శ్రీవారికి కానుక.. ఆశీర్వాదాల వేడుక
వడ్డీకాసుల వాడికి ఎందరో భక్తులు. మదిలోని కోరికలు నెరవేరితే ఎందరెందరో కడతారు ముడుపులు. ఎన్నో రూపాల్లో చెల్లించుకుంటారు కానుకలు. స్థోమతకొద్దీ ఇస్తుంటారు కొందరు విరాళాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి భక్తుల రుణం ఉంచుకోవడం లేదు.. వారిచ్చిన విరాళాలు, కానుకలకు తగినట్టుగా ఇతోధికంగా సౌకర్యాలనూ కల్పిస్తోంది. దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకూ అందించి భక్తులకు ఆనందానుభూతులను పంచుతోంది. పది వేల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా విరాళాలు, కానుకల రూపంలో అందచేసిన వారికి పలు రకాల సేవలు, దర్శనాలు,




