ప్రతి ధ్వని
ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాదిగా సమాధానం చెబుతున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో ‘అమ్మా’ అని అరిచాడు రఘు. అతను అరవకున్నా ఆ కొండ ప్రాంతంలో మరోసారి ‘అమ్మా’ అనే శబ్దం వినబడటంతో రఘు ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండలలో నుంచి రావడాన్ని