ఆడుతూపాడుతూ.. చదవాలి..గెలవాలి!

నవంబరు 14, బాలల దినోత్సవం సందర్భంగా ఈ మాసపు ప్రత్యేక కథనమిది.. ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు.. నడుం వంగిపోయే బరువుతో బ్యాగులు మోస్తూ ఏ విద్యార్థీ కనిపించడు. యూనిఫాం, హోంవర్కులూ, వార్షిక పరీక్షలూ మార్కులూ, ర్యాంకుల పోటీ, రోజంతా సాగే స్కూలు.. స్టడీ అవర్లూ, ట్యూషన్లూ.. ఇవేవీ అక్కడ కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులను కష్టపెట్టే ఏ చిన్న విధానమూ అక్కడ అమలు చేయరు.

దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వమ్‍ దీపలక్ష్మీ నమోస్తుతే బ్రహ్మ సకల జ్ఞానానికీ అధిపతి. దీపం సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపం. అది సకల తమో గుణాలనూ హరించివేస్తుంది. ఎలాంటి కార్యాన్నయినా సాధించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అలాంటి దీపలక్ష్మీ నీకు నమస్కారం!. దీపానికి హైందవ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. నిత్య పూజా విధిలో అది ప్రధాన భాగమై విరాజిల్లుతోంది. దీపారాధన చేయనిదే ఎలాంటి శుభకార్యాలూ ప్రారంభించకూడదని శాస్త్రం చెబుతోంది. జ్యోతి

దిలీప్‍ టుంకి… టూ లీడర్‍

నాయకుడు- అందరిలా సాధారణంగానే పుడతాడు. కానీ, అతడి అసాధారణ ఆలోచనలు, చర్యలే.. అతడిని నాయకత్వం వహించే వాడిగా తీర్చిదిద్దుతాయి. మార్పు- రాత్రికి రాత్రే రాదు. కానీ, మొగ్గ తొడిగి, మారాకు వేసి ఆకుగా రూపాంతరం చెందినట్టు ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణంలో మార్పు మొదలవుతుంది. ఆ ఆరంభమే కొత్త మార్పునకు నాంది పలుకుతుంది. గొప్ప నాయకత్వ పటిమ ఉన్న వారే గొప్ప మార్పునకు పునాది వేయగలుగుతారు. నాయకుడంటే ముందుండి నడిపించే వాడు కాదు..

వరలక్ష్మీ వ్రత విధి

శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలనేది శాస్త్ర నియమం. ఒకవేళ ఆరోజు వీలు కాకుంటే తరువాత వచ్చే శుక్రవారాల్లోనైనా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మన భారతీయ ఆధ్యాత్మిక ఆచారాలలో అత్యంత ప్రాధాన్యమైనదీ వ్రతం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి విశిష్ట దేవత. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమైనదని అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన, ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట

నాణ్యమైన వైద్యానికి పూచీ.. మానవీయ చికిత్సకు హామీ..

హెటిరో.. ఫార్మాస్యూటికల్‍ రంగంలో తిరుగులేని బ్రాండ్‍.. 30 సంవత్సరాల చెరగని ముద్ర.. ఈ సంస్థకు ‘బండి’.. ‘సారథి’ తానై విజయవంతంగా నడిపిస్తోన్న శక్తి.. డాక్టర్‍ బండి పార్థసారథిరెడ్డి జ్ఞానం.. నాణ్యత.. ఆవిష్కరణ.. ఈ వైద్య విజ్ఞాన సంస్థ పురోగమనానికి మూడు చక్రాలైతే.. వాటికి మూలాధారమైన ఇరుసు.. పార్థసారథిరెడ్డి.. లైఫ్‍ సేవింగ్‍ మెడిసిన్స్తో దేశానికే ‘జీవ’గర్రగా మారిన హెటిరో ఇప్పుడు సింధు హాస్పిటల్స్ పేరుతో వైద్యసేవలు అందించడానికి పునరంకితమవుతోంది. ఆరోగ్య సంరక్షణలో హెటిరో 30 ఏళ్ల వారసత్వానికి, డాక్టర్‍

Top