నరకలోక శిక్షలు

ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగదేహం రెండు రకాలు. ఒకటి- సూక్ష్మదేహం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ద్వ లోకాలకు చేరుతుంది. రెండవది- యాతనా దేహం. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను నానా

సామెత కద

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఏదైనా ఒక పని చేయడానికి కొందరు చాలా హడావుడి చేస్తారు. ఏదో జరిగిపోతుందని, జరగబోతుందనే భావన కలిగిస్తారు. తీరా చివరికి వచ్చే సరికి ఏం తేల్చలేక తుస్‍మనిపిస్తారు. ఇటువంటి సందర్భాలలోనే ఎక్కువగా ఈ సామెతను వినియోగిస్తుంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ సామెత ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని నాయకులు ప్రకటించడం, చివరకు ఏం చేయలేక చేతులెత్తేయడం వంటి సందర్భాలకు ఇది

ఆ వస్తువు తీసి ల కోటాలో పెట్టు!

ఎవరో ఒకరు పుట్టించకుండా మాటలెలా పుడతాయి? అవును. మన తెలుగులో ప్రసిద్ధ రచయితలు రాసిన, వాడిన పదాలు, మాటలను ఎవరూ పట్టించుకోకపోతే ఏమైపోతాయి? ఇదీ నిజమే. మరీ ప్రాచీనకాలం నాటివీ కాదు.. అలాగని మరీ ప్రబంధ కాలం నాటివీ కాదు.. ఆధునిక యుగం ప్రారంభమయ్యాక వెలువడిన తాజా రచనల్లోని పదాలను కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. నిజానికి అవెంతో అర్ధవంతమైనవి. మరెంతో అందమైనవి. అటువంటి ఆణిముత్యాల్లాంటి పదాలు మన తెలుగుకే సొంతం.

‘ఊ’.. కొడతారా?

పిల్లలకు కథలు చెప్పడం వారిని ‘దారి’లో పెట్టడానికే. ఊ కొట్టించి, కేవలం నిద్రపుచ్చడానికి మాత్రమే కాదు.. వారిని వాళ్లదైన ఊహాలోకంలోకి తీసుకెళ్లి వాళ్లలో నిద్రాణంగా ఉండే సృజనాత్మక శక్తిని పెంచడానికి కూడా!. అందుకే కథలంటే చిన్నారులు చెవికోసుకుంటారు. వాళ్లని వికాస సంపన్నులను చేయడానికి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు కథలనే చెప్పాలి. కథలనే చదివించాలి. చిన్నారుల్లో క్రమంగా ఆలోచనా పరిధిని పెంచడానికి కథలే మార్గం. పైగా వారిని తేలికపరచడానికి ఉపకరించేవి కూడా

Top