సంక్రాతి మీలా సందడి

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దేశించారు. ఆ సమయంలో ఉండే వాతావరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతాయి. జవనరి 14, 15, 16 తేదీలలో మూడు రోజుల సంక్రాంతి పర్వం సందర్భంగా

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది పుష్యమాసంలో వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేది పుష్య (జనవరి) మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించడానికి గుర్తుగానే సంక్రాంతి పర్వాన్ని నిర్వహించుకుంటారు. సంక్రాంతి సంప్రదాయాలు చాలానే ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనక ఉన్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా వాటినెలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. సంక్రాంతి సందర్భంగా ఆచరించి, పాటించే నియమాల వెనుక ఉన్న కథ ఇదీ..

ముగ్గులు: ఓర్పును నేర్పే కళ

సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ముగ్గులు. ఇంటి ముందు లోగిళ్లలో పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు.. గంటసేపు ట్రెడ్‍మిల్‍ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు లెక్కపెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నోసార్లు లేవాలి. వంగాలి. అసంఖ్యాకంగా కదలాలి. అందులోనూ జారిపోయే కొంగును సరి చేసుకుంటూ, ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు•• ఇంటికి అలంకరణే కాదు. అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‍ సాల్వింగ్‍ వంటిది ముగ్గు. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని నేర్పుతాయి.

భోగి మం•: వ్యామోహానికి నిప్పు

మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రి వ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళ్తే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికి కాలువ మీదుగా వెళ్తే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే. మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. ‘అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు’ అని పట్టుకు వెళ్లాడుతాం. పాడైపోయిన పాత వస్తువునే అంత సులభంగా వదులుకోకపోతే, రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంత వరకు ప్రాణ భయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటలో వదిలేయి.

గంగిరెద్దులు, హరిదాసులు: భిక్షానికీ ఓ ధర్మం

ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే భిక్షమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవారు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటాడు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామ కీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా వెళ్లిపోతాడు. పండుగ వెళ్లాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళ్తే మంచిది.

గుమ్మడికాయ: తీగల్లా అల్లుకుపోవాలి

ఎప్పుడూ గుర్తుకు రాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతాన వృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వ స్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్త•తంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్త•తి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

గొబ్బెమ్మలు: అసహ్యం నుంచి అద్భుతం

కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టినదే గొబ్బెమ్మ. ఈ భూమి మీద ఉన్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతీదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పేడ పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు.

భోగిపండ్లు: యోగివా? భోగివా?

సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాది నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగిపండ్లు లేదా బదరీఫలంలో ఎనలేని ఔషధ గుణాలు ఉన్నాయి. చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (ఫైబర్‍) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కానీ సమస్య తొలగదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనుక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోజనం చేసిన తరువాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దీని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

బదరీ వనంలోనే వ్యాసుడు తపస్సు చేసే వాడనే ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అనే పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్క•తిలో రేగుపండ్లకు ఉన్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండుగ పూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు వేస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం. అలాగే, భోగి పండ్లను పిల్లల మీదుగా వేయడం ద్వారా దిష్టి దోషం పోతుందనేది కూడా ఒక విశ్వాసం.

గాలిపటం: దారంలాంటి జీవితం

ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్టు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసు కుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైనా ముందుకు వెళ్తుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడు లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు: యుద్ధనీతిని గెలిపించే పందెం

పండుగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడి పందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కానీ ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించే వారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాత రోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడి పందెం ద్వారా పరిష్కరించే వారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడి పందెమే పరిష్క రించింది. యుద్ధనీతిని తెలియచేసింది.

పశుపూజ: శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిం దంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండుగ రోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పు కోవాలని చాటుతోంది పశుపూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అనే నానుడి పుట్టుకొచ్చింది.

ఇదండీ సంక్రాంతి సంప్రదాయం. పైన తెలిపిన విధాయ కృత్యాలను మనం ఆచ రించడంతో పాటు మన తరువాతి తరాల.

Review సంక్రాతి మీలా సందడి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top