సింహాచల స్వామి చందనమయ
నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్య మండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి, మూలాధారానికి, విశ్వచైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నారసింహ తత్త్వం. సింహాచల స్వామి చందనమయ లింగాకృతిలో సదా దర్శనమిస్తూ శివకేశవుల అభేదానికి ప్రత్యక్ష నిదర్శనమై భక్తకోటిని అనుగ్రహిస్తుంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే శ్రీ నరసింహావతార ఉద్దేశం. తెలుగునాట




