పరవశింపచేసే కథలు.. పరమేశ్వరుని గాథలు

శివ పురాణం ఎన్నో కథల సమాహారం. శివ పురాణాన్ని అమూలాగ్రం చదవలేని వారు ఆ పురాణంలో భాగంగా ఉండే శివలీలలను చదివితే చాలు.. ఎంతో ఆధ్యాత్మిక వికాసం, విజ్ఞానం లభిస్తాయి. విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రాలు, మానవ వికాస మంత్రాలు మనని శక్తిమంతం చేస్తాయి. మనిషిగా నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేకానేక సమస్యలను ఎలా అధిగమించాలో నేర్పు సాధనాలు ఆ శివలీలల్లో ఎన్నో ఉన్నాయి. ‘శివ’ అనే స్వరూపం

దీపావళి లక్ష్మీ.. రావమ్మా మా ఇంటికి

భాగ్యానికి ఆలవాలమైనదీ, క్షీంర సముద్ర రాజ తనయా, శ్రీరంగంలో వెలసిన దేవీ, దేవలోక స్త్రీలనందరినీ దాసీజనంగా చేసుకొన్నదీ, లోకానికి ఏకైక దీపంగా భాసిస్తున్నదీ, ఎవరి మృదుల కటాక్షంతో బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడు వైభవం సంతరించుకొన్నారో, మూడు లోకాలనూ తన కుటుంబంగా చేసుకొన్నదీ, తామర కొలనులో ఉద్భవించినదీ, మహా విష్ణువుకు ప్రియాతి ప్రియమైనదీ అయిన లక్ష్మీ.. నీకు నమస్కారం! దీపావళి వేళ పూజలందుకునే ప్రధాన దైవం లక్ష్మీదేవే. ఆ విష్ణువు దేవేరిని పూజిస్తే

అనాయకైక నాయకమ్‍। నమామి తం వినాయకమ్‍।।

వక్రతుండం ఓంకార ప్రతీక. లంబోదరం బ్రహ్మాండ సూచిక. గణపతి ఓంకార స్వరూపుడు. సర్వగణములకు అధిపతి. అందుకే ఆయనకు వినాయకుడనే పేరొచ్చింది. కార్యసిద్ధి, అందుకు అనువైన బుద్ధి గణేశుని అధీనం. కనుకనే ఆయన సిద్ధిబుద్ధి ప్రియుడు. ఆయనకు వేరే నాయకుడు లేడు. కాబట్టి ఆయన వినాయకుడు. త్రిమూర్తులను నడిపించే నాయకుడు కనుక విశిష్ట నాయకుడు. గణపతి సగుణ, నిర్గుణ స్వరూపతత్త్వం. త్రిమూర్తుల పూజలు కూడా అందుకునే దైవం. అందుకే ఆయన ఆది దేవుడు. గణపతిని సదాచారులు లక్ష్మీగణపతిగా, వైష్ణవులు విష్వక్సేనునిగా, వామాచారులు ఉచ్ఛిష్ఠ గణపతిగా, బౌద్ధులు గజాననునిగా భావించి

టెండ్‍ మారినా ఫ్రెండ్‍ మారడు!

సఖ్యత కుదిరిన ప్రతిచోటా స్నేహం పూస్తుంది. గాలి మేఘంతో, మేఘం నీటితో, నీరు నేలతో, నేల మొక్కతో, మొక్క పువ్వుతో, పువ్వు పరిమళంతో.. ఇలా పుట్టిన స్నేహాలన్నీ సఖ్యతతో ఏర్పడిన స్నేహాలే. ఇవన్నీ పరస్పర ఆశ్రితాలే కాదు.. పరస్పర ప్రయోజనకారులు కూడా. మనకు ఆస్తిపాస్తులు లేకున్నా పర్వాలేదు. బుద్ధిమంతులైన వారితో స్నేహం చేస్తే పరస్పర ప్రయోజనం పొందవచ్చు. ఆస్తిపాస్తులు, హంగూ ఆర్బాటాలు ఎన్ని ఉన్నా మనిషికి ఆత్మపరిశీలనకు మించిన ప్రక్షాళన లేదు.

హ్యాట్రిక్‍ ప్రధాని.. మోదీ 3.0

బీజేపీ మళ్లీ గెలిచింది.. మిత్రపక్షాల సాయంతో నిలిచింది. కాంగ్రెస్‍ సవాల్‍ విసిరినా.. సమాజ్‍వాదీ పార్టీ యూపీలో దెబ్బతీసినా.. తృణమూల్‍ సత్తా చాటినా.. డీఎంకే ధీటుగా నిలిచినా.. ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. భారతీయ జనతా పార్టీ మళ్లీ గెలిచింది.. నిలిచింది. ఆంధప్రదేశ్‍లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అండతో, బిహార్‍లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో, శివసేన (శిందే) సహకారంతో, ఎల్‍జేపీ (రాంవిలాస్‍) చేయూతతో

Top