మన తెలుగు.. మన వెలుగు
పఠనం.. పాఠవం.. ఇటీవల పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. అంతర్జాలం మాయాజాలంలో పడి జనం ‘చదువు’ అనేదే మరిచిపోయారు. జర్మన్ కవి గోథె- ‘ప్రతి రోజూ ఉదయాన్నే ఒక మంచి పుస్తకంలోని వాఖ్యాలు చదవాలి. ఒక మంచి పాట వినాలి. ఒక అందమైన చిత్తరువును చూసి ఆనందించాలి. వీలైతే కొన్ని మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి’ అంటారు. కానీ, నేడు మనం అలా చేయగలుగుతున్నామా? మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిది.

