కవర్‍ స్టోరీ … వినాయకుడు.. శ్రీకృష్ణుడు..

వినాయకుడు.. శ్రీకృష్ణుడు.. ఒకరు విఘ్నాలను హరించే విఘ్నహర్త.. మరొకరు విశ్వాన్ని నడిపించే సృష్టికర్త.. ఏ పనైనా మొదలుపెట్టే ముందు వినాయకుడిని తలుచుకునే తొలి అడుగు వేసేది.. ఆ పని ముందుకు సాగడానికి మలి అడుగులు పడేది కృష్ణుడు చలువతోనే.. విఘ్నేశ్వరుడు మనకు మంచి ఆరంభాన్ని, స్థిరత్వాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తాడు..ఆ లక్షణాల సాయంతో మన జీవనయానాన్ని గమ్యానికి చేర్చే మార్గదర్శనం చేసేవాడు కృష్ణుడు.. భారతీయ ఆధ్యాత్మిక పరంపరలో వీరిద్దరూ విశిష్ట దైవాలు. అత్యంత పూజనీయమైన, అత్యున్నతమైన

వరలక్ష్మ

వరలక్ష్మి విధిని ధిక్కరించగల శక్తిమంతురాలు. తలరాతలు మార్చగల సమర్థురాలు. ‘బ్రహ్మదేవుడు ఇతడిని పేదవాడిగా పుట్టించాడు. పేదరికంలోనే బతకాలని శాసించాడు. ఆ రాతను నువ్వు కాలిగోటితో తుడిచేయగలవు తల్లీ!’ అంటూ కనకధారాస్తవంలో లక్ష్మీదేవిని కొనియాడతారు ఆదిశంకరులు. ఆ వాక్యాలు అక్షర సత్యాలు. కాబట్టే పరమ దరిద్రుడి పూరిగుడిసె మీద బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందా పరదేవత. నల్లధనమై నేలమాళిగలో మగ్గి పొమ్మనో.. దొంగసొత్తుగా విదేశా లకు తరలిపొమ్మనో షరతులు పెడితే మాత్రం భాగ్యలక్ష్మి అసలు ఒప్పుకోదు. కళ్లెర్రజేసి కటకటాలకు పంపుతుంది. ‘అందరూ

కవర్‍ స్టోరీ

తీర్చిదిద్దినట్టుండే శరీర సౌష్టవం.. మంచి ఆరోగ్యం.. సంపూర్ణ ఆయుష్షు.. మది నిండా ఆనందం.. గుండె నిండా ధైర్యం.. ఇవన్నీ ఒక్కచోటే దొరికే జాగా.. యోగా! ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ.. యోగ. దేహాన్ని దేవాలయంగా, జీవుడిని దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా మలుచుకోవడానికి ‘యోగ మార్గ’మే శరణ్యం. యుగాలు మారినా.. తరాలు కదిలినా.. ఆర్టిఫిషియన్‍ ఇంటెలిజెన్స్లు, అల్గరిథమ్‍లు వచ్చినా.. అనాది కాలం నుంచి ఆధునిక

నిత్యానంద ‘కరివెన’!

‘‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ।।’’ అని ఆ కాశీ విశ్వనాథుని భార్య అన్నపూర్ణాదేవి గురించి వర్ణించారు ఆదిశంకరాచార్యులు. అన్న= అన్నము, పూర్ణ= పూర్ణముగా (నిండుగా) ప్రసాదించే తల్లి- అన్నపూర్ణ. ఆ మాతాన్నపూర్ణేశ్వరి- నిత్యానందకరి. కృపావలంబనకరి. నిత్యమూ ఆనందాన్ని, ఆహారాన్ని, కృపను వర్షిస్తూ భక్తులకు వాటిని ప్రసాదించే తల్లి ఆమె. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా ‘నిత్యాన్నదాన నిత్యానందగా భాసిల్లుతోంది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు నిత్యం అన్నదాన

సింహాచల స్వామి చందనమయ

నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్య మండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి, మూలాధారానికి, విశ్వచైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నారసింహ తత్త్వం. సింహాచల స్వామి చందనమయ లింగాకృతిలో సదా దర్శనమిస్తూ శివకేశవుల అభేదానికి ప్రత్యక్ష నిదర్శనమై భక్తకోటిని అనుగ్రహిస్తుంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే శ్రీ నరసింహావతార ఉద్దేశం. తెలుగునాట

Top