కవర్ స్టోరీ
దేవదేవుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకానికి వేంచేశాడు. వస్తూ వస్తూ వైకుంఠంలో ఉండే కొండలనూ, కోనలనూ, తీర్థాలనూ వెంట తెచ్చుకున్నాడు. తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో పాటు సేవకులైన గరుత్మంతుడు ఇతర పరివారమంతా ఆయన వెంటే ఉన్నారు. ఆ దేవదేవుడు నేరుగా సప్తగిరులలో అడుగిడాడు. అదిగో! అదే శ్రీహరివాసమైంది. ఆ స్వామి ఈ భూలోకంలో ఏరికోరి.. అదీ తెలుగింటి నేలపై ఇల్లు (ఆలయం) గుడి కట్టుకుని.. తెలుగువారి ఇంటింటి ఇలవేల్పుగా




