।। రుద్ర నామం భజే ।।
శివరాత్రి మహాత్మ్యాన్ని వర్ణించే కథలు- లింగ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. లింగ పురాణంలో వర్ణించిన ప్రకారం- ఒకనాడు కైలాస శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాశీనులై ఉన్నారు. పార్వతి- ‘దేవ దేవేశా! అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైన వ్రతం, భుక్తి, ముక్తి ప్రదాయకమైన దానిని గురించి తెలిపి నన్ను కృతార్థురాలిని చేయండి’ అని కోరింది. దీంతో శివుడు- దేవీ! శివరాత్రి వ్రతం ఒకటుంది. అది పరమ రహస్యం. సర్వయజ్ఞ




