దేహత్యాగం చేయనున్న సంగతిని మహా సమాధి పొందడానికి రెండు సంవత్సరాల