జగదంబ మూల మంత్రార్థం
పంచానికి మూలమైన పరమాత్మను తెలియచేసే శబ్దం- ప్రణవం. అదే ఓంకారం. దీనిలో అ, ఉ, మ, అనే ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా రూపాం తరం చెందాయి. ‘అ’కారం పలకగానే నోరు తెరుచుకుంటుంది. అది సృష్టిని తెలియచేస్తుంది. ‘మ’కారం పలకగానే నోరు మూసుకుంటుంది. ఇది ఓష్ఠ్యం క్రియ. ఇది సంపూర్ణతను సూచిస్తుంది. ఈ రెండింటి నడుమ ఉన్నదే స్థితి. అందుకే ‘అమ్మ’ సంపూర్ణ శబ్దమైనది. ఓంకారమంత విలువైన, శ్రేష్ఠమైన మంత్రం- ‘అమ్మ’.




